19, నవంబర్ 2013, మంగళవారం

Sri Prasanna Venkatesa Perumal Temple.

అనాదిగా ఎందరో మహానుభావులు శివ కేశవులకు భేదం లేదని తెలుపుతూ వచ్చారు.
అయినా తమ దైవం గొప్ప అంటూ కత్తులు దూసుకొనే వారికి ఈ విషయాన్ని తెలపాలి అని స్వయంగా భగవానుడే నిర్ణయించుకొని కొలువైన క్షేత్రం తిరుప్పార్కడల్ ( పవిత్ర పాల సముద్రము  ).
ప్రధాన అర్చనా దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర పెరుమాళ్.

పురాణం ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రం పరిహార క్షేత్రంగా పేరొందినది. 
పక్కపక్కనే ఉన్న ఆలయాలలో ఒక దానిలో శ్రీ ప్రసన్న వెంకటేశ పెరుమాళ్, రెండో దానిలో అనంత శయన శ్రీ రంగ నాద స్వామిగా కొలువు తీరిన ఏకైక స్థలం తిరుప్పార్ కడల్. 

పురాణ గాధ :

విధాత బ్రహ్మా కంచిలో ఆరంభించిన యాగాన్ని శాస్త్రోక్తం గా నిర్వహించిన సప్త మహా మునులు సమీపంలోని శ్రీ యోగ నారసింహ స్వామి కొలువుతీరిన " ఘటికాచలం " ( అరక్కోణం సమీపంలోని నేటి షోలింగనూరు ) కి పయనమయ్యారు. కాని వారిలో ఒకరైన "పుండరీక మహర్షి " వేరుగా బయలుదేరారు. 
ఈయన అమిత విష్ణు భక్తుడు. 
మార్గ మద్యలో ఉన్న విష్ణు ఆలయాలను సందర్శించుకొంటూ వైకుంఠ ఏకాదశి నాటికి ఈ ప్రాంతానికి వచ్చారు. 
   



































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...