Navagraha Mandapam
నవగ్రహ మండపం ప్రతి శివాలయంలో ఈశాన్యంలో కనపడుతుంది నవగ్రహ మండపం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితాలను ప్రభావితం చేసే నవగ్రహాలైన సూర్య, చంద్ర, అంగారక, బుధ, గురు, శుక్ర, శని, రాహువు మరియు కేతువులు కొలువై ఉండే స్థలం. పుట్టిన దగ్గర నుండి మరణించే దాకా మానవ జీవితాలో సంభవించే ఉద్దానపతనాలకు ఈ గ్రహాలే కారణం అంటుంది జ్యోతిష్యశాస్త్రం. ఆ ఎత్తుపల్లాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది మన జాతక చక్రంలో గ్రహాలు ఉన్న స్థానాల ఆధారంగా ఒక అంచనాకు వస్తారు జ్యోతిష్కులు. ఏయే గ్రహాలు అననుకూలం...