పోస్ట్‌లు

Gaja Gamanam

                                            గజ "గమనం"                                                                                                             ఏనుగమ్మా ఏనుగు  మా ఊరొచ్చింది ఏనుగు ........  చిన్నప్పుడు అమ్మ ఒడిలో పడుకొని మనందరం పాడుకొన్న పాట ఇది. మనమే కాదు మన ముందు తరాలవారు మన తరువాత తరాల వారు పాడుకొన్నారు. పాడుకొంటారు కూడా. ఒకప్పుడు ఏ సర్కస్ కంపెనీ లేదా భైరాగులో, సాధువులో ఊరిలోకి వస్తే పిల్లలకు ఆటవిడుపే. ఏదో వంకతో అక్కడికి వెళ్లి ఏనుగులను చూస్తుండి పోయేవారు. నేటికీ పరిస్థితులలో మార్పు లేదు. పది అడుగుల ఎత్తుతో బలమైన శరీరంతో, తోక, చెవులు, తొండాన్ని గమ్మత్తుగా కదిలిస్త...

Kudal Azhagar Perumal Temple, Madurai

  విశిష్ట వైష్ణవ దివ్య దేశం కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెల   నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో అగ్రస్థానం శ్రీ రంగనాధుడు కొలువైన శ్రీరంగానిది. క్షేత్రానికి ఇరుపక్కలా పావన కావేరి నది పూలదండలా కొల్లిడం మరియు కావేరి పేర్లతో ప్రవహిస్తుంటుంది.  అదే విధిగా పురాణ కాలంలో త్రిలోక పూజ్యులైన ఆదిదంపతులు కొలువైన మదురై పట్టణాన్ని కూడా "వైగై నది"పూల హారం మాదిరిగా ప్రవహించేదట. కాలక్రమంలో ఒక పాయ దాదాపుగా అంతరించి పోయిందట.  ఆ రోజులలో నదిని "కిరత మాలై" అని పిలిచేవారట. పవిత్ర నదీ ప్రవాహం వలన ఆ ప్రాంతమంతా పచ్చని పొలాలతో ముఖ్యంగా అరటి తోటలతో నిండి ఉండేదట. రమణీయ వాతావరణం నెలకొని ఉండేదని పురాతన తమిళ కావ్యాల ఆధారంగా తెలియవస్తోంది.  ఆ అరటి వనాల మధ్య శ్రీ కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెల నెలకొని ఉండేదట. ప్రస్తుతం ఎత్తైన భవనాలతో నిండి పోయిన నగరం మధ్యలో ఉన్నది. అళగర్ పెరుమాళ్ పేరుతొ మదురైలో రెండు ఆలయాలలో పరమాత్మ కొలువై ఉంటారు. మొదటిది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువుతీరిన ఆరుపాడై వీడులలో ఒకటైన "పళ మదురై చోళై"పర్వత పాదాల వద్ద నెలకొని ఉన్నది.  నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండవది నగర...

Anju Murthi Temple, Kerala

                  అయిదు సన్నిధుల అంజుమూర్తి కోవెల   నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో అధిక శాతం తమిళనాడులోనే ఉన్నాయి. ఆ రాష్ట్రం తరువాత ఎక్కువ దివ్య తిరుపతులు ఉన్నది కేరళ రాష్ట్రంలోనే ! గతంలో ఈ ప్రాంతాన్ని "మలైనాడు"  పిలిచేవారు. స్వాతంత్రానంతరం దేశం బాషా ప్రాతిపదికన రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసినదే!  అయినా ప్రస్తుతం తమిళనాడులోని నాగర్కోయిల్ జిల్లాలో ఉన్నరెండు  క్షేత్రాలతో కలిపి మొత్తం పదమూడు పుణ్య క్షేత్రాలను మలై నాడు దివ్యదేశాలుగా నేటికీ పిలుస్తారు. అంటే వీటిల్లో పదకొండు  మాత్రమే భౌగోళికంగా దేవతల స్వస్థలంలో ఉన్నాయి.  కేరళ రాష్ట్రం అంటే ప్రత్యేక ఆలయాల ప్రాంతంగా ప్రసిద్ధి. ఈ దివ్యదేశాలు కూడా ఎంతో విశేషంగా ఉంటాయి. మరో ప్రత్యేకత ఏమిటంటే వీటిల్లో  ఆలయాలను పాండవులు స్థాపించినట్లుగా పురాణ గాధలు తెలియజేస్తున్నాయి.కాకపోతే చెంగన్నూర్ పరిసరాలలో ఉన్న అయిదు ఆలయాలైన తిరుచెంగన్నూర్ (ధర్మరాజు), తిరుప్పులియూర్ (భీముడు), ఆరన్మూల(అర్జనుడు), తిరుక్కోడిత్తానం(సహదేవ), తిరువాంవండూరు(నకులుడు)నిర్మించారు. క...

