పోస్ట్‌లు

మార్చి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Bala Koteswara Swami Tempe, Govada,

చిత్రం
                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలిగించే వాతావరణం.  అలాంటి ప్రశాంత పరిసరాల మధ్యలో దర్శనమిస్తుంది శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి కొలువైన గోవాడ దివ్య క్షేత్రం.   మహేశ్వరుడు కొలువైన అనేక దివ్యధామాలు మనకు భారతదేశం నలుమూలలా కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో త్రవ్వకాలు జరిపినా శివలింగాలు వెలుగు చూస్తాయి. అంతగా విశ్వేశ్వరుని పట్ల అచంచల భక్తి భావాలు కలిగిన పవిత్ర భూమి మన భారత భూమి.  శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి ఇక్కడ కొలువు తీరిన గాథ యుగాల క్రిందటిదిగా పేర్కొనాలి. ఈ ఆలయం ఇక్కడ ఏర్పడానికి గల చారిత్రక ఆధారాలను చూద్దాము.  చారిత్రక నిదర్శనాలు  గతంలో ఈ ప్రాంతాన్ని చోళుల వంశం లో నుండి విడివడి ఇక్కడ స్థిరపడిన వారు అంటారు. అదే చరిత్రకారులు వీరు కన్నడ ప్రాంతానికి చెందిన పాలకవంశం అయిన చాళుక్య వారసులు అని పేర్కొంటారు. మరికొందరు వీరిని "వెలనాటి చోడులు" అని కూడా పిలుస్తారు.  చారిత్రక సత్యం ఏది ఏమ...

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

చిత్రం
                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు కానీ నేను నా ఆలయ సందర్శన ప్రయాణం లో నేటికి సుమారుగా మూడు వేలకు పైగా దేవాలయాలను దర్శించుకోగలిగాను.  వీటిల్లో చిత్రమైన ఆలయాలు అంటే దుర్యోధన, శకుని కూడా పూజలు అందుకొనే క్షేత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఒక ప్రత్యేక విశేష అస్సలు భక్తాదరణ లేని నిత్య పూజలకు కూడా దాతల దయ మీద ఆధారపడవలసిన  ఒక ఆలయాన్ని ఈ మధ్య నంద్యాల లో దర్శించడం జరిగింది. ఏ ఊరు వెళ్లినా మార్నిన్గ్  వాక్ మాత్రం మానను. ఆ రోజు కూడా నడుచుకుంటూ  చామ కాలువ వైపుకు వెళ్ళాను. ఇంతకు ముందు నంద్యాల వెళ్లిన సందర్భాలలో స్థానికంగా ఉన్న నవ నంది క్షేత్రాలను సందర్శించుకునే అవకాశం లభించింది. అదే విధంగా అహోబిళం, గుండ్ల బ్రహ్మేశ్వరం, ఓంకారం, పాణ్యం, కాల్వ బుగ్గ క్షేత్రాలను దర్శించుకొన్నాను. నడుస్తూ వెళుతున్న నన్ను ఒక బోర్డు ఆకర్షించింది. రాసిన విషయం ఆకర్షించినది. త్రిమూర...

Pata Shivalayam, Vijayawada

చిత్రం
             శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయం                                      ( విజయవాడ పాత శివాలయం ) పావన కృష్ణానది మహారాష్ట్రలో ఉద్భవించినది మొదలు ఆంధ్రప్రదేశ్ లో సాగర సంగమం చేసే వరకు ప్రవాహ మార్గాన్ని సస్యశ్యామలం చేయడమే కాకుండా తన తీరాలను ఆధ్యాత్మిక క్షేత్రాలుగా రూపొందించుకొన్నది.  ఈ కారణంగా కృష్ణా తీరాలలో హిందూ ఆలయాలే కాదు బౌద్ధుల మరియు జైనుల నివాస ఆనవాళ్లు కూడా పెక్కు చోట్ల కనిపిస్తాయి.  ముఖ్యంగా హిందూ దేవాలయాలు లెక్కకు మిక్కిలిగా నెలకొని ఉండటం చూడవచ్చును. వివిధ దేవీదేవతలు స్థిరవాసాలైన ఈ ఆలయాలలో ఒకటి విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రి పైన కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి.  శ్రీ మల్లేశ్వర స్వామి సమేతంగా సమస్త శివ పరివారం కొలువైన ఈ క్షేత్ర పురాణ గాథ తొలి యుగం నాటిదిగా తెలుస్తోంది. ద్వాపర యుగంలో పాండవ మధ్యముడైన అర్జునునికి కైలాసనాధుడైన పరమశివునికి యుద్ధం జరిగిన స్థలం ఇదేనని ఆ కారణంగా విజయవాటిక అన్న పేరు వచ్చింది అంటారు. అనంతర కాలంలో వి...