29, జూన్ 2015, సోమవారం

Punnathur Kotta, Guruvayur

                           పూనత్తూరు  కోట్ట ( గురుయాయూరు )

వీధి లోనికి ఏనుగు రాగానే చిన్న పెద్దా అన్న తేడా లేకుండా చూడటానికి ఉత్సాహపడతారు.
తన భారీ కాయాన్ని నాలుగు స్తంభాల లాంటి కాళ్ళ మీద మూస్తూ నడకలో ఒక రకమైన అందాన్ని, గాభీర్యాన్ని ప్రదర్శిస్తూ పొడుగాటి తోన్దాన్ని అటూ ఇటూ కదుపుతూ కాసులు ఇచ్చిన వారిని ఆశీర్వదిస్తూ , చేతల లాంటి చెవులను, శరీరానికి తగని చిన్ని తోకను నిరంతరం ఊపుతూ సాగే గజ రాజ నగర పర్యటన ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది.
అదే దేవస్థానం ఏనుగు అయితే ఆ శోభ మరింతగా ఉంటుంది.
నుదుటన నామాలు, చక్కని అలంకరణ, ముపురాన అమ్బారీలో దేవదేవుని ఉపస్తితుని గా చేసుకొని మావటి సూచనలకు అనుగుణంగా మందగమనంతో సగర్వంగా నడుస్తూ ఊరేగింపుకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.









మన రాష్ట్రంలో దాదాపుగా లువు కానీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల లోని అన్ని ప్రముక దేవస్తానాలలో గజం ఉండటం తప్పనిసరి. 
కేరళలో అయితే చెప్పనక్కరలేదు. 
ఈ దేవతల స్వస్థలంలో ఆలయాల సంస్కృతి, సంప్రదాయాలు,ఉత్సవాలు ఏనుగులతో అవినాభావ సంభందం కలిగి ఉంటాయి. 
ఇక్కడ ఆలయానికి ఏనుగు లేకపోతె చిన్నతనంగా భావిస్తారు. 
దానిని కొంతవరకూ సర్డుకొన్నా ఉత్సవాలలో ఏనుగును ఉంచలేకపోతే మహా అవమానంగా తలపోస్తారు. 
గజం లేని ఆలయాల వారు ఉత్సవాల సమయానికి దగ్గర లోని పెద్ద ఆలయం నుండో లేక పెంపకం దారుల దగ్గర శిక్షణ పొందిన ఏనుగును అద్దెకు తేవడం రివాజు. 
ఆ ఏనుగుకు ఘన స్వాగతం పలికి ఉన్న రెండు రోజులూ ఆదరాభిమానాలతో చూసుకొంటారు. 
అందుకే పేరున్న పద్మనాభన్, రామచంద్రన్ లాంటి ఏనుగులు ఒక రోజు ఉత్సవంలో పాల్గొనడానికి రెండు లక్షల పైచిలుకు ధర వసూలు చేయడం జరుగుతోంది. 
ఆలయాలలో 250కి పైగా, ప్రెవేటు వ్యక్తుల వద్ద 300 దాకా ఏనుగులు ఉన్నట్లుగా అధికార వర్గాల అంచనా ! 








గమ్మతైన విషయం ఏమిటంటే కేరళ అడవులు ఏనుగులకు ప్రసిద్ది.
కానీ చాలా మటుకు వ్యక్తుల వద్ద ఆలయాలో ఉన్న ఏనుగులు అరుణాచల ప్రదేశ్, భీహర్, ఒదిస్సా లాంటి రాష్ట్రాల నుండి తెచ్చినవే కావడం!
స్థానికంగా ఏనుగుల వేట మీద బంధించడం మీదా నిషేధం ఉండటమే ప్రధాన కారణం.
ఇక్కడి అడవులలో గాయపడిన వాటికి లేదా మంద నుండి తప్పిపోయిన పిల్లలను సంరక్షించడానికి "కొన్ని" అనే చోట తగిన ఏర్పాట్లు చేసారు.
కేరళ రాష్ట్రంలో ఆలయాలలో గజ రాజుల కు ఉన్న ఆదరణ మూలంగానో లేక భగవద్భక్తి వలనో భక్తులు తమ
ఆరాధ్య దైవాలకు ఏనుగులను కానుకగా  సమర్పించుకోవడం ఒక ఆచారంగా మొదలైయ్యింది.
ఈ విషయంలో గురువాయూరు దేవస్తానానిదే అగ్రస్థానం. 





