పోస్ట్‌లు

జులై, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

sri Ganga Bhramarambha sameta Sri Mallikharjunaswami Temple , Morjampadu

చిత్రం
                               దక్షిణ శ్రీ శైలం మోర్జంపాడు  మనం కొద్దిగా శ్రద్ధ పెట్టి వెతికితే మన రాష్ట్రంలో ఎన్నో విశేషాలకు నిలయమైన దేవాలయాలు చాలా కనపడతాయి. ప్రతి ఆలయ నిర్మాణం వెనుక ఒక గాథ లేక ఒక విశేషం నెలకొని ఉంటుంది.  కాకపోతే వీటిలో చాలామటుకు మారుమూల పల్లెలలో లేదా గ్రామాలలో ఉండటం వలన క్షేత్ర వివరాలు బాహ్యప్రపంచానికి తెలియడం లేదు. స్థానికంగా కూడా వాటిని ఒక ఆలయంగా  మాత్రమే పరిగణించడం విచారకరం.  ఈ మధ్య నేను దర్శిస్తున్న ఆలయాలలో మూడు గంగతో ఉన్న గంగాధరుని క్షేత్రాలే ! మొదటిది కర్నూల్ దగ్గర ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. రెండవది తాడిపత్రిలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. మూడవది ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి ఆలయం. మోర్జంపాడు.   ఈ మూడు ఆలయాలలో నీటి బుగ్గలు ఉండటం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. పరమశివుడు అభిషేక ప్రియుడు కదా ! మారుమూల పల్లె మోర్జంపాడు శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం మరింత ప్రత్యేకమ...

Guttikonda Bilam

చిత్రం
                  గోపాలుడు నడయాడిన గుత్తి కొండ బిలం  మన రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన గుహలు లేదా బిలాలలో ప్రథమస్థానంలో ఉన్నవి బొర్రా గుహలు. తరువాత ఆ స్థాయిలో కాకున్నా స్థానిక ఆకర్షణ పొందుతున్నవి నంద్యాల జిల్లాలోని బెలుం గుహలు.  వీటికి భిన్నంగా ఉండే గుహలు కూడా ఉన్నాయి.  అవే పల్నాడు జిల్లాలోని గుత్తికొండ గ్రామ సమీపంలోని గుహలు.  క్షేత్ర గాథ ప్రకారం గుత్తికొండ బిలం పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ప్రదేశం.  అనేక మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు.  గత శతాబ్దంలో ఎందరో మహనీయులు ఇక్కడ ఆధ్యాత్మిక సాధన చేసి ముక్తిని పొందారని అనేక గాధలు ప్రచారంలో ఉన్నాయి.  క్షేత్ర గాథ  పురాణాలలో చూసినట్లయితే మహర్షుల తపోభూములు ఎక్కువగా నదీతీరాలలో అంటే నీటి వసతి ఉన్న కొండ గుహలలో, దట్టమైన వనాలలో ఉన్నట్లుగా తెలుస్తుంది. జలం జీవం కదా ! వివిధ ప్రాంతాలలో కనిపించే  ఆలయాలు వారు తమ నిత్య పూజల నిమిత్తం ఏర్పాటుచేసుకొన్నవి అని కూడా అర్ధం చేసుకోవచ్చును.  తొలి గుహాలయాలు పల్లవుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది.  గుత్...

Veerula Gudi, Karampudi

చిత్రం
                                                       చరిత్రకు సాక్షి వీరుల గుడి  మన దేశంలో ఎన్నో విభిన్న శైలులలో నిర్మించిన ఆలయాలు కనపడతాయి. ఎన్నో రూపాలలో ఉన్న దేవదేవుడు కొలువై పూజలందుకొంటున్నారు. శ్రీ వినాయకుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ మన్నారాయణుడు తన దశావతార రూపాలైన శ్రీ నారసింహ, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, శ్రీ రంగ నాయకుడుగా , శ్రీ పరమేశ్వరుడు పంచ భూత లింగాలుగా, పంచ ఆరామ క్షేత్ర పాలకునిగా మరెన్నో క్షేత్ర నాధునిగా, అమ్మలగన్న అమ్మ శ్రీ ఆది శక్తి గా దర్శనమిస్తారు. మన దేశంలో  వైష్ణవం, శైవం మరియు శాక్తేయం లాంటి అనేక ఉపాసనా పద్దతులను అనుసరించడం కూడా కనపడుతుంది.  నిరాకారుడైన పరమాత్మకు రకరకాల రూపాలలో ప్రతిష్టించిన  తరువాత భక్తులు తమకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం వహించిన గురువులు, అవధూతల మందిరాలను కూడా నిర్మించి ఆరాధిస్తున్నారు.  మరో విశేషం ఏమిటంటే మన పురాణాల ప్రకారం ప్రతినాయకులాగా చిత్రీకరించబడిన రావణాసురుడు, సుయోధనుడు, కర్...