పోస్ట్‌లు

Thiruvahindrapuram Divyadesam

                          తిరువహీంద్రపురం         నూట ఎనిమిది దివ్యదేశాలలో ప్రతి ఒక్క క్షేత్రం తమవైన విశేషాలతో అక్కడ స్వయం దేవాధి దేవుడు నడయాడారని  నిర్ధారణ చేస్తున్నాయి. అందుకే ఈ దివ్య క్షేత్రాల పౌరాణిక గాథలు అనేక పురాణాలలోను మరియు పురాతన తమిళ గ్రంధాలలోను ప్రముఖంగా ప్రస్తావించబడినాయి. అదే కోవ లోనికి వస్తుంది తిరువహీంద్ర పురం దివ్యదేశం.   శ్రీ వైకుంఠ వాసుడు శ్రీ దేవాధిదేవన్ గానే కాకుండా శ్రీ రంగనాధునిగా, శ్రీ రామునిగానే కాకుండా జ్ఞాన ప్రదాత శ్రీ హయగ్రీవునిగా కూడా కొలువైన  ఈ క్షేత్రం విరజా (గరుడ) నదీతీరంలో ఉన్నది.  బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం మరియు బృహన్నారదీయ పురాణాలలో తిరువహీంద్ర పురం గురించి సవివరంగా వివరించబడినట్లుగా తెలుస్తోంది. వాటి ప్రకారం ఈ క్షేత్ర పురాణ గాధ అనేక విశేషాల సమాహారం అని అర్ధం అవుతుంది.  పురాణ గాధ  బ్రహ్మదేవుని నుండి పొందిన వర గర్వంతో ముల్లోకవాసులను హింసించసాగారు . వాని బారి నుండి కాపాడమని దేవతలు,మహర్షులు లయకారుని ఆశ్రయించారు. తారక...

Pandava Theertham, Thiruvannamalai

చిత్రం
  పాండవ తీర్థం, తిరువణ్ణామలై మహాభారతం ఆది కావ్యంగా పేరొందినది. వ్యాస భగవానుడు ప్రధాన పాత్ర పోషిస్తూ స్వయంగా తెలుపగా విఘ్ననాయకుడు  శ్రీ గణపతి అక్షరీకరించిన  మహా కావ్యంలో అన్ని యుగాలకు మరియు కాలాలకు సంబంధించిన విషయాలు వివరంగా ఉండటం విశేషం. అందుకే పెద్దలు  అంటారు మహా భారతంలో లేనిది లేదు అని. రాజకీయం, కుట్రలు, కుతంత్రాలు, యుద్దాలు, ప్రజల జీవన శైలి, నీతి  నియమాలు, న్యాయ, అన్యాయాలు, ధర్మ, అధర్మాలు,స్త్రీ గౌరవం, ఎంతటి వారినైనా వదలని కర్మ ఫలం ఇలా ఎన్నో పంచమ వేదం లో కనిపిస్తాయి.   ఈ మహా పురాణంలో ప్రధాన పాత్రలు కౌరవులు మరియు పాండవులు. వీరు దండయాత్రల పేరిట, యాత్రల నిమిత్తం మరియు ఇతర కార్యక్రమాల కొరకు భారతదేశ నలుమూలలా తిరుగాడినట్లుగా తెలుస్తోంది.    అందుకే భారత దేశంలోని ప్రతి  రాష్ట్రం లోని ఏదో ఒక చోట వీరితో ముడిపడి ఉన్న ప్రదేశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పాండవులు లక్క దహనం తరువాత,మాయా జూదంలో ఓటమి పాలు అయిన తరువాత  చేసిన పుష్కర కాల అజ్ఞాత వాసంలో అనేక ప్రాంతాలలో నివసించినట్లుగా అనేక స్థానిక కధనాలు తెలుపుతున్నాయి. అక్కడి వారు  వా...

Sri Suryanarayana Temple, Maroli

                            మార్తాండుడు కొలువైన మరోలి ప్రత్యక్ష నారాయణునిగా కీర్తించబడుతూ లోకాలకు వెలుగును తద్వారా ఆహారాన్ని , నీటిని అన్ని అవసరాలకు కేంద్రంగా భాసిల్లుతున్న ఆదిత్యునికి ఉన్న ఆలయాల గురించి అడిగితే ఎవరైనా మొదటగా టక్కున చెప్పేవి మన రాష్ట్రంలోని అరసవెల్లి, ఒడిషా లోని కోణార్క చెబుతారు. ఉన్న ఆలయాలు తక్కువే గానీ అన్నీ కూడా  విశేష ఆలయాలు కావడం చెప్పుకోవలసిన అంశం.   అలాంటి ప్రత్యేక ఆలయాల్లో  చాలా కొద్ది మందికి, స్థానికంగా భక్తులు అమిత భక్తి విశ్వాసాలతో సందర్శించే ఒక ఆలయం కర్ణాటకలోని ప్రసిద్ధ పట్టణం అయిన మంగళూరు నగరంలో నెలకొని ఉన్నది .  ఆలయ చరిత్ర ప్రకారం ఇక్కడ మార్తాండుడు కొలువైనది ఎప్పుడో తొలి యుగంలో అని, తొలి  ఆలయం నిర్మించి పన్నెండు వందల సంవత్సరాలైనది అని తెలియవస్తోంది.  అదే "మరోలి" లోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం.  సూర్య ఆరాధన  కృత యుగం నుండి హిందూ సంప్రదాయంలో సూర్య ఆరాధన ఉన్నది అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. రామాయణ, భారతాలలో స...

