పోస్ట్‌లు

జూన్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

Ashtamsa Sri Varada Anjaneya Temple, Coimbatore

చిత్రం
            అష్టాంశ శ్రీ వరద ఆంజనేయ స్వామి ఆలయం, కోయంబత్తూర్   వానరం అంటే స్థిరత్వం లేకుండా ప్రవర్తించే జీవి.  మానవ మనస్సుకు, ఆలోచనలకు ప్రతి రూపం వానరం.  మానవులకు సరి అయిన మార్గ దర్శకత్వం చేయడానికి స్వయ సర్వేశ్వరుడే వాయునందనునిగా అవతరించారని జ్ఞానులు, విజ్ఞులు అంటారు.  అందుకే నిరుపమాన స్వామి భక్తికి, అచంచల విశ్వాసానికి, చక్కని వాక్చాతుర్యానికి, కార్య దీక్షకు, పరాక్రమానికి, వినయ విదేయతలకు మరో పేరే శ్రీ ఆంజనేయుడు.  చిరంజీవిగా ఎక్కడ రామ నామ జపం జరుగుతుందో అక్కడ ఉంటారని భక్తులు విశ్వసించే స్వామి కి దేశం అంతటా ఎన్నో ఆలయాలున్నాయి.   వాటిల్లో ఏమాత్రం చారిత్రిక పౌరాణిక నేపద్యం లేకుండా ఒక భక్తుని ధృడమైన సంకల్పంతో నెలకొన్న ఆలయమే "అష్టాంశ శ్రీ వరద ఆంజనేయ స్వామి ఆలయం, కోయంబత్తూర్" పది సంవత్సరాల క్రిందట సద్గురు ఆదేశంతో శిష్య బృందంచే నిర్మించబడిన ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.  సహజంగా భక్త, దాస, అభయ, సంజీవ రాయ, పంచ ముఖ ఆంజనేయునిగా దర్శనమిచ్చే అంజనా సుతుడు ఈ ఆలయంలో అన్నీ మేల...

Thirunakkara sree Mahadeva Temple, Kottayam

చిత్రం
                      తిరునక్కర శ్రీ మహాదేవ ఆలయం, కొట్టాయం    గత నెల రోజులలో నేను సందర్శించిన అద్భుత శివాలయాలలో మూడవది కేరళ రాష్ట్రం కొట్టాయం లోని తిరునక్కర శ్రీ మహాదేవ ఆలయం. కొట్టాయం శబరి మల యాత్ర చేసేవారందరికి తెలిసిన ఊరు. ఆంద్ర నుండి వెళ్ళే అయ్యప్ప దీక్షా పరులలో చాలా మంది ఇక్కడే దిగుతారు. ఈ ఊరు మధ్యలో ఉన్న తిరునక్కర శ్రీ మహాదేవ ఆలయంలో కైలాస నాధుడు కోరి కొలువైనాడని క్షేత్ర పురాణ గాధ ఆధారంగా అవగతమౌతోంది.  అయిదు శతాబ్దాల క్రిందట ఈ ప్రాంతాన్ని పాలించే తేక్కుమ్కూర్ వంశ రాజు ప్రతి పౌర్ణమికి త్రిస్సూర్ వెళ్లి శ్రీ వడక్కు నాథర్ ను సేవించుకొని వచ్చేవారట.  అలా చాలా సంవత్సరాలు గడిచాయి.  ఒకసారి వయసు మీద పడటంతో వయోభారం వలన ఇంత దూరం ప్రయాణించి స్వామి దర్శనానికి రాలేనని, ఉపయోగం లేని ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించమని వేడుకోన్నారట రాజు.  నాటి రాత్రి సదాశివుడు రాజుకు స్వప్న సందర్శనమిచ్చి తిరుగు ప్రయాణంలో లభించే లింగాన్ని తన రాజ్యంలో ప్రతిష్టించమని, అందుకు అవసరమైన ఆధారాలను ...

Sri Vadakkunnathan Temple, Thrissur

చిత్రం
                        శ్రీ వడుక్కునాథర్ ఆలయము, త్రిస్సూర్   గత నెలలో  సందర్శించిన అద్భుత శివాలయాలలో రెండవది కేరళ రాష్ట్ర కళల రాజధాని త్రిస్సూర్ నడి బొడ్డున ఉన్న " వడక్కునాథర్ ఆలయము" త్రిస్సూర్ పట్టణంలోని ప్రధాన కూడలి "స్వరాజ్ రౌండ్" మధ్యలో సుమారు పది ఎకరాల సువిశాల స్థలంలో ఉంటుందీ ఆలయం. కొన్నిశతాబ్దాల క్రిందట చిన్న కొండ మీద ఉన్న ఈ ప్రాంతము దట్టమైన అడవి. నేరస్తులకు శిక్షగా " తెక్కిన్ కాడు" లోనికి పంపేవారట. తరువాత కొచ్చిన్ రాజ వంశీకులు పూనుకొని ఆలయ నిర్మాణాన్ని చేసారట. ప్రస్తుత ఆలయం సుమారు పదమూడు వందల సంవత్సరాల క్రిందటి నిర్మాణంగా నిర్ణయించి పురావస్తు శాఖ తన అధీనం లోనికి తీసుకొన్నది. సంరక్షించాల్సిన పురాతన నిర్మాణంగా "యునేస్కో" గుర్తింపు కూడా పొందినది శ్రీ వడక్కునాథర్ ఆలయం. \ పురాణ కాలంలో "తిరు శివవేరూర్" గా పిలవబడి కాలక్రమంలో "త్రిస్సూర్" గా మార్పు చెందినట్లు తెలుస్తోంది.  పద్దెనిమిదో శతాబ్దంలో కొచ్చి...