పోస్ట్‌లు

మే, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

Gundicha Mandir, Puri

                      మూర్తి లేని మందిరం --- గుండీచా బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం మరియు పూరీ మన భారత దేశానికి నాలుగు దిశలలో నెలకొని ఉన్న దివ్య ధామాలు. ఈ నాలుగు క్షేత్రాల సందర్శనాన్ని " చార్ ధాం " యాత్ర అంటారు. స్వయం పరమాత్మ నడయాడిన ఈ పవిత్ర స్థలాలు యుగాల క్రిందటి పురాణ గాధలతో ముడిపడి ఉన్నాయి. హిందువులు జీవితంలో ఒకసారి అయినా ఈ క్షేత్రాలను సందర్శించాలని అభిలషిస్తారు. ఈ నాలుగు క్షేత్రాల ప్రాధాన్యత, ప్రత్యేకతలను విడివిడిగానే చూడాలి.  అన్నింటి లోనికి పూరీ క్షేత్రం పూర్తిగా భిన్నమైనది. శ్రీ జగన్నాథ సంస్కృతి సంప్రదాయాలకు కేంద్ర బిందువు అయిన పూరీ క్షేత్రం ఎన్నో విశేషాల సమాహారం. ఋగ్వేదంలో శ్రీ జగన్నాథ క్షేత్ర ప్రస్థానం వివరంగ ఉన్నది. బ్రహ్మ పురాణం, పద్మ పురాణం కూడా నీలాచల క్షేత్ర ప్రాధాన్యత ను తెలుపుతున్నాయి.  సుందర సాగర తీరంలో ఉన్న ఈ క్షేత్రం లోని ఆలయం, మూలవిరాట్టుల రూపాలు, వారికి చేసే పూజలు, అలంకరణ, సేవలు, నివేదనలు, యాత్రలు అన్నీ ప్రత్యేకమైనవే! మరెక్కడా కనపడనవే!  అగ్రజుడు శ్రీ బలరాముడు, చెల్లెలు శ్రీ సుభద్రలతో శ్రీ మహావిష్ణ...

Sri Narasimha

చిత్రం
                    శ్రీ ఉగ్ర నారసింహ ఆలయం. మద్దూరు  భారతావనిలో అనేక శ్రీ మహావిష్ణు అవతారాల ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో అధికశాతం శ్రీ రామచంద్ర మూర్తివి కాగా రెండో స్థానంలో శ్రీ కృష్ణ ఆలయాలు కనపడతాయి. తరవాత స్థానాలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ శేషశయన అనంత పద్మనాభుడు, శ్రీ రంగనాధుడు క్షేత్రాలలో కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు.  కానీ ఖచ్చితంగా మూడో స్థానం మాత్రం శ్రీమన్నారాయణుని నాలుగో అవతారమైన శ్రీ నారసింహ స్వామి వారి ఆలయాలదే ! నారసింహుడు అపమృత్యు భయాన్ని తొలగించేవానిగా ప్రసిద్ధి. అభయ ప్రదాత, భూతప్రేత పిశాచ పీడల నుండి కాపాడే వానిగా, అధైర్యాన్ని అణచివేసి ధైర్యాన్ని అందించే వానిగా స్వామి రూపాన్ని ప్రార్ధిస్తారు భక్తులు. దక్షిణాదిన నృసింహ ఉపాసన, ఆరాధన అధికంగా చెప్పవచ్చును.  అతి తెలివితో అసాధ్యం అని తలచిన కోరికలను పొంది ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్న దానవుడైన హిరణ్య కశ్యపుని బారి నుండి సమస్త సృష్టిని సంరక్షించడానికి సగం మానవ సగం మృగరాజ రూపంలో అవతరించారు శ్రీ హరి. తన భక్తుడైన ప్రహ్లాదుని మాటలను ఋజువు చేస్తూ సాయంసం...

