పోస్ట్‌లు

మార్చి, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

Tiruvattar sri aadi keshava perumal Temple

చిత్రం
                శ్రీ ఆదికేశవ పెరుమాళ్ కోవెల - తిరువట్టార్  ప్రపంచ ప్రఖ్యాత చెందినది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, తిరువనంతపురం. అలాంటి దానిని మరో ఆలయాన్ని చూసి ఆ ప్రకారం నిర్మించారని అంటే ఎవరైనా నమ్ముతారా ? కాని అది నిజం.  ఆధారాలు, ప్రమాణాలు, ప్రత్యక్ష నిదర్శనాలు తెలిపే వాస్తవం.  ఆ వివరాలు తెలుసుకొందాము.  భారత దేశ దక్షిణ భాగాన ఉన్న కన్యాకుమారి ఒక శక్తి క్షేత్రం.  దేశ విదేశ సందర్శకులు ఎంచుకొనే పర్యాటక స్థలాలలో తప్పక ఉండేది. ఎందరికో అద్భుత అనుభవాలను ప్రసాదించిన కన్యాకుమారి పరిసర ప్రాంతాలు పౌరాణికంగా, చారిత్రకంగా ప్రసిద్ది చెందిన ఆలయాలకు మరియు కడ్డడాలకు పేరొందాయి. అలాంటి వాటిల్లో ఒకటి " తిరు వట్టారు". పరలియార్ లేదా వట్టారు నది ఒక ద్వీప కల్పంగా మార్చిన తిరు వట్టారు చేరనాడు శ్రీరంగం, పరశురామ క్షేత్రం లేదా దక్షిణ వైకుంఠము గా ప్రసిద్ది. అనేక పురాతన తమిళ గ్రంధాలలో ఉదహరించబడిన తిరువట్టారు ఆలయం సుమారు పన్నెండు వందల సంవత్సరాలుగా భక్తుల విశ్వాసాన్ని చూరగోన్నట్లుగా అవగతమౌతోంది. సుమారు అరవై అడుగుల ఎత...

Tiruvalla - Sri Vallabha Swamy Temple

చిత్రం
    శ్రీ వల్లభ స్వామి ఆలయం - తిరువళ్ళ   అరుదైన వల్లభ క్షేత్రాలలో తిరువళ్ళ ఒకటి.  ఒకప్పుడు చిన్న పల్లె ప్రాంతం అయిన తిరువళ్ళ నేడు కేరళలో ఒక ప్రముఖ పట్టణం.  మణిమాల నదీతీరంలో ఉండటం వలన గతంలో "వళ్ళ వాయి " ( నదీ తీరం) అని పిలిచేవారట.  గౌరవ పదమైన "తిరు" (శ్రీ ) చేర్చి తిరువళ్ళ గా మార్పుచెందినది.   శ్రీ వల్లభ స్వామి కొలువు తీరిన క్షేత్రంగా కూడా ఈ పేరు వచ్చినది అంటారు.  . ఇక్కడ  శ్రీమన్నారాయణుడు  "ఘంటాసురుడు " అనే శివ భక్తుడైన అసురునికి ముక్తి ప్రసాదించారని అంటారు.  ఏడో శతాబ్దానికి చెందిన తమిళ గ్రంధాలలో తిరువళ్ళ ప్రస్తావన ఉన్నందున అంతకు పూర్వం నుండే ఈ క్షేత్రం గుర్తింపు పొందినదని భావించవచ్చును.  ఇతర ఆధారాల ద్వారా తిరువళ్ళ ఒకప్పుడు పేరుపొందిన విద్యా కేంద్రం.  కేరళ భూ భాగాన్ని సముద్రుని నుండి తీసుకొన్న తరువాత పరశురాముడు రప్పించిన అరవై నాలుగు బ్రాహ్మణ కుటుంబాలలో కొందరు ఇక్కడే స్థిరపడినారని తెలుస్తోంది.  ప్రధాన ఆధారాలుగా పేరొందిన వివిధ కాలాల తామ్ర ఫలకాల ద్వారా ఆలయ పౌరాణిక గాధ, చరిత్ర రెండువేల సంవత్సరాల...

Sri Kala Hanuman Temple, Hyderabad

చిత్రం
    శ్రీ కాలా హనుమాన్ మందిరం - (అత్తాపూర్) హైదరాబాద్   పవన సుతుడు పేరుకు తగినటులే భారత దేశంలో గాలి వీచే అన్నిప్రదేశాలలో కొలువుతీరి భక్తుల పూజలందుకొంటున్నారు. రామ భక్తుని ఆలయం లేని ఊరు కనపడదు.  కొన్ని చోట్ల ఉప దేవతగా వెలసినా ఆనతి కాలం లోనే ప్రధాన అర్చనా మూర్తిగా మారిన క్షేత్రాలు ఎన్నో కనపడతాయి. అలాంటి వాటిల్లో హైదరాబాద్ లోని శ్రీ కాలా హనుమాన్ మందిర్ ఒకటి.   ఎన్నో ఏళ్ళ క్రిందట స్థాపించబడిన ఈ మందిరం ఎంతో పౌరాణిక నేపద్యం కలిగి ఉన్నది. మన అందరికీ జనమేజయుడు చేసిన సర్పయాగం చేసిన విషయం తెలిసిందే ! తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుని వంశ నాశనార్ధమై జనమేజయుడు సర్పయాగాన్నితలపెట్టాడు. ఆ యాగానికి తగిన స్థలంగా భావించి చేసినదిక్కడే అని అంటారు. నిదర్శనంగా ప్రాంగణంలో ఉన్న పురాతన పుష్కరణి చూపుతారు. అదే నాటి యాగ గుండమని కాలక్రమంలో ఇలా కోనేరుగా రూపుదిద్దుకొన్నది అంటారు. గోల్కొండను పాలించిన తానీషా వద్ద మంత్రులుగా ఉండిన అక్కన్న మాదన్న సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది.   తదనంతర కాలంలో గుట్ట మీద ఉన్న గుహల...