26, మే 2015, మంగళవారం

Sri Paidi Thalli Ammavari Temple, Vizianagaram

                         శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, విజియనగరం  

పూసపాటి రాజవంశీకుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు.
అమ్మవారి గురించి ఇదు మిద్దంగా సంపూర్ణ చరిత్ర లభించడం లేదు.
కొందరు ఆమె విజియనగర గ్రామా దేవత అని ఇంకొందరు ఆమె రాజ వంశ ఆడబడుచని అంటారు. 


విజియ నగర వాసులు తమను కాపాడే దేవతగా భావించే పైదితల్లికి చదును గుడి మరియు వనం గుడి అని రండు ఆలయాలున్నాయి.
చదుని గుడి ఊళ్ళోని మూడు లాంతర్ల జంక్షన్ లో ఉండగా వనం గుడి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది.

నిత్య పూజలతో భక్తుల సందర్శనంతో రెండు నిత్య కలకలాడుతుంటాయి.
అన్ని పర్వదినాలలో విశేష పూజలు అలంకారాలు జరుపుతారు.

దసరాలలో నవరాత్రులను ఘనంగా జరుపుతారు.
ఈ దసరా ఉత్సవాల తరువాత వచ్చే తోలి మంగళవారం విజియ నగరం విశేష శోభను సంతరించుకొంటుంది.

అదే సిరి మానోత్సవ సంబర శోభ.
లక్షలాదిగా భక్తులు ఉత్తర ఆంద్ర జిల్లాల నుండి మరియు ఒడిష రాష్ట్రాల నుండి తరలి వస్తారు.






ప్రత్యేక విధానంలో సిరి మానును ఈ ఉత్సవ నిమిత్తం సేకరిస్తారు.







తప్పక చూడవలసిన ఉత్సవం ఇది. 

20, మే 2015, బుధవారం

Irumpanam Makaliyam Sree Rama Swamy Temple

                            శ్రీ రామ స్వామి ఆలయం, ఇరుంపాణం

 


భారతీయులకు శ్రీ రామ చంద్ర మూర్తి ఆరాధ్య దైవమే కాదు మార్గదర్శి, ఆమోదప్రదమైన ప్రభువు, ఆదర్శ మూర్తి.
శ్రీ రాముని ఆలయం లేని ఊరు భారత దేశంలో కనపడదు. రామాయణ పారాయణం చేయని హిందువు ఉండడు. 
శ్రీ రాముని ఆలయాలలో కొన్ని సమస్త ప్రజానీకానికి తెలిసి ప్రముఖ స్థానాన్ని పొందుతున్నాయి.
మరికొన్ని విశేష పురాణ నేపద్యం ఉన్నా స్థానికంగా కూడా అంత గుర్తింపు పొందనివి.
అలాంటి వాటిల్లో కేరళ రాష్ట్రం లోని  ఇరుంపాణం మకలియం శ్రీ రామ స్వామి ఆలయం ఒకటి.









కేరళ రాష్ట్రం లో నెలకొని ఉన్న శ్రీ రామాలయాలలో గర్భాలయంలో రాముడు ఒక్కరే ఉంటారు. మిగిలిన రాష్ట్రాలలో సీతాలక్ష్మణులతో పాటు దాసుడు శ్రీ హనుమంతునితో కలిసి పూజలందు కొంటారు దశరథ తనయుడు. ఇది ఇక్కడ, మిగిలిన ప్రదేశాలలోని రామాలయాలకు గల  ప్రధాన వత్యాసం. పోనీ ఉపాలయాలలో అయినా శ్రీ జానకీ మాత ఉంటారా అంటే అదీ కనపడదు. కేరళలో ప్రముఖ రామాలయం అయిన త్రిప్రయార్ లో కూడా ఇలానే ఉంటుంది. 








ఇరుంపాణం మకలియంలో జగదభిరాముడు కొలువు తీరడానికి వెనుక త్రేతా యుగం నాటి సంఘటనలే కారణం అని క్షేత్ర గాధ తెలుపుతోంది. 
లంకేశ్వరుని ముద్దుల చెల్లెలు శూర్పణఖ అరణ్య వాసం చేస్తున్న మనోభిరాముని చూసి వాంచించడం, సోదరుడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోయడం అందరికీ తెలిసిన కధే !









నిరాశకు తోడు ముక్కు చెవులు కోసివేసిన అవమానంతో శూర్పణఖ రోదిస్తూ తొలుత అదే అరణ్యంలో ఉన్న సోదరులు ఖర దూషణాదుల వద్దకు వెళ్ళింది.
సోదరికి జరిగిన పరాభవానికి ఆగ్రహానికి లోనైన వారు తమ బలగాలను తీసుకొని కోదండ పాణి మీదకు దండయాత్రకు తరలి వెళ్ళారు.









