పోస్ట్‌లు

Ashtabujakaram Temple, Kanchipuram

చిత్రం
అష్టభుజ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం   విష్ణు కంచి లోని మరో శ్రీ వైష్ణవ దివ్య దేశం "అష్టభుజ పెరుమాళ్ ఆలయం".  ఎనిమిదో శతాబ్ద కాలంలో పల్లవ రాజులచే నిర్మించబడిన ఈ ఆలయం లోని మూలవిరాట్టు ప్రత్యేకంగాను, శాంత సుందరంగాను దర్శనమిస్తారు.   ఈ ఆలయ పురాణ గాధ కూడా సరస్వతీ దేవి మరియు బ్రహ్మ దేవుల మధ్య వివాదానికి సంబంధించినదే !!! తాను ఎన్ని అడ్డంకులు సృష్టించినా విధాత అశ్వమేధ యాగం కొనసాగించడంతో మరింత ఆగ్రహించిన అమ్మవారు భయంకరమైన సర్పాన్ని పంపినదట. యాగ సంరక్షణార్థం ఉన్న శ్రీహరి ఆ క్రూర సర్పాన్ని సంహరించడానికి ఎనిమిది రకాల ఆయుధాలను చేపట్టారట. నిలువెత్తు రూపంతో అష్ట భుజాలతో, రమణీయ అలంకరణతో శాంత సుందర రూపంతో భక్తులకు అభయం ఇస్తారు శ్రీ అష్ట భుజ పెరుమాళ్. స్వామి చక్రం, గద,కత్తి,బాణం, ధనుస్సు,పద్మం, శంఖు, డాలు ధరించి ఉంటారు. మరో కథనం ప్రకారం గజరాజు గజేంద్రుని మొసలి బారి నుండి కాపాడి మోక్షాన్ని ప్రసాదించినది ఇక్కడే అని అంటారు. ఈ కారణం చేతనే ఆలయానికి వెలుపల ఉన్న పుష్కరిణిని "గజేంద్ర పుష్కరణి" అంటారు. అమ్మవారు శ్రీ పుష్పక వల్లీ  తాయారు విడిగా మరో...

Nava Rathri

చిత్రం
అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రులలో అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మను కొలిచి ఆమె అనుగ్రహంతో జీవితాలను సుఖమయం చేసుకోవాలని కోరుకొంటూ .........  

Thiruparankundram

చిత్రం
                                తిరుప్పరంకుండ్రం శ్రీ మురుగన్ ఆలయం                 ఆది దంపతుల ముద్దుల కుమారుడు కొలువైన ప్రసిద్ధి చెందిన ఆరుపాడై వీడు ఆలయాలలో ఒకటి తిరుప్పరంకుండ్రం శ్రీ మురుగన్ ఆలయం. మదురై పట్టణంలో భాగమైన ఈ క్షేత్రం యొక్క పురాణ గాధ పలమదురై చోళై క్షేత్రానికి చెందిన గాథే !!!  ఇక్కడ కుమార స్వామి సూరపద్ముని యుద్ధంలో ఓడించి, తన సేవకునిగా చేసుకొన్నారు. సదాశివుని వరము తో ఒకటిగా మారిన అసుర సోదరులు సూరుడు, పద్ముడు, వరబలంతో ముల్లోకాలను ఆక్రమించి అందరినీ అష్టకష్టాల పాలు చేస్తుండేవారు.  ఆ రాక్షసుణ్ణి అదుపు చేయగలిగినది ఒక్క పార్వతీనందనుడు మాత్రమేనని శ్రీ మహావిష్ణువు తెలుపగా మన్మధుని సహాయంతో సర్వేశ్వరుని తపస్సు భగ్నం చేయగలిగారు దేవతలు. ఈ క్రమంలో మన్మధుడు త్రినేత్రుని క్రోధాగ్ని జ్వాలలకు భస్మం కావడం అది వేరే కధ ! అప్పుడు వెలువడిన త్రినేత్రుని తేజస్సు నుండి షణ్ముఖుడు ఉద్భవించడం అతను దేవసేనలత...

Ulaganda Perumal Temple, Kanchipuram.

చిత్రం
శ్రీ ఉలగండ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం   కంచి లో ఉన్న శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ఈ ఆలయం ఎన్నో విధాలుగా ప్రత్యేకం.  కంచి లో ఉన్న అర్చనామూర్తులలో ఎత్తైన రెండు విగ్రహాలలో ఒకటి ఈ ఆలయంలో ఉంటుంది.  ముప్పై ఐదు అడుగుల ఉలగండ పెరుమాళ్ (లోకాలను కొలిచిన పరంధాముడు)విగ్రహం ఒక అద్భుత అనుభూతిని ప్రసాదిస్తుంది.  శ్రీమహావిష్ణువు వామనునిగా వచ్చి రాక్షస రాజు బాలి ని మూడు అడుగుల నెల కోరుకొని "త్రివిక్రము"నిగా మారి తొలి రెండు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించి,బలి కోరిక మేరకు మూడో అడుగు రాక్షస చక్రవర్తి తలా మీద పెట్టి పాతాళానికి పంపారు.  ఈ కధ మనందరికీ తెలిసినదే ! కానీ ప్రహ్లాదుని మనుమడు అయిన బలి చక్రవర్తి కి అందరూ అతనిని పాతాళానికి పంపిన త్రివిక్రమ రూపన్ని వేనోళ్ళ కొనియాడుతుంటే ఆసమయంలో తన తల మీద శ్రీ పాదం ఉండటం వలన ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోలేక పోయానని బాధపడిపోయాడు.  అతని ప్రార్ధనకి,తనయందు గల భక్తికి  సంతసించిన శ్రీ హరి అతనికి తన త్రివిక్రమ రూప సందర్శనా భాగ్యాన్ని ఇక్కడ అనుగ్రహించారని స్థానిక పురాణ గాధ. బాలి కోరిక మేరకు స్వామి చిన్న సర్పరూపంలో ప్రధాన అర్చనా మూ...