పోస్ట్‌లు

మే, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

Vellamassery Garudan Kavu

చిత్రం
                                వినుతాసుతుని ఏకైక ఆలయం - గరుడన్ కావు   మన హిందూ దేశం అనాదిగా సర్వాంతర్యామి అయిన పరమాత్మ స్వయం నడయాడిన పుణ్యభూమి. మానవ జీవిత అర్ధం పరమార్ధం తెలిపే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు పుట్టిన పుణ్య భూమి.  మనకి భగవంతుని పట్ల అచంచల విశ్వాసం.  ముఖ్యంగా జీవితంలో కష్టకాలంలో, అనారోగ్య విషయంలో, ఆర్ధిక సమస్యలలో ముందుగా గుర్తుకు వచ్చేది దేవదేవుడే ! ఈ కారణంగా మనకి ఎందరెందరో దేవీదేవతలు. వారందరికీ వేరువేరు బాధ్యతలు అప్పగించబడినాయి. అవసర సమయంలో వారు అర్హులై పుణ్య కర్మ కలిగిన భక్తులను ఆడుకుంటారు అని తెలిపే దృష్టాంతాలు మనకి పురాణాలలో, క్షేత్ర గాధలలో కనిపిస్తాయి.  ఈ విశ్వాసాలకు అనుగుణంగా ఎన్నో ఆలయాలు కూడా మనదేశం నలుమూలలా కనిపిస్తాయి.  ముఖ్యంగా ప్రత్యేక, అరుదైన ఆలయాల ప్రదేశం ఈ దేవతల  స్వస్థలం.  దేశంలో అతి అరుదుగా కనిపించే ఎన్నో దేవీదేవతల దేవాలయాలు కేరళలో కనిపిస్తాయి.   అలాంటి ప్రత్యేక ఆలయాల కోవలోనిదే "వెళ్ళమ శ్శరీ  గరుడన్ కావు".  శ్రీ మన్...

Sri Chitraputhira yama dharmaRaja Temple, Coimbatore

చిత్రం
                      చిత్ర పుతిర శ్రీ యమ ధర్మ రాజ ఆలయం  మన పురాణాల ప్రకారం మనకున్నది ముక్కోటి దేవీ దేవతలు.  వీరిలోని ప్రతి ఒక్కరు జీవుల నిత్య జీవన విధానాన్ని ప్రభావితం చేసేవారే ! అందుకే అందరికీ ఆలయాలు లేకున్నా మన పూజా విధానం లో అందరిని సంతృప్తి పరచే మంత్రాలు ఉన్నాయి.  అలా మానవ జీవితాలు ప్రశాంతంగా గడిచి పోతాయన్నది ఒక విశ్వాసం.  అదే విధంగా ఎన్నో భాషల సంస్కృతుల నిలయమైన మన దేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైన ఆరాధన విధానాలు, నమ్మకాల ప్రకారం ఆలయ నిర్మాణాలు జరిగాయని ఆ యా క్షేత్ర గాధలను చదివినప్పుడు తెలుస్తోంది.  అలాంటి దానికి సాక్ష్యం గా కనపడేదే " చిత్ర పుతిర శ్రీ యమ ధర్మ రాజ ఆలయం ".  తమిళ నాడు లోని ముఖ్య నగరాలలో ఒకటైన కోయంబత్తూర్ కు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్లలూరు గ్రామ శివారులలో ఉన్నదీ ఆలయం.   సుమారు మూడు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిన ఈ ఆలయం కొన్ని కుటుంబాల అధీనంలో ఉండి, వారే పూజారులుగా వ్యవహరిస్తున్నారు.  కాలక్రమంలో మిగిలిన వారు కూడా సందర్శి...

Chennai Temples

చిత్రం
                    శ్రీ ముఖ్య ప్రాణ ఆంజనేయ స్వామి ఆలయం   తమిళ నాడు ఆ రాష్ట్ర రాజధాని చెన్నై ఆలయాలకు ప్రసిద్ది.  అందులో శ్రీ పార్ధ సారధి స్వామి ఆలయం ఉన్న త్రిప్లికేనే ప్రాంతం ఎన్నో చిన్నా పెద్ద ఆలయాలకు నిలయం.  ఏంతో పౌరాణిక చారిత్రాత్మిక విశేషాల సమాహారమైన శ్రీ పార్ధసారధి స్వామి ఆలయ పుష్కరణి కి దక్షిణాన ఉన్న హనుమంత రాయ కోవిల్ వీధిలో ఒక విశేష ఆంజనేయ ఆలయం ఉన్నది.  అదే శ్రీ ముఖ్య ప్రాణ ఆంజనేయ స్వామి ఆలయం.  గృహ సముదాయాల మధ్యన ఉన్న ఈ మందిరం లోని ఆంజనేయుని 1794వ సంవత్సరంలో అప్పటి ఉత్తరాది మఠం పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ సత్య సందారు స్వామి ప్రతిష్టించారు.  కాలక్రమంలో భక్తుల సహాయ సహకారాలతో ప్రస్తుత రూపం సంతరించుకొన్నది.  గర్భాలయంలో ఎత్తైన గట్టు మీద సుమారు పది అంగుళాల శ్రీ భక్త ఆంజనేయ స్వామి విగ్రహం కుడి కాలుని కొద్దిగా వంచి ఉత్తరాభిముఖంగా స్థానక భంగిమలో దర్శనమిస్తుంది.    సన్నటి ప్రదక్షిణా పదంలో అష్ట దిక్కులా నాగ రూపాలను ఉంచారు. ...