కొన్ని సంవత్సరాల క్రిందట తొంభై కి పైగా ఏనుగులు ఉండేవి.
ప్రస్తుతం యాభై తొమ్మిది ఉన్నాయి.
వీటిల్లో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత, మలయాళ సినీ హీరో సురేష్ గోపి ఇచ్చినవి కూడా ఉన్నాయి.
నేడు ఇంత గజ సైన్యం గల గురువాయూరు దేవస్థానానికి గతంలో ఒక్క ఏనుగూ లేదని, ఉత్సవాలలో పాల్గొనడానికి పక్క ఆలయం నుండి తెచ్చుకొనే వారంటే ఆశ్చర్యం కలుగుతుంది.
నాలుగు శతాబ్దాల క్రిందట నేటి కొచ్చి సమీపం లోని త్రిక్కన మదిలగం అనే గరం లోని ఆలయ ఏనుగును తెచ్చుకోనేవారట.
ఒక సంవత్సరం గురువాయూరు ప్రాంత రాజైన జోమారిన్ కి కొచ్చిన్ రాజ వంశాస్తులకు రాజకీయ పరమైన విబేధాలు తలెత్తడం వలన ఏనుగుని పంపలేదట.
చిత్రంగా కట్టిన గొలుసులను తెమ్పుకొని నూట యాభై కిలోమీటర్లు పరిగెత్తుకొంటూ వచ్చి ఉత్సవం రోజుకి ఆలయం ఎదుట నిలబడినదట.
ఈ కారణంగా గురువాయురప్పంకు గజపూజ నియమంగా జరిపించాలని నిర్ణయించుకోన్న దేవస్థాన నిర్వాహకులు రాజు గారి ద్వారా ఒక ఏనుగును రప్పించుకొన్నారట.
నాటి నుండి మూడువందల సంవత్సరాలు ఒకే ఏనుగు ఉండేది.




గురువాయూరప్పాన్ కు గజాలను కానుకగా సమర్పించుకోవడం అన్నదానికి ఆద్యులుగా "చేరకున్నతు నంబూద్రి" వంశాన్నిపేర్కొన వచ్చును.
వంశాన్ని నిలబెట్టే వరాసుడు కావాలని కోరుకొని నెరవేరడంతో పద్న్మనాభాన్ అనే గజాన్ని సపర్పించుకొన్నారు.
తదనంతర కాలంలో ఈ వంశం వారు వివిధ కారణాలతో మరికొన్ని ఏనుగులను సమర్పించుకొన్నారు.
చాలా కాలం పాటు కానుకగా వస్తున్న ఏనుగులను ఆలయ దక్షిణ భాగంలో ఉంచేవారు.
సంఖ్యా పెరగడం, భక్తులకు అసౌకర్యం కలగడం లాంటి కారణాల వలన దేవస్థానం అధికారులు తనిగిన స్థలం కొరకు అన్వేషించారు.
అప్పుడు ఎంచుకోన్నదే "పూనత్తూరు కోట".
ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో చాలా సంవత్సరాల క్రిందట  స్థానిక పాలకులు పది ఎకరాల స్థలంలో నిర్మించుకొన్నదే ఈ కోట.
ఆఖరి పాలకుడైన గౌడ వర్మ వలియ రాజ మరణానంతరం వారసులు దీనిని దేవస్థానానికి ఇచ్చారు.
గజ రాజు కేశవన్ ఆధ్వర్యంలో గజాలన్నీ 25.06. 1975 న కోతప్రవేశం చేసాయి.
నాటి నుండి దీనిని "ఆనే ( ఏనుగు)కోట " గా పేర్కొంటున్నారు.
గజ రాజుల సామ్రాజ్యం.



ప్రశాంత పచ్చని వాతవరనంతో శోభిల్లే కోటలో జలకాలాటల నిమిత్తం తటాకాలు నిర్మించారు.
అనుభవజ్ఞులైన వైద్య బృందం నియమించబడినది.
ఏనుగుకు  ఒక మావటిని నియమిస్తారు.
అతనే దాని స్నానం, పాణం, ఆహరం, ఆరోగ్యం మరియు శిక్షణ చూడాలి.
"పాపాన్" ( మావటి) శిక్షణా కేంద్రాన్నికోట మధ్యలో ఉన్న పాత రాజ మందిరం ఐన "నలకేట్టు"లో ఏర్పాటుచేశారు.
ఏ మావాటిని కదిలించినా తన ఆధ్వర్యంలో ఉన్న ఏనుగు గురించి చెబుతూ , పసి పిల్లల అల్లరి చేష్టల గురించి తల్లితండ్రులు ఎలా చెప్పి మురిసిపోతారో అలా మైమరచి పోతారు.
వీటికి  ఉదయాన ఒక రకానికి చెడిన ఆకులను ఆహారంగా అందిస్తారు.
చెట్ల నుండి కొట్టి తెచ్చిన మట్తలను ఒక చోట కుప్పగా
పెట్టి , కొన్ని ఏనుగుల చేత వాటిని కట్టేసి ఉంచిన వాటికి అందిస్తారు.




