పోస్ట్‌లు

Sri Ganga Parvathee sametha Sri Agastheshwara Swamy Temple, Madiraju Guduru.

చిత్రం
శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్థేశ్వర స్వామి ఆలయం, మాదిరాజు గూడూరు   మనం పేరొందిన క్షేత్రాల లోని ఆలయాలకు ఎక్కువగా వెళుతుంటాము. కానీ మారు మూల చిన్న చిన్న ఊర్లలో కూడా ఎన్నోవిశేష ఆలయాలు మన దేశంలో కనపడుతుంటాయి. వెళ్లే దారిలో ఎన్ని ఆలయాలను చూస్తుంటాము కానీ పట్టించుకోము.  అలాంటి ఆలయాలలో ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగినవి, స్థానిక పాలకులు వివిధ సందర్భాలలో నిర్మించినవి, లేక గ్రామం లోని నిర్మలమైన భక్తి భావాలు కలిగిన భగవద్ససేవకులు నిర్మించినవి కావచ్చు. చక్కని నిర్మాణ విశేషాలు, పురాతన శాసనాలు లేదా ప్రత్యేక పూజలకు నిలయాలు ఆ ఆలయాలు కేంద్రం కావచ్చును. భగవంతుని కృప వలన అలాంటి కొన్ని ఆలయాలను దర్శించే అవకాశం నాకు లభించింది. ఈ మధ్యన నెల్లూరు పట్టణానికి వెళ్లిన సందర్భంలో కృష్ణ పట్టణం వైపుకు వెళ్లే పని పడినది. మధ్యలో వచ్చే "మాదిరాజు గూడూరు" అనే గ్రామంలో పురాతన శివాలయం ఒకటి ఉన్నట్లుగా తెలిసింది. దర్శించుకొందామని ఆగాము. ఏనాటిదో ఎవరు ప్రతిష్టించి నిర్మించారో తెలియరాలేదు. పేరు వలన అగస్త్య మహర్షి జరిపిన దక్షిణ దేశ యాత్ర సందర్బంగా ప్రతిష్టించిన అనేకానేక లింగాలలో ఒకటి...

Temples for remedies

చిత్రం
                                        అన్యధా శరణం నాస్థి   ఎప్పుడు ఏ కష్టం వచ్చినా "దేవుడా ! కాపాడు !" అని మొర పెట్టుకోవడం మానవులుగా పుట్టిన మనమందరం చేస్తుంటాము. నిత్య జీవితంలో లేదా గత జన్మలలో చేసిన అధర్మ కార్యాల వలన సంక్రమించిన కర్మల ఫలితంగా మానవులకు అనేకానేక ఇక్కట్లు జీవన క్రమంలో కలుగుతాయని పెద్దల చెప్పారు. ఆ కర్మ ఫలం నుండి బయటపడటానికి సత్ప్రవర్తన, ధార్మిక ప్రవృతి తో పాటు భగవదారాధన తప్పనిసరి. కాకపోతే ఏ ప్రారబ్ధం నుండి విముక్తి పొందాలంటే ఏ  ఆలయాన్ని సందర్శించాలి అన్నది ఒక సమస్య. దీనికి పరిష్కారంగా  తమిళనాడులో పరిహార ఆలయాల సంప్రదాయం నెలకొల్పబడినది. మానవ జీవితాలలో ఎదుర్కొనే వివిధ సమస్యల నుండి బయటపడటానికి ఏ ఆలయాన్ని దర్శించాలి అన్నది మహాత్ములు ఏ నాడో నిర్ణయించారు. ఆ వివరాలను వీలైనంత వివరంగా అందరికీ అందించే ప్రయత్నమే ఈ వ్యాసం. ఈ ఆలయాలన్నింటికీ చెన్నై నుండి బస్సు లేదా రైలు మార్గంలో సులభంగా చేరుకోవచ్చును. మనిషి జీవితంలో అభివృద్ధి సాధించడానికి,...

Varanasi

చిత్రం
                                              వారణాశి   వారణాశి క్షేత్రం , కాశీ విశ్వనాధ సందర్శనం , గంగా స్నానం తలంపు లోనికి రాగానే ప్రతి ఒక్క హిందువు హృదయంలో అనిర్వచనీయమైన  ఆధ్యాత్మిక అనుభూతులు నెలకొంటాయి.  ఈ క్షేత్ర మహాత్యమది.  సాక్షాత్ కైలాసవాసుడే స్థాపించిన పురమని పురాణాలలో పేర్కొన్న కాశి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. వరుణ మరియు అసి నదుల మధ్య నెలకొన్న ప్రదేశం కనుక వారణాశి గా పిలవబడుతోంది.  సర్వేశ్వరునితో పాటు సమస్త దేవతలు కొలువు తీరి ఉండే వారణాశిని త్రేతాయుగంలో శ్రీ రామ చంద్ర మూర్తి, ద్వాపరంలో శ్రీ కృష్ణుడు, తల్లి కుంతీ దేవితో కలిసి పంచ పాండవులు, కలియుగంలో శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు, శ్రీ రామ కృష్ణ పరమహంస, శ్రీ వివేకానందులు ఆదిగా గల మహనీయులు సందర్శించి సేవిన్చుకోన్నారని అందుబాటులో ఉన్న రచనలు తెలుపుతున్నాయి.      గంగాధరుని జటాజూటాల నుండి జాలువారిన గంగా నదీ తీరా...