పోస్ట్‌లు

మే, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Paidi Thalli Ammavari Temple, Vizianagaram

చిత్రం
                          శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, విజియనగరం   పూసపాటి రాజవంశీకుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు. అమ్మవారి గురించి ఇదు మిద్దంగా సంపూర్ణ చరిత్ర లభించడం లేదు. కొందరు ఆమె విజియనగర గ్రామా దేవత అని ఇంకొందరు ఆమె రాజ వంశ ఆడబడుచని అంటారు.  విజియ నగర వాసులు తమను కాపాడే దేవతగా భావించే పైదితల్లికి చదును గుడి మరియు వనం గుడి అని రండు ఆలయాలున్నాయి. చదుని గుడి ఊళ్ళోని మూడు లాంతర్ల జంక్షన్ లో ఉండగా వనం గుడి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. నిత్య పూజలతో భక్తుల సందర్శనంతో రెండు నిత్య కలకలాడుతుంటాయి. అన్ని పర్వదినాలలో విశేష పూజలు అలంకారాలు జరుపుతారు. దసరాలలో నవరాత్రులను ఘనంగా జరుపుతారు. ఈ దసరా ఉత్సవాల తరువాత వచ్చే తోలి మంగళవారం విజియ నగరం విశేష శోభను సంతరించుకొంటుంది. అదే సిరి మానోత్సవ సంబర శోభ. లక్షలాదిగా భక్తులు ఉత్తర ఆంద్ర జిల్లాల నుండి మరియు ఒడిష రాష్ట్రాల నుండి తరలి వస్తారు. ప్రత్యేక విధానంలో సిరి మానును ఈ ఉత్సవ నిమిత్తం సేకరిస్తారు. ...

Irumpanam Makaliyam Sree Rama Swamy Temple

చిత్రం
                            శ్రీ రామ స్వామి ఆలయం, ఇరుంపాణం   భారతీయులకు శ్రీ రామ చంద్ర మూర్తి ఆరాధ్య దైవమే కాదు మార్గదర్శి, ఆమోదప్రదమైన ప్రభువు, ఆదర్శ మూర్తి. శ్రీ రాముని ఆలయం లేని ఊరు భారత దేశంలో కనపడదు. రామాయణ పారాయణం చేయని హిందువు ఉండడు.  శ్రీ రాముని ఆలయాలలో కొన్ని సమస్త ప్రజానీకానికి తెలిసి ప్రముఖ స్థానాన్ని పొందుతున్నాయి. మరికొన్ని విశేష పురాణ నేపద్యం ఉన్నా స్థానికంగా కూడా అంత గుర్తింపు పొందనివి. అలాంటి వాటిల్లో కేరళ రాష్ట్రం లోని  ఇరుంపాణం మకలియం శ్రీ రామ స్వామి ఆలయం ఒకటి. కేరళ రాష్ట్రం లో నెలకొని ఉన్న శ్రీ రామాలయాలలో గర్భాలయంలో రాముడు ఒక్కరే ఉంటారు. మిగిలిన రాష్ట్రాలలో సీతాలక్ష్మణులతో పాటు దాసుడు శ్రీ హనుమంతునితో కలిసి పూజలందు కొంటారు దశరథ తనయుడు. ఇది ఇక్కడ, మిగిలిన ప్రదేశాలలోని రామాలయాలకు గల  ప్రధాన వత్యాసం. పోనీ ఉపాలయాలలో అయినా శ్రీ జానకీ మాత ఉంటారా అంటే అదీ కనపడదు. కేరళలో ప్రముఖ రామాలయం అయిన త్రిప్రయార్ లో కూడా ఇలానే ఉంటుంది.  ఇరుంపాణం మకల...

Sri Pardhasathi Swamy Temple, Guruvayur

చిత్రం
                          శ్రీ పార్ధ సారధి ఆలయం, గురువాయూరు                         పాండవ మాత  కొలిచిన పార్ధసారధి  గురువాయుర్ కేరళ రాష్ట్రంలో అధిక సంఖ్యలో భక్త జనులను ఆకర్షించే దివ్య క్షేత్రాలలో ఒకటి. శ్రీ గురువాయురప్పన్ ( శ్రీ కృష్ణుడు) విగ్రహాన్ని బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన  కారణంగా "గురువాయుర్ " అన్న పేరోచ్చినదంటారు. అత్యంత అరుదైన "పాతాళ శిల" తో మలచబడిన ఈ విగ్రహాన్ని మహేశ్వరుడు విధాత బ్రహ్మదేవునికి ఇచ్చారట. ఆయన నుండి కశ్య ప్రజాపతి, ఆయన నుండి వసుదేవునికి, ఆయన నుండి శ్రీ కృష్ణుని పూజలు అందుకొన్న అపురూప మూర్తి ఇది. శ్రీకృష్ణ నిర్యాణ సమయంలో ఉద్దకునికి విగ్రహాన్ని ఇచ్చి దానిని బృహస్పతికి అందజేయమని ఆదేశించారట. దేవగురువు వాయుదేవుని తో కలిసి ఆకాశమార్గాన ప్రయాణిస్తూ సముద్రతీరాన ఒక కోనేరు ఒడ్డున తపస్సు చేస్తున్న సదాశివుని చూసి ప్రణమిల్లారట. నీలకంఠుడు వారిని శంఖం, చక్రం, కౌమోదకం మరియు పద్మ జపమాలలు ధరించి ముగ్ధమనోహర రూపంలో ...