పోస్ట్‌లు

జనవరి, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

sri sowmyanatha swamy temple, Nandalur

చిత్రం
                        నంద నందనుడు కొలువైన నందలూరు  శ్రీ మహా విష్ణువు భూలోకంలో అనేకానేక రూపాలలో, ఎన్నో నామాలతో  కోవెలలో కొలువుతీరి కొలిచిన వారికి కొంగు బంగారంగా పిలవబదుతున్నాడు.  అలాంటి వాటిల్లో ఒకటి శ్రీ హరి సౌమ్య నాధ స్వామి గా వెలసిన క్షేత్రం నందలూరు.  నందనందనుడు వెలసిన కారణంగా ఈ గ్రామానికి నందలూరు అన్న పెరోచ్చినదని చెబుతారు.   సుందర శిల్పాలతో కళకళలాడే ఆలయం శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా పరిగణించవచ్చును.  పౌరాణిక గాధ : లోక కంటకుడైన హిరణ్యకశపుని సంహరించిన తరువాత కూడా నరసింహుని ఉగ్రత్వం తగ్గలేదు.  అరణ్యంలో చెంచు వనిత రూపంలో లక్ష్మి దేవి సహచర్యంతో స్వామి సౌమ్యుడైనాడు.  ఆ రూపనికే సౌమ్యనాదుడు అని పేరు.  తొలుత నిరంతరం  నారాయణ నామాన్ని జపించే నారద మహర్షి ఇక్కడ ఎన్నో పురాణాలలో పేర్కొన్న బాహుదా ( చెయ్యేరు) నదీ తీరంలో ప్రతిష్టించారని స్థానికంగా ఒక కధనం ప్రచారంలో ఉన్నది.  నారద ప్రతిష్టిత శ్రీ సౌమ్యనాధ స్వామికి దేవతలే ఆలయం నిర్మించారని, కాల గతిలో అది శ...

Radha sapthami

చిత్రం
                          వందే సూర్యం నిత్య పూజితం  వేదకాలంలోనూ తదనంతరం అంటే ద్వాపర యుగం దాక ముల్లోకాలకు అధిపతి అయిన సర్వేశ్వరుడు మానవ రూపంలో ఈ పుడమి మీద నడయాడినట్లుగా మన హిందూ పురాణాల ద్వారా అవగతమౌతున్నది. ఆ కాలంలో దుష్టుల నుండి రక్షణకు, దైవ సాక్షత్కారంతో మోక్షం పొందేందుకు తమపు, యజ్ఞ యాగాదులే మార్గంగా ముముక్షువులు ఎంచుకోనేవారు తప్ప విగ్రహారాధన లేదని తెలుస్తోంది. వారు చేసిన మరో ఆరాధనా ప్రక్రియ సూర్య దేవుని  కొలవడం. పురాణాలలోని ముక్కోటి దేవతలలో ప్రతక్షంగా దర్శనమిచ్చేది దివాకరుదోక్కడే. సూర్యునికి అర్ఘ్యం సమ ర్పించుకోవడం సాక్షాత్ శ్రీ మన్నారాయనునికి సమర్పించుకొవడంగా భావించేవారు. సూర్య నమస్కారాలు కూడా ఆ కోవలోనివే. ప్రతక్ష నారాయణునిగా కీర్తించబడే ప్రచండ తేజోమూర్తి అయిన భాస్కరుడు మానవ జీవితాలలో ఎంతో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. ప్రజాపతులలో మరియు  సప్తరుషులలో ఒకరు అయిన కాశ్యపకుని భార్యలలో ఒకరైన అదితికి జన్మించినవాడే ఆదిత్యుడు. స...

Sri Soumya Narayana Perumal Temple, Thirukoshtiyur

చిత్రం
  శ్రీ సౌమ్య నారాయణ పెరుమాళ్ ఆలయం. తిరుకోష్టియుర్  వైకుంఠ వాసునికి భూలోకంలో ఉన్న అనేకానేక ఆలయాలలో ఆళ్వారుల గానంతో దివ్య దేశాలుగా ప్రసిద్దికెక్కిన నూట ఎనిమిది దివ్య క్షేత్రాలలో ఒకటి తిరుకోష్టియుర్. తొలి యుగం నాటి పౌరాణిక గాధకు, కలియుగంలో ప్రసిద్దికెక్కిన వైష్ణవ గురువు శ్రీ శ్రీ శ్రీ రామానుజా చార్యుల జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ముడిపడి ఉన్న పవిత్ర క్షేత్రం తిరుకోష్టియూర్.  ఆలయ విశేషాలు : ఆలయ నిర్మాణమే ఒక విశేషంగా చెప్పాలి. ఆలయాన్ని ప్రస్తుత రూపంలో  తీర్చిదిద్దినది పది హేనవ శతాబ్దానికి చెందిన నాయక రాజులు అని శాసనాలు తెలుపుతున్నాయి. తూర్పు ముఖం గా ఉన్న రాజ గోపురం దాటి ప్రాంగణం లోనికి అడుగు పెడితే ఎన్నో ఉపాలయాలు కనపడతాయి. ఎడమ వైపునకు తిరిగి ప్రదక్షిణ ఆరంభించగానే ఎదురయ్యే తొలి సన్నిధి శ్రీ శ్రీ శ్రీ రామానుజా చార్యులవారిది. పక్కనే ఉన్న మరో సన్నిధి ఆయనకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించిన గురు దేవులు శ్రీ తిరుకోష్టియూర్ నంబి. చిన్నదైన ఇందులో అర్థ మంటపం,మున్మండపం,గర్భ గృహం. మున్మండపంలోనే  అద్దాల అరలో నమ్బిగల్ ఉత్సవ మూర్తి, పక్కనే ఆయన పూజించి...