పోస్ట్‌లు

Ganapavaram Temples

చిత్రం
                            సూర్యుడు కొలిచే సువర్ణేశ్వరుడు   ఆలయ దర్శనం అనగానే అందరి దృష్టి తమిళనాడు లేదా కేరళ వైపుకు మళ్లుతుంది. కానీ తెలియనిదల్లా మన రాష్ట్రంలో కూడా అనేకానేక పురాతన చారిత్రక ఆలయాలు నెలకొని ఉన్నాయి అని.  మన రాష్ట్రాన్ని క్రీస్తు పూర్వం నుండి ఎన్నో రాజ వంశాలు పాలించాయి. అందరూ మన సంస్కృతి సంప్రాదాయాల, భాష మరియు ఆరాధనా విధానాల అభివృద్ధికి విశేష కృషిచేశారని లభించిన శాసనాల ఆధారంగా అవగతమౌతుంది. రాయలసీమ జిల్లాల తరువాత ఉభయ గోదావరి జిల్లాలు వీటికి ప్రసిద్ధి. కాకపోతే దురదృష్టవశాత్తు తగినంత ప్రచారం లేకపోవడం లేదా కొన్ని చిన్నచిన్ని గ్రామాలలో, మారుమూల ప్రాంతాలలో ఉండటం వలన వీటికి రావలసిన గుర్తింపు, దక్కవలసిన గౌరవం దక్కలేదని భావించవలసి వస్తుంది.   ఆంధ్రప్రదేశ్ జీవనాడి జీవనది అయిన గోదావరి. నిరంతరం గలగలా ప్రవహించే ఈ నదీ తీరాలు  పచ్చని పంట పొలాలకు , సుందర ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. సంవత్సరమంతా నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉండే ఈ ప్రాంతాలలో ఎన్నో గొప్ప క్షేత్రాలు నెలకొని ఉన్నాయి. అలా...

World Elephant Day

చిత్రం
                            ప్రపంచ ఏనుగుల దినోత్సవం                                                                                                                                                           మానవులుగా జన్మించిన మనందరికీ ఒక జన్మ దినోత్సవం ఉంటుంది. ప్రతి సంవత్సరం తాహతుకు తగ్గట్టుగా జరుపుకొంటాము. పుడమి మీద జన్మించిన ప్రతి జీవి ఏదో ఒక రకంగా సంఘానికి ఉపయుక్తంగా ఉంటారు. అది మంచి కానీ చేడు  కానీ ! మనతో పాటు అనేక జీవులు భూమి మీద బ్రతుకుతున్నాయి. వాటి మూలంగా ప్రకృతికి జరిగే మేలు ఎంతో ! మరి అలాంటి పరోపకారులను, అవి చేస్త...

Saptha Karai kanda sthalams

                  కుమారుడు ప్రతిష్టించిన కైలాసనాధుడు     భరత ఖండం అనాదిగా దైవభూమి. ప్రతి పల్లె, పట్టణం, నగరం, అరణ్యం, పర్వతాలు ఇలా అన్నీ కనీసం ఒక హిందూ దైవం యొక్క ఆలయాన్ని కలిగి ఉండటం ప్రస్తావించవలసిన విషయం. ఇవన్నీ కూడా ఏదో ఒక విశేష కారణం వలన ఏర్పడినవి అన్న సంగతి ఆయా క్షేత్రాల పురాణ గాధలను పరిశీలించినప్పుడు అవగతమౌతుంది. విచారించవలసిన అంశం ఏమిటంటే వీటిల్లో చాలా క్షేత్రాలు కాలగతిలో మరుగున పడిపోయి స్థానికంగా ఒక సాధారణ ఆలయంగా పరిగణింపబడటం. కాకపోతే సంతోషించదగ్గ విషయం మాత్రం అన్ని ఆలయాలలో నిత్య దీపధూప నైవేద్యాలు జరగడం. ఈ ఆలయాలలో శ్రీ మహావిష్ణు, శ్రీ కైలాసనాధ, శ్రీ వినాయక, శ్రీ షణ్ముఖ మరియు దేవీ ఆలయాలు ఎక్కువగా కనపడతాయి. అలానే వీటిల్లో కొన్ని ఒకే దేవతామూర్తి కొలువైన గొలుసు కట్టు ఆలయాలు కూడా కనపడతాయి.                                                      వీటిల్లో అధిక శాతం నిరాకారుడైన నటరాజ స్వామి కొల...

