పోస్ట్‌లు

2025లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Swayamvyaktha Parvati sameta sri moksha amaralingeswara swami temple, Edara(Eluru dist)

చిత్రం
     భక్తులకు అపురూపం శ్రీ మోక్ష అమరలింగేశ్వర స్వామి  నిరంతరం ఆలయ సందర్శన వ్యాపకంలో ఉండే నాకు వివిధ ప్రాంతాలలోని దేవాలయాలను సందర్శించినప్పుడు అనేక గొప్ప గొప్ప అనుభవాలు ఎదురైనాయి.  కర్నూలు పట్టణానికి సమీపంలోని వామసముద్రం, కృష్ణా జిల్లా పెడన మండలంలోని చెన్నూరు, విజయవాడ నగరంలోని మొగల్రాజ పురం కొండ పైన ఉన్న శైవ క్షేత్రం మచ్చుకు కొన్ని! అలంటి అనుభవమే ఈ మధ్య నూజువీడు వెళుతున్నప్పుడు ఎదురైనది. ఆఫీస్ పని మీద వరసగా రెండు రోజులు నూజువీడు వెళ్ళవలసి వచ్చింది.  మొదటి రోజు ఆగిరిపల్లి గ్రామంలో ఉన్న విశేష శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి వారిని దర్శించుకొని వెళ్ళాను. తిరిగి విజయవాడ వెళ్ళేటప్పుడు నెక్కలం అడ్డరోడ్డు దగ్గర శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నూతన సుందర ఆలయం, గతంలో రోడ్డు మీదకు ఉండిన శ్రీ ఆంజనేయస్వామికి నిర్మించిన నూతన ఆలయాన్ని చూస్తున్న క్రమంలో అక్కడ పెట్టిన బోర్డు దృష్టిని ఆకర్షించింది.  స్వయంవ్యక్త శ్రీ పార్వతీ సమేత శ్రీ మోక్ష అమరలింగేశ్వర స్వామి వారి ఆలయం, ఈదర గ్రామం ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్లు అని రాసి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లోని గ్...

Sri Muktheshwara Swamy Temple, Morthota

చిత్రం
                                         మోక్షాన్ని ప్రసాదించే ముక్తేశ్వరుడు  పావన కృష్ణవేణి తీరాలు ఎన్నో పవిత్ర పుణ్య తీర్ధ క్షేత్రాలకు నిలయాలు. ముఖ్యంగా మన రాష్ట్రంలో యుగాల నుండి నెలకొనివున్న పరంధాముని దివ్య ధామాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి.  సర్వాంతర్యామి స్వయంవ్యక్థగా, మహర్షుల పూజల నిమిత్తం ప్రతిష్టించుకొన్న అర్చారూపాలు, మహారాజులు క్షేత్ర ప్రాధాన్యతలను తెలుసుకొని నిర్మించిన ఆలయాలు ఇలా వివిధ రకాల క్షేత్రాలు మనకి కనిపిస్తాయి. ఈ తీర్ధ క్షేత్రాలతో ముడిపడి క్షేత్ర గాధలు కూడా యుగాల నాటివి కావడం, అవి వివిధ పురాణాలలో ప్రస్తావించబడి ఉండటం విశేషం.  అలాంటి ఒక విశేష ఆలయం రేపల్లె పట్టణానికి సమీపంలో నెలకొని ఉన్నది.  పరమేశ్వరుడు మానవరూపంలో అవతరించి దుష్ట శిక్షణ చేసి శ్రీ ముక్తేశ్వరునిగా కొలువు తీరిన దివ్య ధామం కృష్ణా నదీతీరంలో ఉన్న మోర్తోట గ్రామంలో నెలకొని ఉన్నది.  స్వామి ఇక్కడ కొలువు తీరడం వెనుక ఉన్న గాధ ఏమిటో తెలుసుకొందాము.  దానికన్నా ముందు ఈ విషయం కూడా మనంతెలుసు...

Sri Agastheeshwara swami Temple, Kaza, Guntur district

చిత్రం
                         కమనీయ కోవెలల క్షేత్రం - కాజ  మన గ్రామాలు చక్కని ఆప్యాయతలకు, పచ్చని పొలాలకు, స్వచ్ఛమైన గాలికి మాత్రమే కాదు కమనీయ కోవెలలకు కూడా కేంద్రాలు.  తరచి చూస్తే మన రాష్ట్రం లోని ప్రతి గ్రామాన రెండు ఆలయాలు తప్పకకుండా కనపడతాయి. కనీసం శ్రీ రామభజన మందిరం లేక శ్రీ కృష్ణ గీతామందిరం అన్నా ఉంటాయి. కొన్ని చోట్ల గ్రామ దేవతల ఆలయాలు కూడా కనిపిస్తాయి.   గ్రామగ్రామాన విగ్రహ లేదా లింగ ప్రతిష్టాపన, ఆలయాల నిర్మాణం, నిర్వహణ ఈ నాటివి కావు. ఎన్నో శతాబ్దాలుగా వారసత్వంగా మరియు అనువంశికంగా వస్తోంది. ఆలయ నిర్వహణ బాధ్యత గ్రామస్థులందరిది. సమిష్టిగా ఆలయాభివృద్దికి, ఆలయ ఉత్సవాలకు గ్రామ ప్రజలందరూ ముందడుగు వేస్తారు.  ఈ కారణంగానే వందల సంవత్సరాల నిర్మించిన ఆలయాలు చాలా గ్రామాలలో నేటికీ నిత్య పూజలతో శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి.  రెండు వేల సంవత్సరాల క్రిందట ప్రతిష్ఠి జరిగింది. తరాలు మారినా తరగని భక్తి విశ్వాసాలతో గ్రామస్థులు దేదీప్యమానంగా దేవాలయ అభివృద్ధికి పాటుపడుతున్న గ్రామం కాజ.   గుంటూరు నుండి విజయ...