Gundicha Mandir, Puri
మూర్తి లేని మందిరం --- గుండీచా బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం మరియు పూరీ మన భారత దేశానికి నాలుగు దిశలలో నెలకొని ఉన్న దివ్య ధామాలు. ఈ నాలుగు క్షేత్రాల సందర్శనాన్ని " చార్ ధాం " యాత్ర అంటారు. స్వయం పరమాత్మ నడయాడిన ఈ పవిత్ర స్థలాలు యుగాల క్రిందటి పురాణ గాధలతో ముడిపడి ఉన్నాయి. హిందువులు జీవితంలో ఒకసారి అయినా ఈ క్షేత్రాలను సందర్శించాలని అభిలషిస్తారు. ఈ నాలుగు క్షేత్రాల ప్రాధాన్యత, ప్రత్యేకతలను విడివిడిగానే చూడాలి. అన్నింటి లోనికి పూరీ క్షేత్రం పూర్తిగా భిన్నమైనది. శ్రీ జగన్నాథ సంస్కృతి సంప్రదాయాలకు కేంద్ర బిందువు అయిన పూరీ క్షేత్రం ఎన్నో విశేషాల సమాహారం. ఋగ్వేదంలో శ్రీ జగన్నాథ క్షేత్ర ప్రస్థానం వివరంగ ఉన్నది. బ్రహ్మ పురాణం, పద్మ పురాణం కూడా నీలాచల క్షేత్ర ప్రాధాన్యత ను తెలుపుతున్నాయి. సుందర సాగర తీరంలో ఉన్న ఈ క్షేత్రం లోని ఆలయం, మూలవిరాట్టుల రూపాలు, వారికి చేసే పూజలు, అలంకరణ, సేవలు, నివేదనలు, యాత్రలు అన్నీ ప్రత్యేకమైనవే! మరెక్కడా కనపడనవే! అగ్రజుడు శ్రీ బలరాముడు, చెల్లెలు శ్రీ సుభద్రలతో శ్రీ మహావిష్ణ...