Gundicha Mandir, Puri

                      మూర్తి లేని మందిరం --- గుండీచా బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం మరియు పూరీ మన భారత దేశానికి నాలుగు దిశలలో నెలకొని ఉన్న దివ్య ధామాలు. ఈ నాలుగు క్షేత్రాల సందర్శనాన్ని " చార్ ధాం " యాత్ర అంటారు. స్వయం పరమాత్మ నడయాడిన ఈ పవిత్ర స్థలాలు యుగాల క్రిందటి పురాణ గాధలతో ముడిపడి ఉన్నాయి. హిందువులు జీవితంలో ఒకసారి అయినా ఈ క్షేత్రాలను సందర్శించాలని అభిలషిస్తారు. ఈ నాలుగు క్షేత్రాల ప్రాధాన్యత, ప్రత్యేకతలను విడివిడిగానే చూడాలి.  అన్నింటి లోనికి పూరీ క్షేత్రం పూర్తిగా భిన్నమైనది. శ్రీ జగన్నాథ సంస్కృతి సంప్రదాయాలకు కేంద్ర బిందువు అయిన పూరీ క్షేత్రం ఎన్నో విశేషాల సమాహారం. ఋగ్వేదంలో శ్రీ జగన్నాథ క్షేత్ర ప్రస్థానం వివరంగ ఉన్నది. బ్రహ్మ పురాణం, పద్మ పురాణం కూడా నీలాచల క్షేత్ర ప్రాధాన్యత ను తెలుపుతున్నాయి.  సుందర సాగర తీరంలో ఉన్న ఈ క్షేత్రం లోని ఆలయం, మూలవిరాట్టుల రూపాలు, వారికి చేసే పూజలు, అలంకరణ, సేవలు, నివేదనలు, యాత్రలు అన్నీ ప్రత్యేకమైనవే! మరెక్కడా కనపడనవే!  అగ్రజుడు శ్రీ బలరాముడు, చెల్లెలు శ్రీ సుభద్రలతో శ్రీ మహావిష్ణ...

Sri Narasimha

చిత్రం
                    శ్రీ ఉగ్ర నారసింహ ఆలయం. మద్దూరు  భారతావనిలో అనేక శ్రీ మహావిష్ణు అవతారాల ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో అధికశాతం శ్రీ రామచంద్ర మూర్తివి కాగా రెండో స్థానంలో శ్రీ కృష్ణ ఆలయాలు కనపడతాయి. తరవాత స్థానాలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ శేషశయన అనంత పద్మనాభుడు, శ్రీ రంగనాధుడు క్షేత్రాలలో కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు.  కానీ ఖచ్చితంగా మూడో స్థానం మాత్రం శ్రీమన్నారాయణుని నాలుగో అవతారమైన శ్రీ నారసింహ స్వామి వారి ఆలయాలదే ! నారసింహుడు అపమృత్యు భయాన్ని తొలగించేవానిగా ప్రసిద్ధి. అభయ ప్రదాత, భూతప్రేత పిశాచ పీడల నుండి కాపాడే వానిగా, అధైర్యాన్ని అణచివేసి ధైర్యాన్ని అందించే వానిగా స్వామి రూపాన్ని ప్రార్ధిస్తారు భక్తులు. దక్షిణాదిన నృసింహ ఉపాసన, ఆరాధన అధికంగా చెప్పవచ్చును.  అతి తెలివితో అసాధ్యం అని తలచిన కోరికలను పొంది ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్న దానవుడైన హిరణ్య కశ్యపుని బారి నుండి సమస్త సృష్టిని సంరక్షించడానికి సగం మానవ సగం మృగరాజ రూపంలో అవతరించారు శ్రీ హరి. తన భక్తుడైన ప్రహ్లాదుని మాటలను ఋజువు చేస్తూ సాయంసం...

