Manickavasagar
కవి మాణిక్యవాసగర్ ఈయనను తమిళనాడు "రామదాసు" అని పిలవవచ్చును. అలానే శివ భక్తులలో "గోదాదేవి" (ఆండాళ్) అని కూడా పిలవవచ్చును. ఎందుకంటె ఈ కవి సరిగ్గా వారిద్దరూ చేసిన పనులను చేసారు. తొమ్మిదో శతాబ్దానికి చెందిన ఈ శివ గాయక భక్తుని గురించి "తిరువిలయాడల్ పురాణం" సవివరంగా తెలిపినది. శ్రీ మీనాక్షీ దేవి కొలువైన మదురై పట్టణానికి దగ్గర లో పవిత్ర వైగై నదీ తీరం లోని "తిరువధవూర్"లో జన్మించారు. ఈయన తండ్రి స్థానిక శివాలయంలో పూజారి. దానితో చిన్నతనం నుండి శివుని మీద అమిత భక్తి శ్రద్దలు ఏర్పడ్డాయి.విద్యా బుద్దులు నేర్చుకొన్న తరువాత వరగుణ పాండ్య రాజు వద్ద సైనిక అవసరాలను చూసే ఉద్యోగంలో చేరారు.నిజాయితీతో పనిచేసే మాణిక్యవాసర్ అంటే రాజుగారికి అభిమానం మరియు గౌరవం. ఒకసారి అశ్విక బలాలను మరింత శక్తిమంతం చేయదలిచారు రాజు.పెద్ద మొత్తంలో ధనాన్ని మాణిక్య వాసగర్ కు ఇచ్చి ఆ పని మీద పంపార...