పోస్ట్‌లు

జనవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

Avanigadda Temples

చిత్రం
                                     అవనిగడ్డ ఆలయాలు  ఆలయ సందర్శనం అనగానే మనందరి దృష్టి తమిళనాడు, కేరళ లేకపోతే కర్ణాటక వైపు మళ్లుతుంది. కానీ మన రాష్ట్రంలో గ్రామగ్రామాన ఒక చక్కని పురాతన ఆలయం కనపడుతుంది.  సుందర శిల్పకళ , కొలువైన అర్చామూర్తి, గొలుసుకట్టు ఆలయాలలో భాగం ఇలా ఎన్నో విశేషాలు ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక ఆలయాలలో కనిపిస్తుంది.  లేపాక్షి, గుంటూరు సమీపంలోని చేబ్రోలు ఆలయాలు, చందోలు, మాచర్ల శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయం, చెరుకూరు, దుగ్గిరాల, నందివెలుగు, కొలకలూరు, శ్రీ వల్లభస్వామి ఆలయం, వంగిపురం, శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయాలు పొన్నూరు, బాపట్ల,  మరియు చినగంజాం. మరో గమనించదగిన అంశం ఏమిటంటే ప్రతి చోట ఒక శివాలయం మరియు ఒక విష్ణాలయం పక్కపక్కన ఉండటం నాటి పాలకుల ముందు చూపు తెలుపుతుంది.  ప్రతిఒక్క ఆలయం ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఒకదానిని మరో దానితో పోల్చలేము. అంతటి గొప్ప ఆలయాలు. ఆ కోవకు చెందినవే పవిత్ర కృష్ణానదీతీరంలోని అవనిగడ్డ పట్టణంలో నెలకొని ఉన్న ...

Sri Subrahmanya Swamy Temple, Mopidevi

చిత్రం
                      శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం - మోపిదేవి  ఆది దంపతులైన శివ పార్వతుల ప్రియా పుత్రుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన భారతదేశంలోనే కాదు పొరుగు దేశాలైన శ్రీలంక, మలేషియా, సింగపూర్, మారిషస్ మరియు మలేషియాలతో పాటు తమిళ ప్రజలు ఎక్కడ అధిక సంఖ్యలో ఉంటారో అక్కడ తప్పకుండా శ్రీ షణ్ముఖునికి ఒక ఆలయం తప్పకుండా ఉంటుంది.   శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనకు తమిళనాడులో  ప్రాధాన్యత కలిగి ఉన్నది. కారణం ఏమిటీ అంటే పురాతన తమిళ గ్రంధాలు తగిన వివరణ ఇస్తున్నాయి.  శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని వారు "మురుగ(క)" అని సంభోదిస్తారు.ఈ మూడు అక్షరాలు త్రిమూర్తులకు సంకేతం. "ము" అనగా శ్రీ మహావిష్ణువు మరో పేరైన ముకుందుడు అన్నదానికి, "రు" అంటే రుద్రుడు, "క "అంటే కమలాసనుడు బ్రహ్మకు సంకేతాలని పురాతన తమిళ గ్రంధాలు తెలుపుతున్నాయి. మురుగ అంటే స్ఫురద్రూపి, దైవత్వం, యువకుడు, మూర్తీభవించిన మగతనానికి నిదర్శనం అన్న అర్ధాలు ఉన్నాయి అని అంటారు.  స్వామి మరో పేరు షణ్ముఖ లేక ఆర్ముగం అనగా ఆరు ముఖాలు కలిగిన వాడు అని అర్ధం. ఈ ఆరు ముఖాలు పంచేద్రియాలకు మరియు ...

kalva bugga Sri Ramalingeswara Swami Temple, Kalvabugga, Kurnool district

చిత్రం
         పరశురామ ప్రతిష్ఠిత లింగం -శ్రీ రామలింగేశ్వరుడు  లయకారకుడైన పరమేశ్వరుని లింగాలను భారత దేశంలోని నలుమూలలా ప్రతిష్టించిన వారిలో లోక రక్షకుడైన శ్రీ మన్నారాయణుని అవతారలైన శ్రీ పరశురాముడు, శ్రీ దశరధ రాములదే అగ్రస్థానంగా పేర్కొనాలి.  వివిధ సందర్భాలలో వీరిరువురూ అనేక ప్రాంతాలలో ప్రతిష్టించిన లింగాలు నేటికీ కనపడుతుంటాయి. భక్తులను ఆకర్షిస్తున్నాయి.  పరశురాముడు  శ్రీ మహావిష్ణువు లోకసంరక్షణార్ధం ధరించిన అనేక అవతారాలలో ఆరవ అవతారం శ్రీ పరశురాముడు.  తండ్రి  మీద తల్లిని హతమార్చిన పాపనివృత్తి కొరకు అనేక పుణ్య తీర్ధాలను సందర్శిస్తూ కొన్ని చోట్ల లింగాలను ప్రతిష్టించారు. ఇరవై ఒక్కసార్లు నెల నలుచెరుగులా దండయాత్ర చేసి పాలకులను చంపి కూడగట్టుకున్న పాపానికి మరి కొన్ని పుణ్య ప్రదేశాలలో స్థాపించారు.  ,సముద్రుని నుండి తాను పొందిన భూమికి పాలకునిగా పరమేశ్వరుని నియమిస్తూ పరశురామ భూమిగా పిలిచే నేటి కేరళలో నూట ఎనిమిది లింగాలను ప్రతిష్టించారని మన పురాణాలు తెలుపుతున్నాయి.  ఈ విధంగా ఆయన తన ఆరాధ్య దైవాన్ని ప్రతిష్టించిన అనేక ప్రాంతాలు నేటి కేరళలో అధిక...