nandaluru
కడపకు నలభై ఐదు కిలమీటర్ల దూరంలో, రాజంపేటకు సమీపంలో, కలియుగ వైకుంఠము తిరుమలకు వెళ్ళే దారిలో వస్తుంది నందలూరు. గతంలో చోళ రాజుల పాలనలో ఉన్న ఈ ప్రాంతం ఎంతో చరిత్ర ప్రసిద్దికాంచిన ఆలయాలకు ప్రసిద్ది. అలాంటి వాటిల్లో ఇక్కడి శ్రీ సౌమ్య నాధ స్వామి ఆలయం ఒకటి. సుమారు ఎనిమిదవ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించినదీ ఆలయం. అద్భుత నిర్మాణ శైలికి, ఎంతో అరుదైన విషయాలను తెలిపే శాసనాలకు చిరునామా ఈ ఆలయం. నందలూరు హరిహర క్షేత్రం. శ్రీ ఉల్లంకేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉన్నది. ఇక్కడి ప్రత్యేకత శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ ముద్రలో అతి రమణీయంగా దర్శనమిస్తారు .