పోస్ట్‌లు

అక్టోబర్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

Mithranandapuram Trimurthy Temple, Tiruvananthapuram

చిత్రం
  మిత్రానందాపురం త్రిమూర్తి ఆలయం, తిరువనంతపురం  హిందూ పురాణాల ఆధారంగా మనకున్న దేవీ దేవతలు ముక్కోటిమంది. అందులో సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులది అగ్రస్థానం. స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు కు లయకారకుడైన సదాశివునికి పృధ్విలో ఎన్నో ఆలయాలున్నాయి.  వ్యాప్తిలో ఉన్న అనేక కారణాల కారణంగా సృష్టి కర్త అయిన బ్రహ్మ దేవునికి భువిలో పూజార్హత లేకుండా పోయింది. అయినా కమలాసనునికి దేశంలోని కొన్నిప్రాంతాలలో  ఆలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది రాజస్తాన్ లోని పుష్కర్ లో ఉన్నది. అయితే  త్రిమూర్తులు ముగ్గురూ ఒకే చోట  కొలువైన క్షేత్రాలు బహు అరుదుగా కనపడుతుంటాయి.ఇలాంటి అరుదయిన క్షేత్రాలు అరుదైన ఆలయాల నిలయమైన కేరళలో ఎక్కువగా ఉండటం విశేషం.  మలప్పురం జిల్లాలోని "తిరునవయ" మరియు రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలోని మిత్రానందపురం త్రిమూర్తి క్షేత్రం వీటిల్లో ముఖ్యమైనవి.  ఈ రెండు క్షేత్రాలలోని ప్రధాన వత్యాసం ఏమిటంటే తిరునవయలో త్రిమూర్తుల ఆలయాలు కేరళ గంగ గా ప్రసిద్ది చెందిన భరత్ పుళ నదికి ఇరుపక్కలా ఉంటాయి. మిత్రానందపురంలో ఒకే ప్రాంగణంలో ...

Thamarakulangara Sree Dharmasastha Temple, Thripunithura

చిత్రం
                    తామరకులంగర శ్రీ ధర్మ శాస్త ఆలయం , త్రిపునిత్తూర   శ్రీ ధర్మశాస్త అనగానే అందరి మనస్సులలో యోగముద్ర లో కొలువు తీరిన స్వామే మెదులుతారు.  కానీ శ్రీ ధర్మశాస్త నూటికి పైగా వివిధ భంగిమలలో కేరళ లోని అనేక ఆలయాలలో దర్శనమిస్తారు అని కొంత నిశితంగా పరిశీలిస్తే అవగతం అవుతుంది.  ప్రతి ఒక్క అయ్యప్ప దీక్షాదారి సందర్శించేది  ఎరుమేలి.  ఎరుమేలి శ్రీ ధర్మశాస్త స్థానక భంగిమలో ధనుర్భానాలను చేత బట్టుకొని ఉంటారు.    అలా స్వామి మరొక ప్రత్యేకమైన భంగిమలో కనపడే కోవెల "తామరకులంగర "లో కలదు.  కొచ్చి పట్టణానికి సుమారు ఇరవై కిలో మీటర్ల దూరంలో ఉన్నది  త్రిపునిత్తూర. కొచ్చిన్ రాజుల ఒకప్పటి రాజధాని. వారి కుల దేవత "శ్రీ పూర్ణత్రేయేశ స్వామి ". ఈ ఆలయానికి సమీపంలో ఉంటుందీ "తామర కులంగర శ్రీ ధర్మ శాస్త ఆలయం ".  భగవంతుడు తన నిజ భక్తుని సేవలకు సంతుష్టుడై వెన్నంటే ఉంటాడని అని ఈ క్షేత్ర గాధ తెలుపుతుంది. చాలా సంవత్సరాల క్రిందట మలప్పురం జిల్లా లోని "చామర వ...