పోస్ట్‌లు

మే, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

Vellamassery Garudan Kavu

చిత్రం
                                      గరుడన్ కావు ( గరుత్మంతుని ఆలయం )  ప్రత్యేక ఆలయాల కోవలోనిదే "వెళ్ళమ శ్శరీ  గరుడన్ కావు".  శ్రీ మన్నారాయణుని సేవలలో నిరంతరం తరించేవిగా  సుదర్శన చక్రం, పాంచజన్యం (శంఖం), కౌమోదకి ( గద ), ఆదిశేషువు మరియు గరుత్మంతుడు ముఖ్యమైనవి అని చెప్పుకోవాలి.  శంఖం మరియు గద శ్రీహరి హస్త భూషణాలుగా ప్రసిద్ది.   స్వామి ఆనతి మేరకు ఎందరో లోకకంటకులను హతమార్చిన సుదర్శన చక్రానికి శ్రీ వైష్ణవ పూజా విధానంలో విశేష ప్రాముఖ్యం ఉన్నది.  ఎన్నో ఆలయాలలో సుదర్శన సన్నిధి ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడినది.  ఇక ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే అక్కడే ! సర్వాంతర్యామికి వాహనంగా ప్రసిద్ది గరుత్మంతుడు.  ప్రతి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద వినమ్రంగా జోడించిన హస్తాలతో ఉండే వినతా సుతుని మనందరం చూస్తూనే ఉంటాం.  కాని అతనికి ప్రత్యేకంగా ఉన్న ఏకైక కోవెల మాత్రం "గరుదన్ కావు"లో ఉన్నదే.  బహుశా భారత దేశం మొత్తం మీద పక్షి...

Sri Chitraputhira yama dharmaRaja Temple, Coimbatore

చిత్రం
                      చిత్ర పుతిర శ్రీ యమ ధర్మ రాజ ఆలయం  మన పురాణాల ప్రకారం మనకున్నది ముక్కోటి దేవీ దేవతలు.  వీరిలోని ప్రతి ఒక్కరు జీవుల నిత్య జీవన విధానాన్ని ప్రభావితం చేసేవారే ! అందుకే అందరికీ ఆలయాలు లేకున్నా మన పూజా విధానం లో అందరిని సంతృప్తి పరచే మంత్రాలు ఉన్నాయి.  అలా మానవ జీవితాలు ప్రశాంతంగా గడిచి పోతాయన్నది ఒక విశ్వాసం.  అదే విధంగా ఎన్నో భాషల సంస్కృతుల నిలయమైన మన దేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైన ఆరాధన విధానాలు, నమ్మకాల ప్రకారం ఆలయ నిర్మాణాలు జరిగాయని ఆ యా క్షేత్ర గాధలను చదివినప్పుడు తెలుస్తోంది.  అలాంటి దానికి సాక్ష్యం గా కనపడేదే " చిత్ర పుతిర శ్రీ యమ ధర్మ రాజ ఆలయం ".  తమిళ నాడు లోని ముఖ్య నగరాలలో ఒకటైన కోయంబత్తూర్ కు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్లలూరు గ్రామ శివారులలో ఉన్నదీ ఆలయం.   సుమారు మూడు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిన ఈ ఆలయం కొన్ని కుటుంబాల అధీనంలో ఉండి, వారే పూజారులుగా వ్యవహరిస్తున్నారు.  కాలక్రమంలో మిగిలిన వారు కూడా సందర్శి...

Chennai Temples

చిత్రం
                    శ్రీ ముఖ్య ప్రాణ ఆంజనేయ స్వామి ఆలయం   తమిళ నాడు ఆ రాష్ట్ర రాజధాని చెన్నై ఆలయాలకు ప్రసిద్ది.  అందులో శ్రీ పార్ధ సారధి స్వామి ఆలయం ఉన్న త్రిప్లికేనే ప్రాంతం ఎన్నో చిన్నా పెద్ద ఆలయాలకు నిలయం.  ఏంతో పౌరాణిక చారిత్రాత్మిక విశేషాల సమాహారమైన శ్రీ పార్ధసారధి స్వామి ఆలయ పుష్కరణి కి దక్షిణాన ఉన్న హనుమంత రాయ కోవిల్ వీధిలో ఒక విశేష ఆంజనేయ ఆలయం ఉన్నది.  అదే శ్రీ ముఖ్య ప్రాణ ఆంజనేయ స్వామి ఆలయం.  గృహ సముదాయాల మధ్యన ఉన్న ఈ మందిరం లోని ఆంజనేయుని 1794వ సంవత్సరంలో అప్పటి ఉత్తరాది మఠం పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ సత్య సందారు స్వామి ప్రతిష్టించారు.  కాలక్రమంలో భక్తుల సహాయ సహకారాలతో ప్రస్తుత రూపం సంతరించుకొన్నది.  గర్భాలయంలో ఎత్తైన గట్టు మీద సుమారు పది అంగుళాల శ్రీ భక్త ఆంజనేయ స్వామి విగ్రహం కుడి కాలుని కొద్దిగా వంచి ఉత్తరాభిముఖంగా స్థానక భంగిమలో దర్శనమిస్తుంది.    సన్నటి ప్రదక్షిణా పదంలో అష్ట దిక్కులా నాగ రూపాలను ఉంచారు. ...