సీతాదేవిని లక్ష్మణుని సంరక్షణలో ఉంచి తామొక్కరే వేలాది మంది రాక్షసులను సంహరించారు కోదండపాణి.
అదే విధంగా వారి నాయకులైన ఖర దూషణ మరియు వారి సన్నిహితుడైన త్రిశరుని అంతం చేసారు అసురసంహార మూర్తి.
అకంనుడు అనే  వారి సహచరుడు తప్పించుకొని పారిపోయాడట. ప్రాణభయంతో సురక్షిత ప్రదేశంలో తలదాచుకున్న వానికి సుందర శాంత స్వరూపులైన దాశరది రుద్ర తాండవ రూపంలో పద్దెనిమిది హస్తాలతో రాక్షస సంహారం చేసిన విధానం పదే పదే తలపునకు వచ్చినదిట. తన భయాన్ని తొలగించుకోడానికి ఆ శ్రీరామచంద్రుని శరణు కోరడం ఒక్కటే మార్గం అని నిర్ణయించుకున్నాడట ఆ అసురుడు. అరణ్యానికి తిరిగి వెళ్ళి శ్రీ రాముని చరణాలకు మొక్కి తనను మన్నించమని కోరుకొన్నాడట. ఇతరులకు హాని చేయకుండా సాదు జీవనం గడపమని ఆదేశించారట అవతార పురుషుడు. 
తనకు ప్రాణభిక్ష పెట్టడమే కాకుండా హితోపదేశం చేసి, జీవిత గతిని మార్చిన ఆయన పట్ల గౌరవంతో ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్టించి, జీవితకాలం సేవించుకొన్నాడట. 
ఖరదూషణాదులతో శ్రీరాముడు సల్పిన  భీకర యుద్ధం జరిగిన స్థలం ఇదేనని చెబుతారు.
(ఇదే సంఘటన జరిగిన స్థలంగా ఛత్తీస్ ఘర్ రాష్ట్రం "ఖరోద్" అనే గ్రామాన్ని కూడా పేర్కొంటారు. ఖర దూషణనుల పేర్ల మీద "ఖరోద్" అన్న పేరు వచ్చినది అంటారు)






ఖరదూషణులతో పాటు వందలాది మంది అసురులను అంతం చేసిన ప్రదేశంలో, అసురుడు ప్రతిష్టించిన రణరంగ రాముని విగ్రహం అందుకని ఇక్కడ స్వామి ఉగ్ర రూపులై ఉంటారన్న భావనతో అందుకే నిరంతరం చందనంతో అలంకరించి శాంత పరుస్తారని చెబుతారు. రుద్ర రూపం దాల్చడం వలన సదాశివునికి మాదిరి నుదిటిన మూడో నేత్రం ఉందని భావిస్తారు.  స్వామి రెండు హస్తాలతో కొలువు తీరి కనిపిస్తున్నామిగిలిన పదహారు హస్తాలు అదృశ్యంగా ఉంటాయని, భక్తులకు హాని తల పెట్టేవారిని అంతం చేసే సమయంలో అవి దర్శనమిస్తాయని విశ్వసిస్తారు. 
మూల విరాట్టు ఐదున్నర అడుగుల ఎత్తుతో ధనుర్భాణాలు ధరించి సుందర చందన పుష్ప అలంకరణతో స్థానక భంగిమలో నయన మనోహరంగా దర్శనమిస్తారు. 
సువిశాల ప్రాంగణంలో పడమర దిశగా ఉంటుందీ ఆలయం. తూర్పున కూడా ద్వారం అక్కడ ఒక రాతి దీప స్థంభం ఉంచారు. 









ఉపాలయాలలొ శ్రీ గణపతి మరియు శ్రీ ధర్మ శాస్త కొలువై ఉంటారు.
ధ్వజస్తంభం వద్ద గరుత్మంతుడు మరియు ఆంజనేయుడు స్వామి సేవకు సిద్దంగా ఉంటారు.
విశాల ప్రాంగణంలో పూర్తిగా కేరళ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడి, సుందరంగా ఉంటుంది. నలుచదరపు పెంకుల మండపం, తూర్పున ఎత్తైన ఉత్సవ మండపం కనపడతాయి. 
సుమారు పదకొండు వందల సంవత్సరాల క్రిందట చేర వంశ రాజులు తొట్ట తొలి ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసన ఆధారాలు తెలుపుతున్నాయి.
కానీ రెండువందల సంవత్సరాల క్రిందట జరిగిన భయంకర అగ్ని ప్రమాదంలో ఆలయం పూర్తిగా కాలిపోయింది.
నాటి కొచ్చిన్ రాజులు ఆలయాన్ని యధాతధంగా పునః నిర్మించారు.
నిత్యం మూడు పూజలు , అభిషేకాలు , అలంకరణలు నివేదనలు శ్రీ రామ స్వామికి నియమంగా జరుపుతారు.  











