పోస్ట్‌లు

sri shaneeshwara Swamy, Kanumalopalli ( Kadapa )

చిత్రం
    శ్రీ మందగిరి శ్రీ శనీశ్వర స్వామి, కనుమలోపల్లి ( సిద్ధవటం మండలం ) సమస్త లోకాలలోని జనుల మీద సమయం వచ్చినప్పుడు తన ప్రభావాన్ని చూపించే వాడు శని భగవానుడు.  ఏదోరకంగా ఈయనను ప్రసన్నుని చేసుకోవాలని ప్రతి ఒక్కరూ తపన పడతారు.  తైలాభిషేకాలు, దానాలు, జపాలు, ప్రదక్షిణలు ఇలా ఎన్నో చేస్తుంటారు.  ప్రజలను ఇంతగా ఆందోళనకు ( ఒక రకంగా భయానికి ) గురిచేసే శనికి ఉన్న ఆలయాలు మాత్రం చాలా తక్కువ.  ఉన్న వాటిల్లో కూడా సదా శివుడే లింగ రూపంలో మందేశ్వరునిగా అభిషేకాలు అందుకొంటారు.  మన రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శనీశ్వరాలయం తూర్పు గోదావరి జిల్లా మండవిల్లిలో ఉన్నది.  ఇది కోస్తా జిల్లాల వారికి సదుపాయంగా ఉంటుంది.  కాని రాయల సీమ వాసులు కడప, కర్నూల్, అనంత పురం వాసులు కర్నాటక రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శని క్షేత్రం అయిన " పావగడ " వెళుతుంటారు.  ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వెళ్ళే భక్తుల కొరకు స్థానికంగా ఒక శని భగవానుని ఆలయం నిర్మిస్తే బాగుంటుంది అన్న మంచి ఆలోచనతో ఒక భక్తుడు చేసిన పరిశోధన పలితమే శ్రీ మందగిరి శనీశ్వర స్వామి దేవస్థానము....

Narasimha Theertham, Tirupati

చిత్రం
           చరిత్ర ప్రసిద్ది కలిగిన శ్రీ గోవింద రాజ స్వామి విగ్రహం, తిరుపతి                       చిదంబర గోవిందుడు తిరుపతిలో   కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు. ఏడుకొండల మీద కొలువైన కొండల రాయని దర్శనార్ధం దేశ విదేశాల నుండి ప్రతి నిత్యం లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. తిరుమల కానీ, తిరుపతి కానీ నిత్యం భక్త బృందాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకొని కనిపిస్తుంటాయి.   కలియుగ వైకుంఠము తిరుమల. కొండ క్రింద  తిరుపతి.  పట్టణంలో చుట్టు పక్కలా ఎన్నో పౌరాణిక, చారిత్రిక ప్రసిద్ది చెందిన ఆలయాలు, నిర్మాణాలు, తీర్థాలు ఉన్నాయి.  సప్తగిరుల పైన శ్రీవారు కొలువు తీరి ఉండగా, పర్వత పాదాల వద్ద ఆయన సోదరుడు శ్రీ గోవింద రాజ స్వామి వెలసి ఉంటారు. శ్రీవారు స్థానక భంగిమలో దర్శనమిస్తారు. వారి సోదరులు శ్రీ గోవింద రాజులు తల క్రింద మానిక ఉంచుకొని శయనావస్థలో ఉంటారు.  దీనిని గురించి ఒక కధ ప్రచారంలో ఉన్నది.  శ్రీహరి తన కళ్యాణం కొరకు కుబేరుని వద్ద చేసిన అప్పు తీర్చడాని...

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

చిత్రం
శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి దేవాలయము, ఓంకారం  ఓంకార స్వరూపుడైన కైలాసనాధుడు కొలువు తీరిన అనేకానేక క్షేత్రాలలో ఓంకారం ఒకటి.యుగాల నాటి పౌరాణిక విశేషాలు , శతాబ్దాల చరిత్రకు, తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామా ఓంకారం. శ్రీ గంగా ఉమా సమేతముగా శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రం ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం. ప్రశాంతతకు మారు పేరు. మైమరపించే ప్రకృతి సౌందర్యం ఓంకారం సొంతం.  స్వచ్చమైన గాలి, పచ్చని పరిసరాలు, మొక్కిన వారిని దరి చేర్చుకొనే పరమేశ్వరుని సన్నిధితో సందర్శకులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచివేస్తుంది ఓంకారం,  "ఆర్తులు అందరికి అన్నం" అన్న అవధూత శ్రీ కాశి నాయన మాటను నిజం చేస్తున్న ఆయన భక్త బృందం ఏర్పాటు చేసిన ఆశ్రమం మరియు అన్న వితరణ కేంద్రం , ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారం ఓంకారం. పురాణ గాధ : క్షేత్రానికి సంబంధించిన పురాణ గాధ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆవిర్భాలతో ముడిపడి ఉన్నది. అందరికీ  తెలిసినదే! సృష్టి ఆరంభంలో సృష్టికర్త బ్రహ్మ దేవుడు, స్థితకారుడు శ్రీ మన్నారాయణుడు నేను గొప్పంటే నేను గ...

sri agastheeswara swamy temple, Mukkoti

చిత్రం
                   శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం, ముక్కోటి, తిరుపతి  సప్త మహా ఋషులలో శ్రీ అగష్య మహర్షి ప్రత్యేకత వేరు. సదా శివుని ఆజ్ఞ మేరకు కాశి నగరాన్ని వదిలి దక్షిణ భారత దేశానికి సతి, శిష్య ప్రశిష్య సమేతంగా తరలి వెళ్ళారు. మార్గంలో కాల గతిని నిర్ణయించే సూర్య చంద్రుల గతిని అడ్డుకొనే విధంగా పెరిగిన వింధ్య పర్వతాన్ని సాధారణ స్థితికి తెచ్చారు. దక్షిణ దేశంలో ప్రతి పుణ్య తీర్థ స్థలిని సందర్శించి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ కారణంగానే నేడున్న అనేక శివాలయాలలో పూజలం దుకొంటున్న లింగరాజును శ్రీ అగస్థీస్వర స్వామిగా పిలవబడుతున్నారు. తన దక్షిణ భారత దేశ పర్యటనలో విడిది చేసిన అనేక స్థలాలు నేడు పుణ్య క్షేత్రాలుగా ప్రసిద్ది పొందాయి. అలాంటి వాటిల్లో కేరళ తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులలో ఉన్న పోదిగై పర్వతాలు విశేష ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. విధాత ఆనతి మేరకు మహా ముని ఈ ప్రాంతంలోనే సంస్కృత, తమిళ భాషలను సృష్టించారని తెలుస్తోంది. అద్భుత ప్రకృతి సౌందర్యానికి, మనసులకు ప్రశాంతతను ప్రసాదించే ఆధ్యాత్మిక వాతావరణానికి ఈ పోదిగై పర్వతాలు ప్ర...