Urayur Divya Desam, Trichi

                                 ఉరయూర్ దివ్యదేశం   శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాలలో అగ్రస్థానం శ్రీ రంగనాధుడు కొలువు తీరిన శ్రీ రంగానిదే ! పవిత్ర కావేరీ నదీ తీరంలోని ఈ క్షేత్రానికి చుట్టుపక్కల తరువాత స్థానాలలో ఉన్న అయిదు క్షేత్రాలు నెలకొని ఉన్నాయి.  అవి వరుసగా "తిరుకోళి(ఉరయూర్), తిరుకరంబనూర్ (ఉత్తమార్ కోయిల్), తిరువెళ్ళరాయి, తిరుఅంబిల్, తిరుప్పరనగర్(కొయిలాడి). ఈ అయిదు క్షేత్రాలు విశేష పౌరాణిక నేపథ్యం, ఎన్నో శతాబ్దాల చరిత్రకు నిలయాలు.  ప్రస్తుతం ఉరయూర్ గా పిలవబడుతున్న తిరుచ్చి నగర శివారు ప్రాంతం గతంలో చోళ రాజుల తొలి రాజధానిగా "నిచ్చలా పురి లేదా తిరుకోళి"గా పిలువబడింది. ఉరయూర్ హరిహర క్షేత్రం. దివ్యదేశం గానే కాకుండా శైవులకు దర్శనీయ స్థలాలైన పడాల్ పెట్ర స్థలాలలో ఒకటిగా గుర్తింపు పొందినది.  ఇక్కడి విష్ణాలయాన్ని మరియు శివాలయాన్ని చోళులే నిర్మించారని శాసనాధారాలు తెలుపుతున్నాయి.  శ్రీ అళగియ మానవళ్ పెరుమాళ్(సుందరమైన పెండ్లికుమారుడు) గా వైకుంఠ వాసుడు పూజలందుకొంటున్న స...

Uttamar Koil, Tirukarambanur, Trichi

                         ఉత్తమార్ కోవిల్ (తిరుకరంబనూర్) శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో మూడో స్థానం లో ఉన్న "తిరుకరంబనూర్ లేదా ఉత్తమార్ కోవిల్" అత్యంత అరుదైన క్షేత్రంగా ప్రసిద్ధి.  తిరుకరంబనూర్, కదంబవన క్షేత్రం, ఉత్తమార్ కోవిల్, బిక్షందార్ కోవిల్ ఇలా ఎన్నో పేర్లతో పిలవబడే ఈ క్షేత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణ, సర్వేశ్వరుడు ముగ్గురూ తమ ధర్మపత్నులతో కలిసి కొలువై దర్శనమిస్తారు. ఈ  పేర్లకు,స్థల పురాణానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది.  శ్రీ హరి దర్శనాన్ని అపేక్షిస్తూ కదంబముని ఇక్కడ తపస్సు చేసి శ్రీవారి సాక్షాత్కారాన్ని  పొందారట.  అలా "తిరుకరంబనూర్ " అన్న పేరు వచ్చింది. గతంలో ఈ ప్రాంతం పెద్ద కదంబ వనం. అందువలన "కదంబవన క్షేత్రం" అని పిలిచేవారు.  శ్రీ పురుషోత్తమ పెరుమాళ్ ఈ దివ్యదేశ మూలవిరాట్టు. పురుషోత్తమన్ అన్న సంస్కృత పదానికి తమిళంలో " ఉత్తమార్" అన్నది సరైన పదం. అలా అధిక భాషాభిమానం కలిగిన తమిళ ప్రజలు "ఉత్తమార్ కోవిల్ అని పిలుస్తారు.  కైలాస వాసుడైన పరమశివుడు బిక్ష స్వీకరించినది ఇక్కడే...

SriPardhasaradhi Perumal Temple, Triplicane, Chennai

           శ్రీ పార్ధ సారధి ఆలయం, ట్రిప్లికేన్ తమిళనాడు రాష్ట్ర రాజధాని నేటి చెన్నై (గతంలో చెన్నపట్టణం, మద్రాస్ )నగరంలోనూ, చుట్టుపక్కల ఎన్నో విశేష ఆలయాలు కలవు. వీటిల్లో శ్రీ వైష్ణవ దివ్య దేశాలు (తిరుపతులు) ఏడు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆలయం తమవైన ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. అన్నింటి లోనికి మరీ ముఖ్యంగా చెప్పాలంటే నూట ఎనిమిది దివ్య దేశాలలో అగ్రగామిగా ఉన్న కొన్నింటిలో ఒకటిగా గుర్తింపబడిన శ్రీ పార్ధసారధి ఆలయం చెన్నై నగర  నడి బొడ్డున ఉన్న ట్రిప్లికేన్ ప్రాంతంలో ఉన్నది.   నాలుగు యుగాలతో ముడిపడి ఉన్న ఆలయగాధ, చరిత్ర ఈ ఆలయ సొంతం. మరే దివ్య దేశం లోనూ కానరాని అనేకానేక విశేషాల సమాహారమే ఈ దేవాలయము. బ్రహ్మాండ, విష్ణు మరియు నారద పురాణాలాలలో ఈ క్షేత్ర ప్రస్థాపన ఉన్నట్లుగా తెలుస్తోంది.  తిరువళ్ళి కేని తొలి యుగం నుండి  అనేక ముని వాటికలకు నిలయం ఈ తులసీ వనం లేదా బృందారణ్యం. వీరు చేసే యజ్ఞయాగాలకు కావలసిన నీటి అవసరాలను తీర్చే పుష్కరిణి అందమైన పుష్పాలతో నిండి ఉండేది. ముని వాటికలో ఉండి పవిత్ర కార్యక్రామాలకు ఉపయోగించే స్వచ్ఛమైన నీటితో పాటు సుందర పుష్పాలతో ఉన...

Tiruvannamalai New Photos

చిత్రం