Pandalam

                      హరిహర పుత్రుడు నడయాడిన - పందళం 

లోకంలో ధర్మం కాపాడటానికి అవతరించిన హరిహర పుత్రుని మరో అవతారమే " మణికంఠ స్వామి ". 
పందల రాజుకి అరణ్యంలో పసి బాలకునిగా లభించి, ఆయన రాజ భవనంలో పెరిగి, సకల విద్యా బుద్దులు నేర్చుకొన్నారు. 







స్వామి మానవ రూపంలో నడయాడిన పవిత్ర భూమి పందళం, పంబానది ఒడ్డున ఉన్నది.




శ్రీ అయ్యప్ప తిరువాభరణాలు ఉంచే భవనం, పందళ రాజ వంశీకుల "వలియకోయిక్కాల్ ఆలయం" కొన్ని పురాతన భవనాలు ఉంటాయి.











పందళ రాజ వంశానికి చెందిన ఒక మహిళ ఇక్కడ ఉంటారు. ఆమెకు మొక్కి ఆశీర్వాదాలు అందుకొన్నాను.
భగవద్గ కృప వలన  ముప్పై అయిదు సంవత్సరాలుగా చేస్తున్న శబరి యాత్రలో అయ్యప్పస్వామితో ముడిపడి ఉన్న క్షేత్రాలైన పందళం, శ్రీ గురునాధన్ ముఖాడి, కుళత్త పుళ, అరియంగావు, అచ్చంకోయిల్, రాణీ పెరునాడ్ శ్రీ అయ్యప్ప ఆలయం, అష్ట అయ్యప్ప క్షేత్రాలలో కొన్నిదర్శించుకొనే భాగ్యం కలిగినది.
మరి కొన్నింటిని ఈ సంవత్సరం చూడాలని ప్రయత్నిస్తున్నాను.

ఈ చిత్రాలన్నీ 2009 లో తీసినవి.










స్వామియే శరణం అయ్యప్ప !!!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Nidanampati Sri Lakshmi Ammavari Temple, Adigoppala

Sri Irukalala Parameswari Temple, Nellore