పోస్ట్‌లు

ఆగస్టు, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

King Vallala Deva, Tiruvannamalai

చిత్రం
                                    పుత్రుడైన పరమేశ్వరుడు   పరమేశ్వరుడు తలచుకొంటే ప్రసాదించలేనిది అంటూ ఏదీ లేదు ! ఎనలేని అనుగ్రహాన్ని కురిపించగలరు.కన్నప్ప,మార్కండేయుడు,శిబి ఇలా ఎందరో మహానుభావులు అలాంటి కృపకు నోచుకొన్నవారే !! వారి కోవకు చెంది, మహేశ్వరుని మమతానురాగాలకు అర్హత పొందిన మరో భాగ్యశాలి వళ్ళాల దేవ మహారాజు.   శ్రీ కృష్ణ దేవరాయలు వెయ్యి కాళ్ళ మండపం మరియు  వళ్ళాల గోపురం  వీర వళ్ళాల దేవ రాజు - 3 దక్షిణ భారత దేశాన్నిపాలించిన శక్తివంతమైన "హొయసల "రాజ వంశానికి చెందిన వాడు. వీరి తొలి రాజధాని నేటి మైసూరుకు సమీపంలోని "హళిబేడు". ఆ రోజుల్లో దాని పేరు "ద్వార సముద్ర".   1233 నుండి 1346 వరకు (వంద సంవత్సరాలకు పైగా) వీరు నేడు కర్ణాటక, ఆంద్ర, తమిళనాడు, తెలంగాణాగా పిలవబడుతున్న ప్రాంతాలలోని  అధిక భూభాగాన్ని తమ పాలనలో ఉంచుకొన్నారు. హొయసల రాజులలో అత్యంత కీర్తిప్రతిష్టలు పేరొందిన పాలకుడు "వళ్ళాల దేవ ...

UP Dates 2

అందరికీ నమస్కారం.   గత నాలుగు రోజులలో మరి కొంత మంది దాతలు మహా పుస్తక క్రతువుకు  వారి విరాళాలను   పంపినారు.  1. అజ్ఞాత భక్తులు, హైదరాబాద్   -----         Rs. 516/- 2. V S Kumar, USA              -----              Rs. 1330/- ( 20 Dollars) 3. Ramana, U S A                 -----              Rs. 2000/- ( 30 Dollars) వీరందరికీ శ్రీ అరుణాచలేశ్వరుని కృపాకటాక్షాలు సర్వవేళలా లభించాలని ప్రార్ధిస్తున్నాను.  అందరినీ ఈ పవిత్ర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మరోసారి అర్ధిస్తున్నాను. 

Up-dates

కృతజ్ఞతలు.  శ్రీ అరుణాచలేశ్వరుని (తిరువణ్ణామలై)మీద పుస్తకం ప్రచురించి ఉచితంగా భక్తులకు అందించాలన్న సత్సంకల్పంతో ధన సహాయం కొరకు నేను చేసిన అభ్యర్థనకు తొలి స్పందన ఈ రోజు వచ్చినది.  అజ్ఞాత భక్తులు ఒకరు Rs.665.38 ( 10 Dollars) పంపారు.  ఆ సోదరుని కుటుంబానికి  సర్వేశ్వరుడు సకల శుభాలను ప్రసాదించాలని కోరుకొంటున్నాను.  ఈ మహా పుస్తక క్రతువులో పాల్గొనాలని మరొక్కసారి అందరికీ సవినయ విన్నపం.  ఇలపాలవులూరి వెంకటేశ్వర్లు 

Ashta Dikpaalakas Lingam Temples, Tiruvannamalai

చిత్రం
అష్ట దిక్పాలక లింగ ఆలయాలు - తిరువణ్ణామలై  పరమేశ్వరుడే పర్వత రూపంలో వెలసిన మహాద్భుత క్షేత్రం తిరువణ్ణామలై.  తిరువణ్ణామలై లో పర్వత పాదాల వద్ద ఆలయం నిర్మించినా భక్తులు గిరి ప్రదక్షిణం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు.  భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయంగా గిరి ప్రదక్షణం చేయడమే కాక ప్రదక్షిణా ఫలం గురించి సవివరంగా తన శిష్యులకు తెలిపారు. (గిరివలయం ఎలా చేయాలి, ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది అన్నది ఈ బ్లాగ్ లోని గిరివలయం శీర్షిక  లో వివరించాను). అనేక పురాణాలలో అరుణాచల మహత్యం గురించి తెలుపబడినది.  ప్రధాన ఆలయం నుండి ప్రారంభించే ఈ ప్రదక్షిణా పధంలో ఎన్నో పురాతన నూతన ఆలయాలు, మందిరాలు, మండపాలు ఎదురవుతాయి.  వీలైనంత వరకూ అన్నింటినీ సందర్శించడం అభినందనీయం. అలా చేయలేని పక్షంలో అష్ట దిక్పాల లింగాలు ఎనిమిది మరియు లోకాలను వెలుగును ప్రసాదించే సూర్య ప్రతిష్ఠిత లింగం, నిరంతరం చంద్రశేఖరుని శిరస్సున ఉంటూ తన వెన్నెల వెలుగులతో ఆహ్లాదాన్ని పంచి ఇచ్చే  చంద్ర స్థాపిత లింగాన్నిదర్శించడం తప్పనిసరి. గిరివలయంలో అష్ట దిక్పాలక లింగాలు నెలకొన్న విధానం ...