పోస్ట్‌లు

Marundeeshwara Temple, Thirukachur

చిత్రం
                  సర్వరోగాలకు మందు ఈ మహేశ్వరుడు   సింగపెరుమాళ్ కోయిల్ కి సమీపం లోని తిరుకచూర్ క్షేత్రం లోని మరో విశేష దేవాలయం శ్రీ మరుండేశ్వర స్వామి వారు కొలువైనది. ఈ ఆలయం ఉన్న రుద్రగిరి గతంలో అనేక మంది తాపసులకు నిలయంగా పేరొందినది అని పురాతన తమిళ గ్రంధాలు పేర్కొన్నాయి అని తెలుస్తోంది. ఎన్నో ఋష్యాశ్రమాలు ఇక్కడ ఉండేవట. ఎంతో పవిత్ర ప్రదేశంగా ఋషులు భావించిన ఈ క్షేత్ర గాధ దక్ష యజ్ఞం తో ముడి పడినట్లుగా తెలుపుతోంది.  పిలవని పేరంటానికి పతిదేవుని మాట దాటి వెళ్లిన దాక్షయాణి అక్కడ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞ గుండలో దూకి ఆత్మాహుతి చేసుకొన్న విషయం మనందరకూ తెలిసినదే !  ఆగ్రహించిన పరమేశ్వరుడు వీరభద్రాది గుణాల ద్వారా దక్ష యజ్ఞాన్ని భగ్నం చేయించి సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని విరాగిగా సంచరించసాగారట.  ఆయనను తిరిగి మామూలు స్థితికి తీసుకొని రమ్మని ముల్లోకవాసులు శ్రీమహావిష్ణువును ప్రార్ధించారట. అప్పుడు ఆయన తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుగా విభజించారట. అలా చక్రాయుధ వేగానికి సతీదేవి శరీరభాగాలు పుడమి మీద పలు చోట్ల పడినాయి....

Kachabeshwara Temple, Thirukachur

చిత్రం
                    మహాకూర్మం కొలిచిన మహేశ్వరుడు   మన దేశంలో గ్రామగ్రామాన, పట్టణ నగరాలలో ఎన్నో ఆలయాలు నెలకొని ఉన్నాయి. అన్నింటిలోనూ చరాచర సృష్టికి మూలాధారమైన ఈశ్వరుడే వివిధ నామాలతో రూపాలలో కొలువై ఉన్నారన్నది పెద్దల మాట, వీటిల్లో కొన్ని చోట్ల స్వయంభూ గా, మరికొన్ని చోట్ల స్వయంవ్యక్త గా మిగిలిన క్షేత్రాలలో ప్రతిష్ఠిత మూర్తిగా సర్వేశ్వరుడు ప్రజల పూజలు అందుకొంటున్నారు. పరమాత్మకు చేసే వివిధ పూజలు, సేవల సమయంలో పఠించే వేదం మంత్రాల కారణంగా దేవాలయ ప్రాంగణంలో ఇది అని చెప్పలేని గొప్ప అనుకూల శక్తి నెలకొని ఉంటుంది. అనిర్వచనమైన ఆ శక్తి దైవ దర్శనానికి విచ్చేసే భక్తుల మదిలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించి స్థిరపరుస్తుంది. అంతులేని శాంతిని ప్రసాదిస్తుంది. అద్భుతమైన ఆనందాన్ని అందిస్తుంది. కానీ అదే శక్తి కారణ జన్ముల హృదయ అంతరాంతరాలలో పూర్వ జన్మ పుణ్య ఫలాన అంతర్యామి పట్ల  ఏర్పడిన అనుభూతులను,భావాలను,భక్తిని అసంకల్పితంగా వెల్లడించేలా చేస్తుంది.  అలా జన్మించిన మహానుభావులకు యుగయుగాలుగా భారత దేశం పేరొందినది. వారు లోకరక్షకుని పట్ల తమకు గల అచంచల...