Adhi Tiruvarangam Temple

చిత్రం
                శ్రీ రంగ నాథుడు కొలువైన    ఆది తిరువరంగం   పవిత్ర పాలరు (దక్షిణ పెన్న) నదీ తీరం ఎన్నో విశేష ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధి కెక్కినది. నదికి ఉత్తరం మరియు దక్షిణ తీరాలలో శివ, విష్ణు, దేవి, గణేష మరియు సుబ్రమణ్య ఆలయాలు చాలా నెలకొని ఉన్నాయి. అన్నీ కూడా పది శతాబ్దాలకు పూర్వం నిర్మించబడినవి కావడం అన్నిటి పురాణ గాధలు కూడా అనేక పురాతన గ్రంధాలలో పేర్కొని ఉండటం ఇంకా చెప్పుకోదగిన విషయం.  అలాంటి అనేకానేక ఆలయాల్లో తమిళనాడు  కాళ్లకురిచ్చి జిల్లాలో శ్రీ రంగనాధ స్వామి కొలువైన ఆది తిరువరంగం ఒకటి. కృతయుగం నాటి సంఘటనలతో ముడిపడి ఉన్న ఈ ఆలయం శ్రీ వైష్ణవ దివ్యదేశాల జాబితాలో లేకున్నా కావేరి నది తీరంలో కొలువైన శ్రీ రంగం కన్నా ముందు నుండి ఉన్నది అని అంటారు.  చిత్రమైన విషయం ఏమిటంటే పాశుర గానాలు చేసి మొత్తం నూట ఎనిమిది దివ్య తిరుపతులను వెలుగు లోనికి తెచ్చిన పన్నిద్దరు ఆళ్వారులలో తిరుమంగై  ఆళ్వారు ఇక్కడ శ్రీ వైకుంఠ వాసుని దర్శనం పొందినట్లుగా తెలుస్తోంది. ఆయన తన పాశురాలలో ఆది తిరువరంగం గురించి ప్రస్థాపించినట్లుగా తెలుస్తోంది....

Mahabalipuram Temples

              శ్రీ స్థల శయన పెరుమాళ్ క్షేత్రం , మహాబలిపురం   మహాబలిపురం ఒక ప్రత్యేక చరిత్ర కలిగిన సముద్ర తీర నగరం. క్రీస్తుపూర్వం నాలుగు అయిదు శతాబ్దాల కాలంలోనే అనేక విదేశాలతో వ్యాపార లావాదేవీలు జరిగేవని ఇక్కడ లభించిన ఆ కాలం నాటి నాణాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.  పల్లవ రాజుల కాలంలో పంచపాండవ రథాలు(ఏక శిల్ప నిర్మాణాలు), సముద్ర తీర ఆలయాలు, శ్రీ స్థల శయన పెరుమాళ్ ఆలయం, శ్రీ భూవరాహ స్వామి ఆలయం ఇలా చాలా ఉన్నాయి. పల్లవులు గుహాలయాలకు ఆద్యులుగా నిలుస్తారు. వారు నిర్మించిన అనేక గుహాలయాలలో సమీపంలోని సాలువకుప్పం లో ఉన్న టైగర్ కేవ్ ఒకటి.  పాశ్చాత్య యాత్రికుడు, వ్యాపారి అయిన "మార్కో పోలో" మహాబలిపురాన్ని ల్యాండ్ అఫ్ సెవెన్ పగోడాస్ " అని వర్ణించాడు తన యాత్రా విశేషాల గ్రంధంలో. ప్రస్తుతం వాటిల్లో చాల వరకు సముద్రంలో మునిగి పోయాయి.  ప్రస్తుతం మహాబలిపురంలోని నిర్మాణాలు మొత్తం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి.  మహాబలిపురం లేదా మామల్ల పురం    ఈ పేర్ల వెనుక రెండు గాధలు వినపడతాయి. హిరణ్య కశ్యపుని కుమారుడైన బలిచక్రవర్తి పాలించి...