గణేష చతుర్ధి, హనుమజ్జయంతి, ఓనం, విషు లతో పాటు శ్రీ రామ నవమి వైభవంగా నిర్వహిస్తారు. 
జన్మ రీత్యా, జాతక రీత్యా ఏర్పడే గ్రహ దోషాలను హరించే వానిగా శ్రీ రామ స్వామి ప్రసిద్ది.  ప్రత్యేక పూజలు జరిపించుకోడానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. 
గమనించవలసిన అంశం ఏమిటంటే ఆలయ సమయాలు.  మరెక్కడా లేని విధంగా ఈ ఆలయాన్ని ఉదయం అయిదున్నర గంటల నుండి తొమ్మిది గంటల వరకు తిరిగి సాయంత్రం అయిదున్నర నుండి రాత్రి ఏడున్నర వరకు మాత్రమే తెరవబడి ఉంటుంది. ఒకసారి మూసివేస్తే తరువాతి సమయంలో తప్ప మధ్యలో ఆలయాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా తెరువరు. 









ఈ విశిష్ట క్షేత్రం కొచ్చిన్ నగర శివారు ప్రాంతమైన "త్రిపునిత్తూర"కు అయిదు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది .
ఎర్నాకుళం జంక్షన్ లేదా టౌన్ రైల్వే స్టేషన్లల నుండి బస్సులు  త్రిపునిత్తూరకు లభిస్తాయి. అక్కడ నుండి బస్సు లేదా ఆటోలో ఇక్కడికి చేరుకోవచ్చును. 
త్రిపునిత్తూరలోని శ్రీ పూర్ణత్రేయేశ స్వామి ఆలయం, కొచ్చిన్ రాజా భవనం  తప్పక చూడవలసినవి.

ఈ బ్లాగ్ లో ఆ ఆలయ వివరాలు ఉన్నాయి.

జై శ్రీ రామ్ !!!







18, మే 2015, సోమవారం

Sri Pardhasathi Swamy Temple, Guruvayur

                         శ్రీ పార్ధ సారధి ఆలయం, గురువాయూరు 


                      పాండవ మాత  కొలిచిన పార్ధసారధి 




గురువాయుర్ కేరళ రాష్ట్రంలో అధిక సంఖ్యలో భక్త జనులను ఆకర్షించే దివ్య క్షేత్రాలలో ఒకటి.
శ్రీ గురువాయురప్పన్ ( శ్రీ కృష్ణుడు) విగ్రహాన్ని బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన  కారణంగా "గురువాయుర్ " అన్న పేరోచ్చినదంటారు. అత్యంత అరుదైన "పాతాళ శిల" తో మలచబడిన ఈ విగ్రహాన్ని మహేశ్వరుడు విధాత బ్రహ్మదేవునికి ఇచ్చారట. ఆయన నుండి కశ్య ప్రజాపతి, ఆయన నుండి వసుదేవునికి, ఆయన నుండి శ్రీ కృష్ణుని పూజలు అందుకొన్న అపురూప మూర్తి ఇది. శ్రీకృష్ణ నిర్యాణ సమయంలో ఉద్దకునికి విగ్రహాన్ని ఇచ్చి దానిని బృహస్పతికి అందజేయమని ఆదేశించారట. దేవగురువు వాయుదేవుని తో కలిసి ఆకాశమార్గాన ప్రయాణిస్తూ సముద్రతీరాన ఒక కోనేరు ఒడ్డున తపస్సు చేస్తున్న సదాశివుని చూసి ప్రణమిల్లారట. నీలకంఠుడు వారిని శంఖం, చక్రం, కౌమోదకం మరియు పద్మ జపమాలలు ధరించి ముగ్ధమనోహర రూపంలో ఉండి వాసుదేవునిగా పూజలందుకొంటున్న శ్రీ మహావిష్ణువు ప్రతి రూపమే శ్రీ గురువాయూరప్పన్. నాడు గంగాధరుడు తపమాచరించి కోనేరే నేటి "రుద్రా తీర్థం". తొలి ఆలయం క్రీస్తు పూర్వం నిర్మించబడినది అని అంటారు. ఎందరో రాజా వంశాల వారు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేశారు. ఈ క్షేత్రంఎన్నో విశేషాలకు, ప్రత్యేక పూజలకు, విశేష ఉత్సవాలకు నిలయం.
గురువాయూరులో పెక్కు విశేష ఆలయాలు ఉన్నాయి.అలాంటి ఆలయాలలో శ్రీ  పార్ధ సారధి ఆలయం ఒకటి. వైకుంఠ వాసుని రూపంలో ఉన్న మరో శ్రీకృష్ణుని ఆలయం ఇది. 













