పోస్ట్‌లు

Sri Balli Giri Sri Venkateswara Swamy Temple, Visakhapatnam

చిత్రం
                శ్రీ శ్రీ శ్రీ బల్లి గిరి వెంకటేశ్వర స్వామి ఆలయం , విశాఖ పట్టణం   కలియుగ వరదుడు ఎన్నో స్థలాలలో స్వయంభూగా వెలసి భక్తులకు తమ సేవా భాగ్యం ప్రసాదిస్తున్నారు.  శ్రీ వారి కృపాకటాక్షాలకు ప్రాంతీయత లేక మతం ప్రతిబంధకాలు కావని, అదేవిధంగా సర్వాంతర్యామి ఏ రూపం      లోనైనా తన శరణు కోరిన వారు ఎవరైనా ఎక్కడ ఉన్నా కరుణించి కష్టాల కడలి తీరం చేరుస్తారు అన్నదానికి నిదర్శనంగా నిలిచే క్షేత్రం శ్రీ బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం.   భారత దేశంలో సుందర సాగర తీర నగరాలలో ఒకటిగా గుర్తింపు పొందినది  విశాఖ పట్టణం. "సిటీ ఆఫ్ డెస్టినీ"  గా పేరొందిన ఈ నగర మధ్యలో ఉన్న డాభా గార్డెన్స్ ప్రాంతంలో చిన్న కొండ (స్థానికంగా వెంకటేశ్వర గుట్ట అనిపిలుస్తారు)బల్లిగిరి అనే పేరు రావడానికి, ఇక్కడ బ్రహ్మాండ నాయకుడు కొలువు తీరడానికి వెనుక నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్నది అని తెలియవస్తోంది.  పదిహేడో శతాబ్దం లో కొందరు డచ్ వ్యాపారులు సముద్ర మార్గంలో ప్రయాణిస్తుండగా చిన్నగా ప్రారంభమైన వాన భీకర తుఫాన్ ...

Sri Kanaka Mahalakshmi Ammavari Temple, Visakhapatnam

చిత్రం
                   శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం , విశాఖ పట్టణం   విశాఖ వాసులకే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి గత శతాబ్ద కాలంగా ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు.  నేడొక ప్రముఖ పట్టణంగా గుర్తింపబడిన విశాఖ వంద సంవత్సరాల క్రిందట ఒక చిన్న ఊరే ! ఒకప్పుడు ఈ ప్రాంత పాలకులు నివసించిన బురుజు పేట లోని ఒక బావిలో అమ్మవారి విగ్రహం లభించినది.  దొరికిన చోటే ప్రతిష్టించాలన్న అమ్మవారు ఒక భక్తుని ద్వారా అందించిన ఆదేశం ప్రకారం రహ దారి మధ్యలో విగ్రహాన్ని ఉంచి పూజలు ప్రారంభించారు.  కొద్ది సంవత్సరాలు అలానే ఉన్న అమ్మవారిని ఆనాటి ఆంగ్ల పాలకులు పక్కకు జరిపారు.  కాతాళీయమో లేక మరొకటో అదే సమయంలో మహా భయంకర "ప్లేగు"వ్యాధి విశాఖ మీద తన కర్కశ పంజా విసిరింది.  ఎందరో ప్రాణాలు కోల్పోయారు.  ప్రజలు ఇదంతా అమ్మవారి విగ్రహాన్ని పక్కకు జరిపిన దాని ఫలితంగా భావించి తిరిగి పాత స్థానంలో ఉంచారు.  అంతే కొద్దికాలం లోనే వ్యాధి తగ్గి పోయినది.  నాటి నుండి భక్తులను కాపాడే దేవతగా అమ్మవారు పేరుపొందారు....

Sri Satya Narayana Swamy Temple, Visakhapatnam

చిత్రం
      శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం, విశాఖ పట్టణం  సుందర సాగర తీర నగరం విశాఖపట్టణం.  ఎన్నో ప్రకృతి అందాలు ఈ ప్రాంత సొంతం.  ప్రకృతే కాకుండా పరమాత్మ కూడా వివిధ రూపాలలో కొలువు తీరిన అనేక ఆలయాలు ఈ ప్రాంతం లో ఎన్నో ఉన్నాయి.  వాటిల్లో నగర నది బొడ్డున రెండు శతాబ్దాల క్రిందట నెలకొల్పబడిన శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఒకటి.  రెండు వందల సంవత్సరాల క్రిందట శ్రీ సీతారం బాబాజీ అనే సాధువు ఉత్తర భారతం నుండి పాలరాతితో సుందరంగా మలచిన విగ్రహాలను తెప్పించి ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది.  ఆనతి కాలం లోనే భక్తులకు కలిగిన అపూర్వ అనుభవాలతో ఆలయం దినదినాభివృద్ది చెందినది.  సుమారు ముప్పై సంవత్సరాల క్రిందట ఆలయాన్ని పునః నిర్మించారు.  ప్రస్తుతం నగరంలో పేరొందిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటి అధ్వర్యంలో ఉన్న ఆలయాన్ని  ప్రతి నిత్యం ఎందరో భక్తులు సందర్శించు కొంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర తూర్పు ప్రాంత ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా పేరొందిన కింగ్ జార్జి ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఇసుక ...

Kottai Eswaran Temple, Coimbattor

చిత్రం
          శ్రీ సంగమేశ్వర స్వామి  ( కోట్టై ఈశ్వరన్ ) ఆలయం, కోయంబత్తూర్   తమిళ నాడులోని ప్రముఖ పట్టణాలలో ఒకటైన కోయంబత్తూర్ కి  ఆ పేరు రావడానికి కారణమైన ఆలయమిది.  పురాణకాలం నాటి గాధలతో, సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్రకు ప్రత్యక్ష సాక్షి శ్రీ సంగమేశ్వర స్వామి లేదా స్థానికంగా కోట్టై ఈశ్వరన్ కోవెల గా పిలవబడే ఈ ఆలయం. కోయంబత్తూర్ రైల్వే జంక్షన్ స్టేషన్ కు సమీపం లోని టౌన్ హాల్ సెంటర్  ఈశ్వరన్ కోవిల్ వీధిలో ఉంటుందీ ఆలయం. కృత యుగంలో బ్రహ్మ దేవుని నుండి పొందిన వరబలంతో లోకకంటకునిగా మారిన అసురుని కైలాస నాధుడు భీకర యుద్దంలో ఇక్కడే సంహరించి, అందరి విన్నపం మేరకు స్వయంభూగా కొలువుతీరారట . తదనంతర కాలంలో శివ పార్వతుల కుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఒకే శరీరంలో ఉన్న శూర పద్ములనే  రాక్షస సోదరులను సంహరించి, యుద్ద సమయంలో వాహనంగా దేవేంద్రుడు ఇచ్చిన ఐరావతం అలసిపోడంతో, దానికి విశ్రాంతి కలిగించడానికి  ఇక్కడి పుష్కరణి వద్దకు వచ్చారట. పదో శతాబ్దంలో సంతానం కొరకు వివిధ క్షేత్రాలను సందర్శించిన చోళ...