పోస్ట్‌లు

అక్టోబర్, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

KALKA

చిత్రం
                          శ్రీ కాళీమాత కొలువుతీరిన కల్కా  అసురులను అంతం చేసి ముల్లోకాలను కాపాడిన లోకపావని, ముగురమ్మల రూపం అయిన శ్రీ కాళికా దేవి కోరి కొలువుతీరిన ప్రదేశం "కల్కా".  పురాణ గాధ : కృత యుగంలో క్రూరులైన రాక్షసులు దేవతలను, మునులను, సామాన్య ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుండేవారు.  వారి భాదను తట్టుకోలేక అంతా కలసి కైలాసానికి వెళ్లి సర్వేశ్వరుని శరణుకోరారు.  ఆయన వారికి అభయం ఇవ్వగలిగినది శక్తిస్వరూపిణి అయిన కాత్యాయని అని తెలిపారు.  అంతట వారంతా తమ స్తోత్రపాఠాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకొని, తమను లోకకంటకులైన  కిరాతకుల బారి నుండి కాపాడమని కోరారు.  ప్రసన్నురాలైన పరాశక్తి పసిపాపగా మారి , క్షణాలలో లోక భీకర రూపం ధరించారు.  అప్పుడు మహా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, శంకరుడు త్రిశూలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, యముడు తన పాశాన్ని, యిలా అందరూ తమ ఆయుధాలను, శక్తులను ఆమెకు యిచ్చారు.  పరిపూర్ణ శక్తిమంతురాలైన కాళికగా మారిన జగజ్జనని దుష్టులను తుదమ...

SUKHANA LAKE

చిత్రం
                                     సుఖన లేక్ , చండీఘర్  ఆధునిక భారత దేశంలో ఒక ప్రణాళికతో నిర్మించబడిన రెండు ముఖ్య పట్టణాలు భువనేశ్వర్ మరియు చండీఘర్.  పురాణ కాల చరిత్ర కలిగిన భువనేశ్వర్ క్రొత్త హంగులతో స్వాతంత్రానంతరం ఒడిష రాష్ట్ర రాజధానిగా రూపు దిద్దుకోన్నది.  కాని కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్ మాత్రం పంజాబు మరియు హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నది.  వరసకు సోదరులైన ఇద్దరు స్విస్ దేశస్తులు "లి-కొర్బూసియర్" మరియు "పియరీ - జియన్నరెత్" ల తో పాటు పి. యల్.  వర్మ నేటి చండీఘర్ రూపకర్తలు.     లి-కొర్బూసియర్ ( Le-corbusier ) 1887 - 1965 యూరప్, అమెరికా, భారత దేశాలలో ఎన్నో నిర్మాణాలకు రూపకల్పన చేసిన వాడు లి-కొర్బూసియర్.  ముఖ్యంగా ప్రజల సౌకర్యార్ధం, భావి తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాలికాబద్దంగా ఆధునిక నగరాల నిర్మాణంలో ప్రపంచ ప్రసిద్ది పొందిన వాస్తు శిల్పి....

penna ahobilam

చిత్రం
స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు ధరించిన అనేకానేక అవతారాలలో అత్యంత శక్తివంతమైనదిగా, ఆర్తులను రక్షించి, అపమృత్యు భయాన్ని తొలగించి సకల శుభాలను అనుగ్రహించేదిగా పేరుపొందినది శ్రీ నృసింహ అవతారం.   శ్రీ నరసింహ ఆరాధన దక్షిణ భారత దేశంలో ఎక్కువగా కనపడుతుంది.  మన ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో ప్రసిద్ద నరసింహ క్షేత్రాలున్నాయి.  అలాంటి వాటిల్లో ఒకటి అనంతపురం జిల్లాలోని పెన్నఅహోబిలం.   పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రానికి సంభందించిన పురాణ గాధ కృత యుగ సంఘటనలతో ముడిపడి ఉన్నది.  భక్త వరదుడైన శ్రీ మన్నారాయణుడు తండ్రి హిరణ్యకశపుని చేతిలో చిత్ర హింసలకు గురి అవుతున్న ప్రహ్లాదుని రక్షించ నారసింహ అవతారంలో బయలుదేరారు.  అలా బయలుదేరిన స్వామి తన తొలి అడుగు భూమి పైన పెట్టిన స్థలమే ఈ అహోబిలం. పెన్నా నదీ తీరంలో ఉన్నందున దీనిని "పెన్నఅహోబిలం" అని పిలుస్తారు.  (స్వామి తన రెండో అడుగును కర్నూలు జిల్లా లోని "అహోబిలం" లో పెట్టి హిరణ్యకశపుని సంహారించారని తెలుస్తోంది.) హిరణ్యకశప సంహారం తరువాత కలియుగంలో స్వామి వారి పాదం పడ...