పోస్ట్‌లు

Sri Lakshmi Varaha Swamy Temple,Tiruvananthapuram

చిత్రం
     శ్రీ లక్ష్మీ వరాహ స్వామి ఆలయం,  తిరువనంతపురం                       మనం ఎన్నో ప్రదేశాలలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలను సందర్శించుకొని ఉంటాము. కానీ శ్రీ మహా విష్ణువు ధరించిన దశావతారాలలో మూడవది అయిన శ్రీ వరహావతర ఆలయాన్ని ఎక్కడా చూసి ఉండము. మన రాష్ట్రం లోని సింహాచలంలో ఉన్నది శ్రీ వరాహ లక్ష్మి నారసింహ స్వామి. తిరుమల కొండల పైన ఉన్నది ఒక వరాహ స్వామి ఆలయం.  అక్కడ ఆయనే క్షేత్ర పాలకుడు. కానీ తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలో కొన్ని శ్రీ వరాహ స్వామి ఆలయాలు ఉన్నాయి. అలాంటి అరుదైన క్షేత్రాలలో కేరళ రాజధాని తిరువనంతపురం లో ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెలుపల  నైరుతిలో ఉన్న శ్రీ లక్ష్మి వరాహ స్వామి ఆలయం. స్వామి వెలసినందున ఈ ప్రాంతాన్ని "శ్రీ వరాహం " అని పిలుస్తారు. కేరళలో ఉన్న మూడు శ్రీ వరాహ స్వామి ఆలయాలలో ఇదే అత్యంత పురాతనమైనదిగా పేర్కొంటారు. మిగిలినవి అలికాల్ శ్రీ వరాహ దేవస్వం, చెరాయి, కొచ్చి మరియు శ్రీ వరాహ మూర్తి ఆలయం, వరపుళ , ఎర్నాకుళం దగ్గర.  అసలు భారతదేశం మొత్తం మీద ఇరవై...

Sri Chenna Kesava Swamy Temple, Ongole

చిత్రం
                          శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయం, ఒంగోలు  ఒకప్పుడు గుంటూరు జిల్లాలో భాగం నేటి ప్రకాశం జిల్లా.  1970వ సంవత్సరంలో నెల్లూరు, కర్నూలు జిల్లాల నుండి కొన్ని ప్రాంతాలను కలిపి ఆంధ్ర కేసరి గా పేరొందిన కీర్తిశేషులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరుమీద ఈ జిల్లా ఏర్పాటు చేయబడినది.  శ్రీ ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రధమ ముఖ్య మంత్రి.  ఈ ప్రాంతం మౌర్యులు, శాత వాహనులు, చాళుక్యులు, పల్లవులు మరియు విజయనగర రాజుల పాలనలో ఉంది చరిత్రలో సుస్థిర స్థానం సముపార్జించుకొన్నది.  ప్రకాశం జిల్లా ప్రత్యేకత ఏమిటంటే కోస్తాకు, రాయల సీమకు ప్రవేశ ద్వారం.  మూడు జిల్లాల తాలుకాలు కలిసినందున అన్ని ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలు ఇక్కడ కనపడతాయి.  ప్రకాశం జిల్లాలో ఎన్నో ప్రసిద్ద ఆలయాలు కలవు.  వాటిల్లో ఒకటి ఒంగోలు నగరం కేశవ స్వామి పేటలో  ఉన్న శ్రీ ప్రసన్న కేశవ స్వామి మరియు శ్రీ కాశి విశ్వ నాద ఆలయాల సముదాయం.  ఈ రెండు ఆలయాలు ఈ ప్రాంతాన్ని పాలించిన ఆఖరి పాలకులు...