ప్రస్తుతం ఇక్కడ లక్ష్మి, తార, నందిని, ఉమా, లక్ష్మీ కృష్ణ అనే అయిదు ఆడ ఏనుగులు, దంతాలు లేని రెండు "మకన" అని పిలిచే వాటితో కలిపి మిగిలినవి మగవి. 
అన్నింటి లోనికీ వయస్సులో పెద్దది ప్రజలలో అత్యంత ఆకర్షణ గల  "పద్మనాభన్". 
ఒక రోజు ఉత్సవంలో పాల్గొనడానికి  రెండున్నర లక్షలు చేల్లిచాలని వినికిడి. 
నందన్, లక్ష్మన్, ఇంద్రసేన్, గోపాల కృష్ణన్, బాల కృష్ణన్ ఇలా మిగిలినవి. 
గురువాయూరు దేవస్థానం లో అత్యంత ఆదరణ గలిగిన ఏనుగుగా ప్రసిద్ది చెందినది గజరాజు గురువాయూరు కేశవన్. 
అరవై ఒక్క సంవత్సరాలు స్వామిని సేవిన్చికొని 1977లో ఆలయం లోనే పరమాత్మలో ఐక్యం అయిన ధన్య జీవి. 


సురేష్ గోపి సమర్పించిన లక్ష్మీ నారాయణ 

















75 సంవత్సరాల పద్మనాభన్ 





తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత ఇచ్చిన జయ కృష్ణన్ 

విశేష దినాలలో భక్తులు ప్రత్యేక అనుమతి'తీసుకొని గజపూజ, ఆహరం సమర్పించుకోవడం లాంటివి నిర్వహించుకొంటుంటారు.
కోట మధ్యలో శివాలయం మరియు భగవతీ దేవి ఆలయం ఉన్నాయి.
ప్రతి సంవత్సరం కుంభం మాసం ( FEB-MAR)లో పది రోజుల పాటు జరిగే ఆలయ ఉత్సవాలలో తోలి రోజున ఏనుగు పరుగు పందెం విర్వహిస్తారు.
ఎంపిక చేయబడిన పన్నెండు ఆడ మరియు మగ ఏనుగులు దీనిలో పాల్గొంటాయి.
ఆలయానికి ఎదురుగా మంజులాల్ వట వృక్షం నుండి ప్రారంభం అవుతుంది.
అన్నిటికన్నా ఏదైతే  ముందు ఆలయం లోనికి ప్రవేశించి ప్రదక్షిణ చేసి వెలుపలికి వస్తుందో ఆ ఏనుగు విజేత.
గెలిచినా దానికి బంగారు పతకం ఇవ్వడమే కాకుండా సంవత్సరం పాటు నిత్య పూజలలో ఉత్సవాలలో ఉత్సవ మూర్తిని అలంకరించుకొనే భాగ్యం కల్పిస్తారు.




విశేష చరిత్రం ఆకర్షణ కలిగిన ఈ గజరాజుల సామ్రాజ్యమైన పూనత్తూరు కోటకు ఈ మధ్య ఒక కొత్త సమస్య వచ్చింది. 
క్రిందటి సంవత్సరం వన్య ప్రాణి పరిరక్షణా సమితి వారు ఇక్కడ ఆరోగ్యకర వాతావరణం  లేదని, పరిమితికి మించిన ఏనుగులను ఉంచుతున్నారని కోర్టులో కేసు పెట్టారు. 
కోర్టువారు అన్ని విషయాలను పరిశీలించి ఇది తగిన స్థలం కాదని మరింత విశాలమైన సౌకర్యవంతమైన స్థలం లోనికి మార్చాలని ఆదేశించారు. 
గురువాయూరు దేవస్థానం వారు తగిన స్థలం కొరకు అన్వేషణ ఆరంభించారు. 
త్వరలో గజాలు   "స్మార్ట్ " సామ్రాజ్యం లోనికి మారుతాయి. 












అప్పటిదాకా ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం అయిదు గంటల దాక తెరిచి ఉండే పూనత్తూరు కోటను సందర్శించుకొందాము. 






( అడిగిన వెంటనే కోట గురించిన అనేక విషయాలను నాకు తెలిపిన మావటి శ్రీ సత్యపాలన్ మరియు శ్రీ రాఘవన్ లకు కృతజ్ఞతలు ) 






ఎప్పుడూ హథీ హాథీ అంటూ ఏనుగును ప్రేమిస్తూ నాచేత ఇన్ని ఫోటోలు తీయించి తనకు తెలియ కుండానే నాచేత ఈ వ్యాసం రాయించిన మా ముద్దుల మనువరాలు చిరంజీవి. దేశరాజు అక్షర కు ప్రేమతో - తాతూ 

 

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...