Jouagad, Odisha

చిత్రం
.                                  శాసనాలు తెలిపే సత్యాలు                                                                                                           = ఇలపావులూరి వెంకటేశ్వర్లు  జౌగడ్ ఒడిషా లోని గంజాం జిల్లాలో చాలా మందికి తెలియని చిన్న పల్లెటూరు. కానీ ఒకప్పుడు కళింగ దేశంలో పేరొందిన  పట్టణం.గంజాం జిల్లాలోని అత్యధిక శాతం భూములను సస్యశ్యామలం చేసే రుషికుల్యానది జౌగడ్ కు సమీపంలోని పురణ బంధ వద్ద సాగరం (బంగాళా ఖాతం)తో సంగమిస్తుంది. క్రీస్తుపూర్వం నుండి ఇక్కడి రేవు ద్వారా ఉత్కళ దేశస్థులు అనేక దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేవారు. అసలు ఉత్కళ అంటేనే ఉత్కృష్టమైన కళలకు నిలయం అని అర్ధం. వీరు రూపాందించిన అనేక వస్తువ...

Tiruvetakalam

                పార్దుడు పాశుపతం పొందినది ఇక్కడే  వనవాస కాలంలో సమయం వృథా చేయకుండా రాబోయే యుద్ధంలో ఉపయోగపడే పాశుపతాస్ర్తము పొందమని పాండవ మధ్యమునికి సలహ ఇచ్చారు శ్రీ కృష్ణ భగవాన్.  ఆ ప్రకారం అరణ్యంలో పరమేశ్వర అనుగ్రహం కొరకు తపస్సు చేయసాగాడు అర్జునుడు.   ఒకనాడు అడవి పంది ఒకటి దాడి చేయడానికి రాగా ఫల్గుణుడు దాని మీదకు శరం వేశాడు.  ఇంతలో మరోవైపు నుంచి మరో బాణం పందిని తాకింది.  సూకరం మృతి చెందింది.   " నేను వేసిన బాణం వలన నే చచ్చింది కనుక వేట నాది" అంటూ ప్రవేశించాడొక వేటగాడు. అతని పాటు భార్య ఇతర అనుచరులు ఉన్నారు.  " పందిని కావాలంటే తీసుకో!  కాని దాని చావుకు కారణం నేను సంధించిన శరం " అన్నాడు విజయుడు.  వాదం పెరిగి చివరకు ఇరువురి మధ్య యుద్దానికి దారి తీసింది. భీకరమైన పోరు జరిగింది. అర్జనుని శరాఘాతానికి అంతర్యామి గాయపడ్డారు. అప్పుడు ఆయన తన నిజస్వరూపం ధరించారు. తెలియకుండా చేసిన తప్పు క్షమించమని ప్రార్దించాడట పార్దుడు.   ఆశీర్వదించి పాశుపతం అనుగ్రహించారట. గాయపరచిన వానిని దగ్గర...

Chidambaram Padal Petra sthalams

చిత్రం
                            చిదంబర పడాల్ పేట్రస్ధలాలు   తమ తమ ఆరాధ్యదైవాలను కీర్తిస్తూ ఆళ్వారులు మరియు నయనారులు గానం చేసిన పాశురాలు , పాటికాల కారణంగా అనేక మహిమాన్విత క్షేత్రాలు వెలుగు చూసాయి . అవి అంతకు ముందు నుంచే ఉన్నా వీరి గానం వలన దివ్య దేశాలు మరియు   పడాల్ పేట్రస్ధలాలు గా అపురూప గౌరవాన్ని సొంతం చేసుకొన్నాయి . మనకు దర్శించుకొనే అవకాశం లభించింది . పన్నిద్దరు వైష్ణవ ఆళ్వారులు పాడిన పాశురగానం వలన నూట ఎనిమిది శ్రీ వైష్ణవ ఆలయాలు దివ్య దేశ హోదా పొంది ప్రసిద్ధి చెందాయి .  వీటిలో అధిక భాగం తమిళనాడు లోనే ఉన్నాయి . ఒకటి పొరుగు దేశం అయిన నేపాల్ లో ఉన్నది . మిగిలినవి కేరళ , ఉత్తర ప్రదేశ్ మరియు మన రాష్ట్రంలో కలవు . చివరి రెండు అయిన తిరుప్పాలకడల్ మరియు పరమ పదం శ్రీ మహవిష్ణువు నివసించే పాలకడలి , శ్రీ వైకుంఠం . నిజ భక్తుల కోరిక ఇష్ట దైవ సన్నిధే కదా !   మన రాష్ట్రంలో ఉన్న దివ్య దేశాలు కలియుగ వైకుంఠం తిర...