Adhi Tiruvarangam Temple

చిత్రం
                శ్రీ రంగ నాథుడు కొలువైన    ఆది తిరువరంగం   పవిత్ర పాలరు (దక్షిణ పెన్న) నదీ తీరం ఎన్నో విశేష ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధి కెక్కినది. నదికి ఉత్తరం మరియు దక్షిణ తీరాలలో శివ, విష్ణు, దేవి, గణేష మరియు సుబ్రమణ్య ఆలయాలు చాలా నెలకొని ఉన్నాయి. అన్నీ కూడా పది శతాబ్దాలకు పూర్వం నిర్మించబడినవి కావడం అన్నిటి పురాణ గాధలు కూడా అనేక పురాతన గ్రంధాలలో పేర్కొని ఉండటం ఇంకా చెప్పుకోదగిన విషయం.  అలాంటి అనేకానేక ఆలయాల్లో తమిళనాడు  కాళ్లకురిచ్చి జిల్లాలో శ్రీ రంగనాధ స్వామి కొలువైన ఆది తిరువరంగం ఒకటి. కృతయుగం నాటి సంఘటనలతో ముడిపడి ఉన్న ఈ ఆలయం శ్రీ వైష్ణవ దివ్యదేశాల జాబితాలో లేకున్నా కావేరి నది తీరంలో కొలువైన శ్రీ రంగం కన్నా ముందు నుండి ఉన్నది అని అంటారు.  చిత్రమైన విషయం ఏమిటంటే పాశుర గానాలు చేసి మొత్తం నూట ఎనిమిది దివ్య తిరుపతులను వెలుగు లోనికి తెచ్చిన పన్నిద్దరు ఆళ్వారులలో తిరుమంగై  ఆళ్వారు ఇక్కడ శ్రీ వైకుంఠ వాసుని దర్శనం పొందినట్లుగా తెలుస్తోంది. ఆయన తన పాశురాలలో ఆది తిరువరంగం గురించి ప్రస్థాపించినట్లుగా తెలుస్తోంది....

Mahabalipuram Temples

              శ్రీ స్థల శయన పెరుమాళ్ క్షేత్రం , మహాబలిపురం   మహాబలిపురం ఒక ప్రత్యేక చరిత్ర కలిగిన సముద్ర తీర నగరం. క్రీస్తుపూర్వం నాలుగు అయిదు శతాబ్దాల కాలంలోనే అనేక విదేశాలతో వ్యాపార లావాదేవీలు జరిగేవని ఇక్కడ లభించిన ఆ కాలం నాటి నాణాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.  పల్లవ రాజుల కాలంలో పంచపాండవ రథాలు(ఏక శిల్ప నిర్మాణాలు), సముద్ర తీర ఆలయాలు, శ్రీ స్థల శయన పెరుమాళ్ ఆలయం, శ్రీ భూవరాహ స్వామి ఆలయం ఇలా చాలా ఉన్నాయి. పల్లవులు గుహాలయాలకు ఆద్యులుగా నిలుస్తారు. వారు నిర్మించిన అనేక గుహాలయాలలో సమీపంలోని సాలువకుప్పం లో ఉన్న టైగర్ కేవ్ ఒకటి.  పాశ్చాత్య యాత్రికుడు, వ్యాపారి అయిన "మార్కో పోలో" మహాబలిపురాన్ని ల్యాండ్ అఫ్ సెవెన్ పగోడాస్ " అని వర్ణించాడు తన యాత్రా విశేషాల గ్రంధంలో. ప్రస్తుతం వాటిల్లో చాల వరకు సముద్రంలో మునిగి పోయాయి.  ప్రస్తుతం మహాబలిపురంలోని నిర్మాణాలు మొత్తం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి.  మహాబలిపురం లేదా మామల్ల పురం    ఈ పేర్ల వెనుక రెండు గాధలు వినపడతాయి. హిరణ్య కశ్యపుని కుమారుడైన బలిచక్రవర్తి పాలించి...
            శ్రీ రంగనాథ స్వామి ఆలయం, తిరునీరుమలై                 ప్రాచీన గ్రంథాలు, పురాణాలు, క్షేత్ర గాథల ఆధారంగా పరిపూర్ణ  విశ్వాసముతో తనను ధ్యానించే నిజ భక్తుల మనోభీష్టాలను నెరవేర్చడానికి శ్రీ హరి వివిధ రూపాలలో పుడమి లో  అవతరించారు. అన్ని పరమాత్మ పాదస్పర్శ సోకిన ప్రదేశాలే!  భక్తులు నమ్మిన రూపంలో దర్శనము అనుగ్రహించడం వలన స్వామివారిని నేడు మనం శయన, స్ధానక, ఉపస్థిత  రూపాలలో చూడగలుగుతున్నాము. రకరకాల నామధేయాలతో స్మరించుకో కలుగు తున్నాము.  ఇలాంటివి ప్రపంచంలో కొన్ని వేల ఆలయాలు ఉన్నాయి. ఆళ్వార్ల లాంటి గాయక భక్తులు తమ గానంతో వీటిని  మరింత వ్యాప్తి లోనికి తెచ్చారు.  అసలు దేవాలయం అంటేనే దైవము కొలువైన ప్రదేశం. అలాంటి ప్రదేశాన్ని సందర్శించిన సందర్భంలో   మనస్సు సర్వాంతర్యామి తో లయం చెంది బీజాక్షరాలతో నిండిన కవిత్వం వెలువడుతుంది.  అదే సత్యంగా నిలుస్తుంది. ఆ నిలిచిన సత్యమే దివ్య దేశాలు.  ప్రతి యొక్క దివ్య దేశం తన వైన ప్రత్యేకతలను కలిగి ఉంటుంది.  నేటి చెన్నై పట్టణం లోన...
                    అప్ప కుడుత్తాన్ పెరుమాళ్ ఆలయం, కొయిలాడి బ్రహ్మండ పురాణంలో ఆది రంగంగా ప్రస్ధాపించబడిన దివ్య దేశం తిరుప్పర్ నగర్. స్ధానిక వ్వవహరిక నామం కొయిలాడి.  శ్రీ రంగంలో కన్నా ముందుగానే వైకుంఠ వాసుడు ఇక్కడ కొలువు తీరారన్న పురాణ గాథ ఆధారంగా ఆది రంగం అన్న పేరు వచ్చింది.  పెరియ పెరుమాళ్ శ్రీ రంగ నాథుడు కొలువైన శ్రీ రంగంతో ఆరంభమైన శ్రీ వైష్ణవ దివ్య దేశాల వరుసలో ఆరో స్థానంలో ఉన్నది తిరుప్పర్ నగర్.  కావేరి నది తీరప్రాంతం. పచ్చదనానికి ప్రసిద్ధి. తమిళ నాడు అన్నపూర్ణ గా పేరొందిన ప్రాంతం ఇది.  మార్గానికి ఇరుప్రక్కల రెండు పాయలుగా చీలి కావేరి, కొల్లిడాం గా పిలవబడుతున్న నదీమతల్లి.  యాత్రీకులను విస్మయపరిచే ప్రకృతి సోయగం కనపడుతుంది ఇక్కడ.  తొలి తరం పాండ్య రాజులతో ముడిపడి ఉన్న "అప్ప కుడుత్తాన్ పెరుమాళ్" ఆలయ పురాణ గాథ కూడా తొలి యుగం నాటిదిగా తెలుస్తోంది.  పురాణ గాథ హస్తినాపురాన్ని పాలించిన కురు వంశం తో సంబంధ బాంధవ్యాలు గల పురు వంశంలో జన్మించారు " ఉపరిచర వాసు" గా పిలవబడిన పాండ్య రాజు.  దేవేంద్రునితో గల సన్నిహ...

