పోస్ట్‌లు

మార్చి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

Guruvayoor

చిత్రం
                                దక్షిణ ద్వారక - గురువాయూరు                                                                                                              త్రిమూర్తుల లో లోకసంరక్షకునిగా భక్తులు ఆరాధించే శ్రీ హరి దశావతారాలు ధరించిన విషయం తెలిసినదే ! ఈపదింటిలో అధిక ప్రాచుర్యం పొందినవి శ్రీ నరసింహ,  శ్రీ రామ మరియు శ్రీ కృష్ణ అవతారాలు.  థశరధరాముని దేవాలయాలు గ్రామగ్రామాన నెలకొని ఉన్నాయి. నృసింహునికి కూడా పెక్కు విశేష ఆలయాలు కలవు. కానీ నటన సూత్రధారి అయిన శ్రీ కృష్ణుని ఆలయాలు కొద్దిగానే కనపడతాయి. ద్వారక,  మధుర, బృందావనం,  ఉడిపి,  పూరి, జైపూర్,  ఉదయపూరు, కన్నంబాడి మరియు మన్నారుగుడి లాంటి ...

Thirunelveli Temples

                            తిరునల్వేలి దివ్య దేశాలు    కాంచీపురం తరువాత ఎక్కువ సంఖ్యలో శ్రీ వైష్ణవ దివ్య తిరుపతులు ఉన్న మరో జిల్లా తిరునల్వేలి. జిల్లాలో మొత్తంగా పదకొండు దివ్య దేశాలు ఉన్నాయి. తమిళనాడు  దక్షిణ భాగాన మదురై, కన్యాకుమారి, రామేశ్వరం మరియు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మధ్యలో ఉంటుందీ జిల్లా. రాష్ట్రంలో ఆరో పెద్ద నగరంగాను, దక్షిణ భాగాన ముఖ్య వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి తిరునల్వేలి పట్టణం. త్రవ్వకాలలో లభించిన వస్తువుల ఆధారంగా పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రిందట నుండి జనజీవనం,  నాగరికత వెల్లివిరుస్తోందని తెలిపారు. తిరునల్వేలి జిల్లా పర్యాటకులకు కావలసిన అన్ని రకాల ఆకర్షణలను కలిగి ఉన్నది. పురాతన కట్టడాలు, విశేష ఆలయాలు, జలపాతాలు,  పర్వత ప్రాంత విడిది కేంద్రాలు, అభయారణ్యాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇరవై ఒక్క చిన్నా పెద్ద  నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో తమిర పారాణి నది దాని ఉప నది అయిన చిత్రానది ముఖ్యమైనవి. తిరునల్వేలి నగరం మరియు ముఖ...

Thirunelveli Temples - 1

                            తిరునెల్వేలి దివ్యదేశాలు                శ్రీ వైకుంఠం - సూర్య క్షేత్రం   నవతిరుపతి ఆలయాలు అన్ని తిరునల్వేలి కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కానీ వరుసగా చూడటానికి కుదరదు. కారణం ఏమిటంటే ఆలయాల దర్శన సమయాల్లో తేడా ఉండటమే! ఏ ఆలయం ఏ సమయానికి తీస్తారు, ఏ ఆలయం తరువాత ఏ ఆలయానికి వెళ్లాలి అన్నది ఇక్కడి అద్దె కార్ల వాళ్ళకి బాగా తెలుసు. సమయాల ప్రకారం దర్శనాలు చేయిస్తారు. అందువలన కారు తీసుకుని వెళ్లడం ఉత్తమం. అన్ని ఆలయాలను చూడవచ్చును శ్రమ లేకుండా! నవతిరుపతులతో పాటు అందుబాటులో ఉన్న నవకైలాస ఆలయాలను, ఆరుపాడై వీడుల్లో ఒకటి సముద్ర తీరంలో శ్రీ సుబ్రమణ్యస్వామి కొలువైన తిరుచ్ఛెందూరు కూడా సందర్శించుకోవచ్చును. పూర్వం ఈ ప్రాంతం పాండ్య రాజుల పాలనలో ఉన్నది. అందువలన పాండ్య నాడు అని పిలిచేవారు. ఇక్కడ ఉన్న పది దివ్య దేశాలను పాండ్య నాడు క్షేత్రాలు అని నిర్ణయించబడింది. ఈ తొమ్మిది స్ధలాలు శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలు. ఒక్కో క్షేత్రం ఒక్కో గ్రహ స్ధలంగా గుర్తించ...

