పోస్ట్‌లు

Tiruvannamalai a unique place

చిత్రం
            అసాధారణ విశేషాల నిలయం  - తిరువణ్ణామలై   తిరువణ్ణామలై లో అణువణువూ శివ స్వరూపమే! కైలాసనాధుడే కొండ రూపంలో కొలువైన దివ్య క్షేత్రం కదా ! ఈ కారణం గానే మరే  పుణ్య క్షేత్రం లోనూ లేని కొన్ని ప్రత్యేకతలు ఇక్కడ నెలకొని ఉన్నాయి.  ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు కూడా ఎంతో ప్రాముఖ్యం గల పౌరాణిక నేపధ్యం కలిగి ఉంటాయి. ఇక్కడ తప్ప మరెక్కడ పర్వతాన్ని పరమేశ్వరుని క్రింద పూజించరు.  శ్రీ కుమార స్వామి ఉద్భవించిన స్థంభం  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన ప్రియ భక్తుడైన అరుణగిరినాథర్ గానానికి పరవశుడై ప్రత్యక్షమైన క్షేత్రం ఇదొక్కటే ! ప్రాంగణంలో మొదటగా వచ్చే మురుగన్ ఆలయం లోని స్థంభం నుండే స్వామి ఉద్భవించినట్లుగా చెబుతారు. గిరివలయంలో దర్శించుకొని అష్ట దిక్పాల లింగాలు మరియు సూర్య చంద్ర ప్రతిష్ఠిత లింగాలు ఇక్కడే ఒక వరుసలో కనపడతాయి. చాలా చోట్ల దిక్పాలకులు , గ్రహాలూ ప్రతిష్టించి లింగాలు ఉన్నా ఇలా మాత్రం ఉండవు. ముగ్గురు మహర్షుల ( దుర్వాస, గౌతమ మరియు అగస్త్య) ఆరాధనా స్ధలాలు ఒక్క తిరు...

Updates 3

కృతజ్ఞతలు.  శ్రీ అరుణాచలేశ్వరుని (తిరువణ్ణామలై)మీద పుస్తకం ప్రచురించి ఉచితంగా భక్తులకు అందించాలన్న సత్సంకల్పంతో ధన సహాయం కొరకు నేను చేసిన అభ్యర్థనకు మరో  స్పందన  వచ్చినది.  అజ్ఞాత భక్తులు ఒకరు Rs.440.00  పంపారు.  ఆ సోదరుని కుటుంబానికి  సర్వేశ్వరుడు సకల శుభాలను ప్రసాదించాలని కోరుకొంటున్నాను.  ఇప్పటికి రూపాయలు 4951/-  వచ్చినవి. నేను ఉంచిన 5000/- తో కలిపి మొత్తం 10,000/-. వీటితో తొలి  విడత ప్రచురణ మొదలు పెడదామని అనుకొంటున్నాను . ఈ ధనంతో 500 పుస్తకాలు ముద్రించి కార్తీక మాసంలో మొదట తిరువణ్ణామలై లో పంచాలని భావిస్తున్నాను. కావలసిని సమాచారం అంతా సిద్ధంగా ఉన్నది. ఈ నెలలో మరొక్కమారు శ్రీ అన్నామలై స్వామిని దర్శించుకొని కార్యక్రమం ప్రారంభించాలన్నది సంకల్పం.  దసరా తరువాత పుస్తకం యొక్క ప్రతిని ఈ బ్లాగ్ లో ఉంచాలని ఆశ పడుతున్నాను.  ఈ మహా పుస్తక క్రతువులో పాల్గొనాలని మరొక్కసారి అందరికీ సవినయ విన్నపం.  నమస్కారాలతో,  ఇలపాలవులూరి వెంకటేశ్వర్లు 

Greetings

చిత్రం
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.  అత్యంత అరుదైన సింహ శరీర గజముఖుని శిల్పం. తిరువణ్ణామలైలో అమ్మవారు శ్రీ ఉన్నామలై అమ్మన్ ఆలయం లోని అష్ట లక్ష్మీ మండపం లోని ఒక స్థంభం పైన చక్కబడినది. ఇంత వరకు మరే ఇతర ఆలయంలో చూడలేదు.   విఘ్ననాయకుడు అందరి నిత్య జీవితాలలో సర్వ విఘ్నాలను తొలగించి సకల శుభాలను చేకూర్చాలని ప్రార్ధిస్తూ ........ 

King Vallala Deva, Tiruvannamalai

చిత్రం
                                    పుత్రుడైన పరమేశ్వరుడు   పరమేశ్వరుడు తలచుకొంటే ప్రసాదించలేనిది అంటూ ఏదీ లేదు ! ఎనలేని అనుగ్రహాన్ని కురిపించగలరు.కన్నప్ప,మార్కండేయుడు,శిబి ఇలా ఎందరో మహానుభావులు అలాంటి కృపకు నోచుకొన్నవారే !! వారి కోవకు చెంది, మహేశ్వరుని మమతానురాగాలకు అర్హత పొందిన మరో భాగ్యశాలి వళ్ళాల దేవ మహారాజు.   శ్రీ కృష్ణ దేవరాయలు వెయ్యి కాళ్ళ మండపం మరియు  వళ్ళాల గోపురం  వీర వళ్ళాల దేవ రాజు - 3 దక్షిణ భారత దేశాన్నిపాలించిన శక్తివంతమైన "హొయసల "రాజ వంశానికి చెందిన వాడు. వీరి తొలి రాజధాని నేటి మైసూరుకు సమీపంలోని "హళిబేడు". ఆ రోజుల్లో దాని పేరు "ద్వార సముద్ర".   1233 నుండి 1346 వరకు (వంద సంవత్సరాలకు పైగా) వీరు నేడు కర్ణాటక, ఆంద్ర, తమిళనాడు, తెలంగాణాగా పిలవబడుతున్న ప్రాంతాలలోని  అధిక భూభాగాన్ని తమ పాలనలో ఉంచుకొన్నారు. హొయసల రాజులలో అత్యంత కీర్తిప్రతిష్టలు పేరొందిన పాలకుడు "వళ్ళాల దేవ ...