Lord Ganesha

చిత్రం
                                      విఘ్ననాయక వినాయక  

Elephant race at Guruvayur

   ఆహ్లాదం  మరియు  ఆధ్యాత్మికతల కలయిక అనేయోట్టం                                                                                                భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలోని ఆలయాలలో ఏనుగు ఉండటం ఒక తప్పనిసరి ఆనవాయితీ. అన్ని ప్రముఖ దేవాలయాలు నియమంగా  గజ సేవ నిర్వహించడం కూడా ఒక సంప్రదాయంగా నెలకొని ఉన్నది. ప్రత్యేకంగా తయారు చేసిన ఆభరణాలు ధరించి,పుష్పాలతో తీర్చిదిద్దిన   అంబారీతో సుందరంగా అలంకరించిన ఏనుగు మీద నయనమనోహరంగా ముస్తాబు చేసిన ఉత్సవ మూర్తులను ఉపస్థితులను చేసి మాడ  లేదా నగరవీధులలో ఊరేగించడం అనాదిగా వస్తున్న ఒక సేవ లేదా సాంప్రదాయం.  గజాలు చాలా తెలివిగలిగిన జంతువులు. సూక్ష్మ గ్రాహులు. నేర్పించే వాటిని సులభంగా గ్రహించగలవు. వాటి పెద్ద శరీరం, తల, చెవులు, దంతాలు, తొండం మ...

Sri Jagannatha Mandir, Koraput

                                          శబర శ్రీ క్షేత్రం   శ్రీ జగన్నాథ స్వామి ఒరియా ప్రజలకు ప్రధమ ఆరాధ్య దైవం. సుందర సాగర తీరాన యుగాల క్రిందట అగ్రజుడైన శ్రీ బలదేవునితో మరియు సోదరి అయిన శ్రీ సుభద్ర దేవితో కలిసి  కొలువైన శ్రీ జగన్నాధుని స్మరణం, వీక్షణం ఇహపర సుఖాలను ప్రసాదించేదిగా విశ్వసిస్తారు ఒడిసా వాసులు. హిందువులకు ముఖ్యమైన దర్శనీయ నాలుగు క్షేతాలలో ఒకటి అయిన పూరి శ్రీ జగన్నాథుని స్వగృహం.  దేశంలో పేరొందిన ఆలయాలతో పోలిస్తే పూరి క్షేత్రంలో జరిగే పూజలు, అలంకరణలు, యాత్రలు మరియు ఆరగింపులు చాలా ప్రత్యేకంగా ఉండటం పేర్కొనవలసిన అంశం. కాలక్రమంలో తొలుత ఏర్పడిన పూరి ఆలయ తరహాలో అనేక ప్రాంతాలలో అదే శైలిలో ఆలయాలను స్థానిక భక్తులు నిర్మించుకున్నారు. ఒక్క ఒడిసా రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాలలో, దేశాలలో ఏర్పడినాయి. శ్రీ జగన్నాథ తత్త్వం విశ్వవ్యాప్తం అయ్యింది. ఇలా ఇతర ప్రాంతాలలో శ్రీ జగన్నాథ మందిరాలు ఏర్పడటానికి మూలం తొలుత శ్రీ జగన్నాథుని ఆరాధించిన శబరులే కావడం విశే...

Nava Kailasam's Thirunelveli

                          నవగ్రహ క్షేత్రాలు - నవ కైలాసాలు                                                                                                          కైలాసనాధుడు ఇలలో పెక్కు క్షేత్రాలలో స్వయంభూలింగ రూపంలో కొలువై ఉన్నారు. ఆ ఆలయాలన్నీ భక్తులకు భువిలో కైలాస సమానంగాను,దర్శనీయ క్షేత్రాలుగా ప్రసిద్దమయ్యాయి.  కానీ ఆలయాల రాష్ట్రం తమిళనాడు లోని దక్షిణ భాగాన ఉన్న తిరునెల్వేలి మరియు తూత్తుకుడి జిల్లాలను సస్యశ్యామలం చేసే నది తమిరపారాణి. ఆ నదీతీరంలో ఉన్న నవ కైలాస క్షేత్రాలు మిగిలిన వాటికి భిన్నమైనవి.   పురాణ గాధలలో పేర్కొన్న ప్రకారం నవ కైలాసాలు ముక్తి ప్రసాదాలు.  శివ పార్వతుల కళ్యాణం వీక్షించడానికి ముల్లోకాల...