అద్వైత సిద్ధాంత రూపకర్త జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్య ప్రతిష్టగా పేర్కొనే ఈ ఆలయ పౌరాణిక గాధ ద్వాపర యుగం నాటిది.
పాండవులకు బంధువు, మార్గదర్శి, సహాయకారి, దైవం అన్నీ శ్రీ కృష్ణుడే కదా !! కష్ట సుఖాలలో తమ ఆరాధ్య దైవాన్ని మానసా వాచా కర్మనా తలుచుకొంటూనే ఉండేవారు. సహాయ సహకారాలు పొందేవారు. మహాభారతంలో ఇలాంటి సంఘటనల గురించి శ్రీ వ్యాస భగవానుడు రమణీయంగా వర్ణించారు.











పాండవుల తల్లి కుంతీ దేవి తన బిడ్డల క్షేమం కోరి వాసు దేవుని విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకొని  ప్రతి నిత్యం పూజించేదిట. నిరంతరం ఈ మూర్తి ఆమె వద్దనే ఉండేదట. తదనంతర కాలంలో విగ్రహ వివరాలు తెలియరాలేదట.ఆమె నాడు అర్చించిన విగ్రహమే ఈ ఆలయంలో ఉన్నది అని చెబుతారు.నారద మహర్షి ఆ విగ్రహం గురించిన విశేషాలను శ్రీ ఆది శంకరులకు తెలిపారు. అలా త్రిలోక చారుని మార్గదర్శకత్వంలో శ్రీ శంకరులు శ్రీ పార్ధ సారధి మూర్తి ఎక్కడ ఉన్నదో కనుగొని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టించారట.











ఎనిమిదో శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయానికి ఎన్నో రాజ వంశాలు కైంకర్యాలు సమర్పించుకొన్నాయి. ముఖ్యంగా జొమారిన్ వంశ పాలకులు గురువాయూరప్పన్ ని తమ కులదైవంగా స్వీకరించి క్షేత్ర అభివృద్ధికి కృషి  చేశారు.కానీ  పద్దెనిమిదో శతాబ్దంలో మైసూరు పాలకుడైన టిప్పుసుల్తాన్ కేరళ ప్రాంతం మీద తన ఆధిపత్యాన్నిపూర్తి స్థాయిలో చెలాయించాడు.కేరళ ప్రాంతంలో  అనేక హిందూ ఆలయాలు విధ్యంసానికి గురైనాయిట . వాటిల్లో ఈ ఆలయం కూడా ఒకటి అని అంటారు. చాలాకాలం అలా శిధిలావస్థలోనే
ఉండిపోయిందీ ఆలయం.













కానీ కాలక్రమంలో రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల ఆదరణతో  స్థానికంగా ఉన్న ఆలయాల పునః నిర్మాణం ఆరంభమయ్యింది. కొందరు స్థానిక భక్తులు ఈ ఆలయాన్ని సంరక్షించే భాద్యత తీసుకొన్నారు. ప్రస్తుతం మలబార్ దేవస్వం అధీనంలో ఉన్నదీ ఆలయం. చిన్న ప్రాంగణానికి  కేరళ నిర్మాణ శైలిలో నిర్మించబడిన మూడు అంతస్థుల రాజగోపురం ప్రధాన ప్రవేశ ద్వారం. ద్వారానికి రెండు పక్కలా ఆలయ గాధ తెలిపే చిత్రాలను ఉంచారు. ఉపాలయాలు అంటూ ప్రత్యేకంగా కనిపించవు.
ప్రతి రోజూ ఉదయం నాలుగున్నర నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుందీ ఆలయం. నియమంగా నాలుగు నిత్య పూజలు, అభిషేకాలు, అలంకరణలు, ఆరగింపులు  అందుకొంటున్న మూలవిరాట్టు చతుర్భుజ శ్రీ పార్ధ సారథి అత్యంత సుందర అలంకరణతో నయన మనోహరంగా దర్శనమిస్తారు.












నిత్యం ఎందరో భక్తులు శ్రీ పార్ధసారధి స్వామి దర్శనార్ధం వస్తుంటారు. వీరిలో స్థానికులే అధికం. బయట వారికి ఈ ఆలయం గురించి చాలా తక్కువ అవగాహన ఉండటమే కారణం. ఈ విశేష క్షేత్రంలో గురువాయూర్ ఆలయంలో మాదిరి కృష్ణాష్టమి, శ్రీ రామ నవమి, విషు, ఓనం లాంటి పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. అష్టమి మరియు నవమి రోజులలో ప్రత్యేక అలంకరణ జరుపుతారు.ఆలయ ప్రతిష్టా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. గజాలు సందడి చేస్తాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.












గురువాయుర్ పట్టణంలో ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఈ ఆలయానికి కాలినడకన సులభంగా చేరుకోవచ్చును.








కృష్ణం వందే జగద్గురుం !!!!

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...