Sri Nithya Kalyana Perumal Temple Divyadesm

      శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయం, తిరువిదాందై   నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో   అధికశాతం శ్రీ మహా విష్ణువుతన నిజరూపంలో, శ్రీరామునిగా, శ్రీ కృష్ణునిగా, అనంత శయనునిగా, నారసింహునిగా, త్రివిక్రమునిగా దర్శనమిస్తారు. అంటే ఉపస్థిత, స్థానక మరియు శయన భంగిమలలో.  కానీ శ్రీ వరాహ మూర్తిగా దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం తిరువిదాందై. మన రాష్ట్రంతో సహా తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో కొన్ని చోట్ల శ్రీ వరాహస్వామి ఆలయాలు ఉన్నాయి.  ఉత్తర భారత దేశంలో కూడా కొన్ని వరాహ స్వామి ఆలయాలు కనపడతాయి.  అత్యంత అరుదైన శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయ విశేషాలు తెలుసుకొందాము.  ఆలయ నామ విశేషాలు  తాయారు శ్రీ మహా లక్ష్మీ దేవి శ్రీ ప్రసన్న నారసింహుని కుడి లేదా ఎడమ తొడపైన ఉపస్థితురాలై ఉండటం సహజంగా శ్రీ లక్ష్మి నారసింహుని ఆలయాలలో చూస్తుంటాము. ఈ క్షేత్రంలో శ్రీ వరాహ స్వామి అమ్మవారిని తన ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకొని దర్శన మిస్తారు.  తిరు అనేది తమిళంలో గౌరవ పదం. "శ్రీ" అన్నదానితో సమానం. "ఎడ ఎంతాయి" అంగ ఎడమ పక్కన అని అర్ధం. శ్రీమతిని ఎడమ తొడ మ...