పోస్ట్‌లు

Ananta Basubeva Temple, Bhubaneswar

చిత్రం
                              శ్రీ అనంత వాసుదేవ ఆలయం   జగన్నాథ భూమిగా ప్రసిద్ధి చెందినది ఉత్కళదేశం. అదే నేటి ఒడిశా.  శ్రీమన్నారాయణుడు శ్రీ జగన్నాథునిగా సోదరుడు శ్రీ బలదేవ మరియు సోదరి శ్రీ సుభద్ర దేవి సమేతంగా కొలువు తీరిన ఏకైక క్షేత్రం పూరీ. స్వామి వారి రూపం, వారికి చేసే ఉత్సవాలు, ముఖ్యంగా శ్రీ జగన్నాథ రధోత్సవం ప్రవంచవ్యాప్తంగా గుర్తింపును పొందాయి. లక్షలాది మంది దేశ విదేశీయ యాత్రికులను పూరీ కి రప్పిస్తున్నాయి.  సుందర సాగర తీరం పూరీకి గల అదనపు ఆకర్షణ.  ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్. ఆలయాల నగరంగా పేరు. ఒకప్పుడు వెయ్యి ఆలయాలు ఉండేవని అంటారు. గతంలో ఏకామ్ర క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన భువనేశ్వర్ లో నేడు సుమారు ముప్పై దాకా శిధిల మరియు పూజాదికాలు నిర్వహించబడుతున్న ఆలయాలు  మాత్రమే కనిపిస్తున్నాయి.  నిరంతరం జరుగుతున్న త్రవ్వకాలలో అనేక శిధిలాలు వెలుగు చూస్తున్నాయి.  వీటిల్లో ముఖ్యమైనది శ్రీ లింగరాజ ఆలయం. మిగిలిన వాటిలో కూడా శివాలయాలు అధికం. వాటి మధ్యలో మరో ముఖ్యమైనది శ్రీ అనంత వాసుద...

RajaRani Temple, Bhubaneswar

చిత్రం
                              రాజారాణి ఆలయం, భువనేశ్వర్   ఆలయాల నగరంగా ప్రసిద్ధి ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్. ఒకప్పుడు వెయ్యికి పైగా ఆలయాలు ఈ ఏకామ్ర క్షేత్రంలో ఉండేవని ప్రతీతి. గతంలో ఈ ప్రాంతం అనేక మామిడి వనాలతో నిండి ఉండేదట. అలా ఏకామ్ర క్షేత్రం గా పేరొందినది.   పరాయి పాలకుల దాడులలో అనేక ఆలయాలు కనుమరుగయ్యాయి. మరికొన్ని కాల గమనంలో శిధిలమయ్యాయి. ప్రస్తుతం చాలా కొద్ది నిర్మాణాలు మాత్రమే కనపడుతున్నాయి. వాటిల్లో నిత్య పూజలు జరుగుతున్నవి బహు కొద్ది.  మిగిలినవన్నీ మూలవిరాట్టులు లేకుండా కనపడతాయి. కానీ నేడు కనిపించే ప్రతి ఒక్క నిర్మాణం నాటి శిల్పుల నేర్పరితనాన్ని, వృత్తి పట్ల వారికి గల అచంచల భక్తిశ్రద్ధలను మనకు ఘనంగా చూపుతాయి.   అధికశాతం నిర్మాణాలు పది నుండి పన్నెండవ శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించబడ్డాయి. వీటిల్లో అనేక శృంగార శిల్పాలు కనపడటం నాటి శిల్పుల పైన ఖాజారాహో నిర్మాణాల ప్రభావం ఉన్నది అన్నది చరిత్రకారుల అభిప్రాయం.  ఈ నిర్మాణాలు అన్నీ స్థానికంగా లభించే ఒకరకమైన రాతితో నిర్మించబ...

Sri Dhabaleshwara Mahadev Temple, Cuttack

చిత్రం
                             దయగల దైవం ధభళేశ్వరుడు   ఉత్కళ దేశం జగన్నాథ భూమిగా ప్రసిద్ధి. ఒరియా ప్రజల ఆరాధ్య దైవం శ్రీ జగన్నాధుడు. వారి తల్లి తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే ! వారి విశ్వాసానికి తగినట్లుగానే జగన్నాధుడు సోదర సోదరీ సమేతుడై తన ప్రజల గృహాల వద్దకు రధారూరుడై తరలి వెళతారు. ప్రతినిత్యం తనకు నివేదించే భోజనాన్ని తన వారందరికీ మహాప్రసాదం క్రింద అందచేస్తారు.  కానీ చిత్రమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో అధికంగా ఆది దంపతులైన శ్రీ దుర్గ మహేశ్వరుల ఆలయాలు కనపడటం.  మొత్తంగా యాభై ఒకటి శక్తి పీఠాలు భారత దేశం తో పాటు పక్కన ఉన్న దేశాలలో ఉన్నాయన్నది పురాణాలు తెలుపుతున్న విషయం. వీటిల్లో పద్దెనిమిది "అష్టాదశ శక్తి పీఠాలు"గా ప్రసిద్ధి. అవి కాకుండా మరో నాలుగు మహా లేక ఆది శక్తి పీఠాలు కూడా ఉన్నాయి అంటారు. వాటిల్లో రెండు, అష్టాదశ పీఠాలలో ఒకటి ఒడిశాలో ఉండటం చెప్పుకోవలసిన  విశేషం.  ఇక కైలాసనాధునికి అనేక ప్రసిద్ధ ఆలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.  ఇవన్నీ కూడా తమవైన పురాణ చారిత్రక నేపధ్యం కలిగి ఉండటం ప్రస్తావిం...