పోస్ట్‌లు

2014లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Lakshmi Narasimha Swamy Temple, Guntur

చిత్రం
                  శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయం, గుంటూరు   సర్వ లోక రక్షకునిగా పేర్కొనే శ్రీ మన్నారాయణుని దశావతారాలలో తొలి నాలుగు అవతారాలు సంకల్ప మాత్రాన అవతరించినవి.జననీజనకులు లేకుండా జన్మించిన "సద్యోజాత రూపాలు". వీటిల్లో అత్యంత ప్రముఖమైనది శ్రీ నారసింహ అవతారం.దుష్ట సంహరునిగా, భక్త వరదునిగా, అపమృత్యు భయాన్ని తొలిగించేవానిగా, కోరిన కోర్కెలు కురిపించే కల్పతరువుగా  స్వామి ప్రసిద్దుడు. శ్రీ నరసింహునికి మన రాష్ట్రంలో పెక్కు ప్రసిద్ద ఆలయాలున్నాయి. కానీ హిరణ్యకశ్యపుని సంహరించిన తరువాత ఉగ్రత్వం చల్లారని స్వామి గర్జనలు చేస్తూ లోకాలను భయభ్రాంతులను చేస్తూ తిరగసాగారట. ఆ క్రమంలో స్వామి అనేక మంది రాక్షసులను సంహరించారని, ఆయా ప్రదేశాలలో కొలువైనారని గాధలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు రచించిన "శ్రీ నరసింహ ప్రాచీన గాథా లహరి" ప్రకారం శ్రీవారు ఇలా కొలువైన క్షేత్రాలు మన రాష్ట్రంలో ముప్పై రెండు. చివరకు ప్రహ్లాదుడు చేసిన విన్నపాలకు శాంతించి విశాఖపట్టణానికి సమీపంలో సముద్ర తీరాన ఉన్న భీమ...

Sri Lakshmi Narasimha Swamy Temple, Nakarikallu

చిత్రం
                      శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయం, నకరికల్లు   శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్ధం ధరించిన అనేక అవతారాలలో నారసింహ అవతారం ప్రత్యేకమైనది.  నర శరీరం సింహ శిరస్సుతో స్వామి ఆర్త రక్షకునిగానే కాకుండా సులభ ప్రసన్నునిగా అప మృత్యు భయాన్ని తొలిగించే వానిగా ప్రసిద్ది.  నరసింహుని ఆలయాలు చాలా వరకు దక్షిణ ముఖంగా ఉంటాయి. దక్షిణ దిక్కు యమ స్థానం.  తన భక్తులను యమ భాద పడకుండా కాపాడటానికే అన్నది భక్తుల నమ్మకం.  మరో ముఖ్య విశేషం స్వామి ఆలయాలన్నీ కొండల మీద సహజ సిద్దంగా ఏర్పడిన గుహలలో ఉంటాయి.  రూపం కూడా స్వయం ప్రకటిత రూపం.  తదనంతర కాలంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగినది. మిగిలిన ఆలయ భాగాల నిర్మాణం జరిగినట్లుగా చరిత్ర తెలుపుతుంది.  అదే విధంగా నారసింహ ఆలయాలలో సుదర్శన చక్రానికి, శ్రీ ఆంజనేయునికి అధిక ప్రాధాన్యత లభిస్తుంది. దగ్గరలో శివాలయం కూడా ఉండటం మరో ప్రత్యేకత. నారసింహ ఆరాధన ఎక్కువగా మన రాష్ట్రంతో సహా తమిళనాడు, కర్నాటక మరియు తెలంగాణా రాష్ట్రాలలో కనపడుతుంది. ఆంధ్రా మరియు తెలంగ...