పోస్ట్‌లు

Sri Sundara Kamakshi Amman Temple, Sirukarambur

చిత్రం
      అరుదైన విశేషాల  శ్రీ సుందర కామాక్షి అమ్మన్ ఆలయం  తమిళనాడు రాష్ట్ర పటంలో ఈ గ్రామానిది చాలా చిన్న స్థానం. అనేకానేక పల్లెలలో ఒకటి. కానీ గతంలో ఒక గొప్ప స్థానం పొందిన గ్రామంగా చరిత్రలో సుస్థిర కీర్తి పొందినది సిరుకరంబనూర్. దానికి ముఖ్యకారణం ఇక్కడ ఉన్న శ్రీ సుందర కామాక్షీ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వార్ల ఆలయం.  సుమారు పది  లేదా పదకొండవ శతాబ్దాల కాలానికి చెందిన ఈ ఆలయం చోళ రాజుల నిర్మితంగా తెలుస్తోంది. నిర్మాణశైలి, లభించిన ఒకటవ రాజరాజ చోళుని శాసనాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి.  గొప్ప చరిత్ర, ఆకర్షించే శిల్పకళ, అనేక ప్రత్యేకతలు కలిసి ఈ ఆలయాన్ని ఒక విశేష దర్శనీయ స్థలంగా మార్చాయి.  సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం సుమారు ఒకటిన్నర శతాబ్దం పాటు భూమిలో ఉండిపోయినది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1958వ సంవత్సరంలో పెద్ద ఇసుక గుట్ట క్రింద ఉన్న ఈ నిర్మాణాన్ని వెలికి తీశారు. ఇలా ఆలయాన్ని భూమిలో దాచిపెడటానికి గల  కారణం ఏమిటంటే ఆ సమయంలో నిరంతరం జరిగిన పరాయి మతస్థుల దండయాత్రలు.  వాటి నుండి తమ ఆరాధ్య దైవం కొలువు త...

Pandava Theerdham, Thiruvannamalai

చిత్రం
  పాండవ తీర్థం  మహాభారతం ఆది కావ్యంగా పేరొందినది. వ్యాస భగవానుడు ప్రధాన పాత్ర పోషిస్తూ స్వయంగా తెలుపగా విఘ్ననాయకుడు  శ్రీ గణపతి అక్షరీకరించిన  మహా కావ్యంలో అన్ని యుగాలకు మరియు కాలాలకు సంబంధించిన విషయాలు వివరంగా ఉండటం విశేషం. అందుకే పెద్దలు  అంటారు మహా భారతంలో లేనిది లేదు అని. రాజకీయం, కుట్రలు, కుతంత్రాలు, యుద్దాలు, ప్రజల జీవన శైలి, నీతి  నియమాలు, న్యాయ, అన్యాయాలు, ధర్మ, అధర్మాలు,స్త్రీ గౌరవం, ఎంతటి వారినైనా వదలని కర్మ ఫలం ఇలా ఎన్నో పంచమ వేదం లో కనిపిస్తాయి.   ఈ మహా పురాణంలో ప్రధాన పాత్రలు కౌరవులు మరియు పాండవులు. వీరు దండయాత్రల పేరిట, యాత్రల నిమిత్తం మరియు ఇతర కార్యక్రమాల కొరకు భారతదేశ నలుమూలలా తిరుగాడినట్లుగా తెలుస్తోంది.    అందుకే భారత దేశంలోని ప్రతి  రాష్ట్రం లోని ఏదో ఒక చోట వీరితో ముడిపడి ఉన్న ప్రదేశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పాండవులు లక్క దహనం తరువాత,మాయా జూదంలో ఓటమి పాలు అయిన తరువాత  చేసిన పుష్కర కాల అజ్ఞాత వాసంలో అనేక ప్రాంతాలలో నివసించినట్లుగా అనేక స్థానిక కధనాలు తెలుపుతున్నాయి. అక్కడి వారు  వాటికి తగి...