Sri Nidanampati Sri Lakshmi Ammavari Temple, Adigoppala
శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం, అడిగొప్పల అమ్మలగన్న అమ్మ లోకపావని శ్రీ పార్వతీ దేవి దేశం నలుమూలలా ఎన్నో పేర్లతో వివిధ క్షేత్రాలలో కొలువు తీరి భక్తుల సేవలను అందుకొంటున్నారు. అలాంటిదే "నిదానంపాడు అగ్రహారం". నేడు గ్రామం లేకున్నాపొలాల మధ్య అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకొని దశాబ్దాలుగా నమ్మిన వారిని అనుగ్రహిస్తున్నారు. ముగురమ్మల మూలపుటమ్మ ఇక్కడ పదకొండు సంవత్సరాల బాలిక రూపంలో దర్శనమివ్వడానికి సంబంధించిన గాధ తాలూకు ఆరంభం యుగాల క్రిందటిదిగా తెలుస్తోంది. చివరికి కలియుగంలో అమ్మవారు ప్రకటితమవ్వడంతో ముగిసింది అని భావించవచ్చును. ఒకనాడు కైలాసంలో నటరాజు ఆనంద తాండవం చేస్తుండగా ప్రమధ గణాలు కూడా ఆయనతో నర్తించ సాగారట. ఆ అపురూప సందర్భంలో నంది కూడా తనకు తెలిసిన విధంగా నృత్యం చేయసాగాడట. అది చూసి పార్వతీ దేవి పగలబడి నవ్వసాగారట. అక్కడే ఉన్న నంది తండ్రి "శిలాద మహర్షి" ఆగ్రహించి, "భక్తి భావంతో నర్తిస్తున్న నా కుమారుని తల్లిలా ఆదరించకుండా రూపం చూసి పరిహసించిన నీవు ...
The Gopuram of this temple is used in the emblem of Tamil Nadu Government.The Andal temple is full of beautiful sculptures and carvings. A real treat to the eyes.
రిప్లయితొలగించండి