పోస్ట్‌లు

Pallipadai Temples of Tamilnadu

                 మళ్ళీ రాని  వారి కోసం పళ్లి పాడై ఆలయం  మన పవిత్ర భారతదేశ నలుదిశలా వేలాది పురాతన హిందూ దేవాలయాలు కనపడతాయి. వెయ్యి పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం సాంకేతికంగా అంతగా ఎదగని (?) సమయంలో  ఎన్నో వ్యయ ప్రయాసలతో యేండ్ల తరబడి వాటిని నిర్మింపచేశారు నాటి పాలకులు.  శిల్పులు కూడా తమ విద్యను వివిధ రకాలుగా ప్రదర్శిస్తూ కఠిన శిలలను రమణీయ శిల్పాలుగా మలచారు. సప్త స్వరాలను పలికించారు.  అంత కష్టపడి నిర్మించిన వాటిల్లో కొన్ని నేడు ఎంతో అభివృద్ధి చెందాయి. భక్తులకు కొంగు బంగారంగా నిలిచాయి. మరికొన్ని స్థానికంగా మాత్రమే గుర్తింపు పొందుతున్నాయి. మిగిలినవి మాత్రం ఎలాంటి ఆలనా పాలన లేక శిథిలావస్థకు చేరుకొన్నాయి. దాదాపుగా అన్నీ పరాయి దేశాల వారి దాడులకు గురి కావడం చెప్పుకోవలసిన విషయం.  వివరణ, గణాంకాలను పక్కన పెట్టి నిర్మించిన నిర్మాతలైన చక్రవర్తులు, మహరాజులు, పాలకులు ఏమైనారు ? సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరునికి విశిష్ట విశేష ఆలయాలు కట్టించిన వారు, తమ సామ్రాజ్యాన్ని నలుదిశలా వ్యాపింప చేసిన వారు, తమ వంశ గౌరవాన్ని ఇనుమడింప చేసి...
                    మానవత్వం మరిచిపోతున్న మనుషులు   "సోగ్గాడే చిన్ని నాయన " అంటూ బొంగురు గొంతు వినపడగానే పిల్లలమంతా పరిగెత్తేవాళ్ళము. చినిగిపోయిన గళ్ళ లుంగీ, మాసిపోయి ఏ రంగో చెప్పడం కష్టమయ్యే జుబ్బా తో మేడలో ఒక సంచి ధరించిన సాయుబు పై పాట పాడుతుంటే వెనక కాళ్ళ మీద నిలబడి తలా, ముందు చేతులను కదిలిస్తూ ఎగిరే ఎలుగుబంటిని చూడటమే పది సంవత్సరాల వయస్సు లోపల ఉన్నమాకు  ప్రధాన ఆసక్తి.  దీని తరువాత కోతులను ఆడించేవారు కూడా వచ్చేవారు. మధ్యమధ్యలో గోసాయి ముఠాల వారు తెచ్చే ఏనుగు అన్నిటికన్నా పెద్ద ఆకర్షణ మాకు.  ముక్కుల్లో వేసిన ఇనుప కళ్లెం పెట్టే ఇబ్బందిని, మూతికి కట్టిన ఇనుపవల భాధను భరిస్తూ ఆ మూగ ప్రాణి నృత్యం చేస్తోంది అన్న ఆలోచన  మాకు ఆ వయస్సులో కలిగేది కాదు. కోతులను ఆడించేవాడి చేతిలోని  కర్రను చూసిన భయంతో అవి చెప్పినట్లు చేస్తున్నాయి అన్న స్పృహ మాకు ఉండేది కాదు. కాళ్లకు కట్టిన బరువైన ఇనుప గొలుసుల వలన కలిగిన గాయాల నొప్పిని సహిస్తూ, రోజుకు పదుల సంఖ్యలో కిలోమీటర్ల నడుస్తుంటాయి ఏనుగులు అన్న విషయం తెలిసేద...

Arunachala Giri Pradakshana

చిత్రం
                      అరుణాచల గిరి ప్రదక్షిణా మహత్యం                                                  ( విధివిధానాలు, విశేషాలు, ఫలితాలు) పరమేశ్వరుడు పుడమిలోని పలు ప్రదేశాలలో లింగరూపంలో కొలువై వివిధ పేర్లతో పిలవబడుతూ ఆరాధించబడుతున్నాడు. భక్తులను ఈతి బాధల నుండి కాపాడుతున్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి కావలసిన అనుభూతిని, జ్ఞానాన్ని అనిగ్రహిస్తున్నాడు. "శివా" అని పిలిస్తే చాలు శుభాలను ప్రసాదిస్తున్నారు. అసలు "శివ" అంటే "శుభం" అని కదా అర్ధం.  అంతటి అల్ప సంతోష స్వామికి మన దేశం లోనే కాకుండా ఇరుగు పొరుగు దేశాలలో కూడా విశేష ఆలయాలు కలవు. వీటన్నింటిలో భక్తులు అధికంగా సందర్శించడానికి సిద్ధపడేవి "ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ". అవి "సోమనాథ, శ్రీశైలం, ఉజ్జయిని, ఓంకారేశ్వర, కేదారనాథ్ , భీమశంకరం, వారణాసి, త్రయంబకేశ్వరం, వైద్యనాథేశ్వర్,నాగేశ్వరం, రామేశ్వరం మరియు గృష్ణేశ్వర్.  ద్వాదశ లింగ దర్...