Sri Lakshmi Narasimha Swamy Temple, Guntur

శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయం, గుంటూరు సర్వ లోక రక్షకునిగా పేర్కొనే శ్రీ మన్నారాయణుని దశావతారాలలో తొలి నాలుగు అవతారాలు సంకల్ప మాత్రాన అవతరించినవి.జననీజనకులు లేకుండా జన్మించిన "సద్యోజాత రూపాలు". వీటిల్లో అత్యంత ప్రముఖమైనది శ్రీ నారసింహ అవతారం.దుష్ట సంహరునిగా, భక్త వరదునిగా, అపమృత్యు భయాన్ని తొలిగించేవానిగా, కోరిన కోర్కెలు కురిపించే కల్పతరువుగా ఈ స్వామి ప్రసిద్దుడు. శ్రీ నరసింహునికి మన రాష్ట్రంలో పెక్కు ప్రసిద్ద ఆలయాలున్నాయి. చరిత్రలో సముచిత స్థానం ఉన్నా స్థానికంగా మాత్రమే గుర్తింపు ఉన్న ఒక నారసింహ ఆలయం ఒకటి గుంటూరు పట్టణంలో నెలకొని ఉన్నది. ఆరువందల యాభై సంవత్సరాల క్రిందట స్థానిక భక్తునికి స్వప్న దర్శనమిచ్చిన స్వామి "తానొక చెట్టు తొర్రలో ఉన్నాను" అని తెలిపారట. అతడు ప్రాంత పాలకులైన కొండవీటి రెడ్డి రాజుకు విషయం విన్నవించుకొన్నారు. రాజాదేశం మేరకు సాగిన అన్వేషణలో శ్రీ లక్ష్మీ నరసి...