Kanchipuram Temples - 2

                           కాంచీపురం - దివ్య దేశాలు -2 సప్త ముక్తి క్షేత్రాల లో ఒకటి గా కీర్తించబడే కాంచీపురం లో మొత్తంగా పదునాలుగు శ్రీ  వైష్ణవ దివ్య తిరుపతులు ఉన్నాయి అని గతంలో తెలుసుకొన్నాము కదా ! ఆ ప్రకారం ఇప్పటి దాకా పది క్షేత్రాలను పరిచయం చేయడం జరిగింది. మిగిలిన నాలుగు ఆలయాల గురించి ఈ సంచికలో తెలుసుకొందాము. ఈ నాలుగు కూడా పెద్ద లేదా శివ కంచి లో ఉండటం విశేషం.  అంతే కాదు వీటిలో ఒకటి శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో మరొకటి శ్రీ కామాక్షి అమ్మన్ కోవెలలో ఉండటం చెప్పుకోవలసిన విషయం. వీటితో పాటు కంచీపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో  ఉన్న మరో దివ్య దేశ విశేషాలను కూడా చూద్దాము.  శ్రీ పాండవదూత పెరుమాళ్ ఆలయం  ఆళ్వారులు ఈ క్షేత్రాన్ని "తిరుప్పాదగం " ( శ్రీ +పెద్ద +క్షేత్రం ) అని పాశురాలలో సంభోధించారు. పేరుకు తగ్గట్టుగా కొలువైన "శ్రీ పాండవదూత పెరుమాళ్ " అర్చామూర్తి పాతిక అడుగుల ఎత్తు విగ్రహ రూపంలో దర్శన మిస్తారు. కురుక్షేత్ర యుద్దానికి ముందు వాసుదేవుడు పాండవుల తరుఫున రాయబారిగా కౌరవ సభకు వె...

Veda Vyasa

చిత్రం
                        మహాభారతం పుట్టింది ఇక్కడేనట ! "వింటే భారతం వినాలి. తింటే గారెలు తినాలి " అన్నది తెలుగునాట బాగా ప్రాచుర్యంలో ఉన్న నానుడి. పంచమ వేదంగా పరిగణింపబడే మహాభారతంలో లేనిది లేదు అంటారు పండితులు. అన్ని యుగాలకు, కాలాలకు అందరికీ వర్తించే మహాకావ్యంగా పేర్కొంటారు. తొలుత "జయ" అన్న పేరుతొ, ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలతో రచించబడిందిట. తదనంతర కాలంలో కొత్తగా చేరిన కొన్ని వృత్తాంతాలు, వాఖ్యలు జతపడి చివరకు పద్దెనిమిది పరువాలతో, లక్ష శ్లోకాలతో "మహా భారతం"గా మనకు అందుబాటు లోనికి వచ్చింది. ఈ ఇతిహాసం లోని సంఘటనలు, పాత్రలు నేటికీ మనకు ఎక్కడొక్కడ, ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంటాయి. సత్కర్మ, దుష్కర్మల ఫలితాలను తప్పక అనుభవించాలని ఎన్నో ఘటనల, పాత్రల ద్వారా సవివరంగా తెలియజేస్తుంది. పరాశర మహర్షి కుమారుడైన "కృష్ణ ద్వైపాయనుడు". వేదాలను వర్గీకరించడం వలన "వేద వ్యాస"గా ప్రసిద్ధి చెందారు. అష్టాదశ పురాణాలను మనకు అందించినది వ్యాసుడే ! ఆయన స్వయంగా విరచించిన మహాభారతంలో ఆయనది  కీలక పాత్ర.  కురువంశ ఆ...

Kanchipuram Temples

                        కంచి లోని శ్రీ వైష్ణవ దివ్య దేశాలు  కాంచీ పురంలో మొత్తం పదునాలుగు శ్రీ వైష్ణవ దివ్యదేశాలుండగా వీటిల్లో తొమ్మిది  శివ కంచిలో, అయిదు విష్ణు కంచిలో ఉన్నాయి. అన్నింటిలోనికి  ముఖ్యమైనది శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల. శివ కంచిలో నాలుగు దివ్యదేశాలు కలిసి ఒక్క  శ్రీ ఉలగండ పెరుమాళ్ ఆలయంలోనే ఉంటాయి.  ఒకటి శ్రీ కామాక్షీ అమ్మన్ ఆలయంలో మరొకటి శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ఉండగా మిగిలిన మూడు  విడిగా ఉంటాయి. విష్ణు కంచిలో నాలుగు ఆలయాలు శ్రీ వరద రాజా స్వామి ఆలయానికి సమీపంలోనే ఉంటాయి. ఈ జాబితాలో లేని "తిరుప్పుకులి" కంచి కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ మాసం విష్ణు కంచి లోని నాలుగు దివ్య దేశాల గురించి తెలుసుకొందాము. ఈ నాలుగు దివ్యదేశాల ఆవిర్భావం వెనుక ఉన్న పురాణ గాధ ఒక్కటే !   ఒకసారి   తామిరువరులలో   ఎవరు   గొప్ప   అన్న   వివాదం   తలెత్తినది   శ్రీ   లక్ష్మి   మరియు   సరస్వతి   దేవిల ...