పోస్ట్‌లు

ఆగస్టు, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

Maha Bharath - Characters

చిత్రం
                                 అందరూ పూజ్యనీయులే                                                                                                                = ఇలపావులూరి వెంకటేశ్వర్లు  భారత దేశం పుణ్య భూమి. వేద భూమి, దైవ భూమి, కర్మ భూమిగా పేరొందినది.  వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు పుట్టినదిక్కడే! అవి భారతీయుల నిత్య జీవితాల మీద తమవైన ముద్ర వేసాయి.  అందుకే వాటిల్లోని పాత్రలను ఆదర్శంగా ఎంచుకొన్నారు. తమ జీవితాలను వాటికనుగుణంగా మలచుకొని తమదైన  విశ్వాసాలతో, నమ్మకాలతో జీవనం కొనసాగిస్తున్నారు.  మహా విష్ణువు, సదాశివుడు, బ్రమ్హ దేవుడు, వారి అవతారాలు, మిగిలిన దేవతలు, దిక్పాలకులు, మహర్ష...

perunad ( RANNY )

చిత్రం
కార్తీక మాసం నుండి మన రాష్ట్ర నలుమూలల, గ్రామ గ్రామాన మాల ధరించిన అయ్యప్ప భక్తులు కనిపిస్తారు. నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తి చేసుకొని ఇరుముడి ధరించి పుణ్య క్షేత్ర దర్శనం చేసుకొంటూ శబరిమల చేరుకొంటారు. పరశు రామ భూమి అయిన కేరళలో ఆయనే ప్రతిష్టించిన నూట ఎనిమిది శ్రీ ధర్మ శాస్త ఆలయాలున్నాయి. అవన్నీ యుగయుగాల పౌరాణిక గాధలకు, శతాబ్దాల చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యాలు. కానీ వాటికి దక్కని ఒక గొప్ప గౌరవం పదో శతాబ్దంలో నిర్మించిన ఒక ఆలయానికి దక్కటం విశేషం. అదే కక్కట్టు కోయిక్కాల్ శ్రీ ధర్మశాస్తా ఆలయం. ఈ ఆలయము శబరిమల ఆలయం తో పాటు ఒకేసారి నిర్మించబడినది.  దీనికి సంభందించిన గాద పదో శతాబ్దానికి చెందినదిగా తెలుస్తోంది.  మహిషి సంహారం తరువాత శ్రీ అయ్యప్ప శబరిమల మూలవిరాట్టులో  ఐక్యం అయిన తరువాత ఆయన ఆనతి మేరకు పందల రాజు శబరిమల ఆలయ నిర్మాణం ఆరంభించారు.  నిర్మాణ సమయంలో రాజు ఇక్కడే బస చేసారట. గ్రామ ప్రజలందరూ నిర్మాణపు పనులలో పాలుపంచుకొన్నారు. వారందరికీ నాయకులుగా శివ వెళ్లల కులానికి చెందిన పిళ్ళై సోదరులు వ్యవహరించారు.  వారి దైవ భక్తికి, సహాయ సహకారాలకు ...

Ayothiyapattinam

చిత్రం
గతంలో ఆలయాలను బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేవారు అనిపిస్తుంది. ఆద్యాత్మిక కేంద్రాలుగా, ఉత్సవాలకు, సభలకు, సత్కార్యాలకు, యాత్రికులకు విడిది కేంద్రాలుగా, యుద్ద సమయాలలో సైనిక స్థావరాలుగా ఇలా ఎన్నో రకాలుగా ఆలయాలను రాజుల కాలంలో వినియోగించేవారని చారిత్రిక గ్రంధాల ద్వారా తెలుస్తోంది. అవసరాలకు అనుగుణంగా ఎన్ని రకాలుగా వినియోగించుకొన్నా నాటి రాజులు దేవాలయాలను దేవుని నిలయాల గానే భావించి అత్యంత భక్తిప్రపత్తులతో వాటిని అబివృద్ది చేసారని ఆ అద్భుత నిర్మాణాలను చూస్తే గ్రహించవచ్చును. అక్షర జ్ఞానం లేని వారు కూడా దైవ దర్శనానికి వస్తారు గనుక వాటిని లోక జ్ఞానం నేర్పేకేంద్రాలుగా తీర్చిదిద్దారు. తమ కళాభిమానం, శిల్పుల, చిత్రకారుల నైపుణ్యాన్ని తెలిపే  ప్రదర్శన శాలలుగా రూపొందించారు. ఈ విషయాన్ని ఎన్నోపేరొందిన  ఆలయాల దర్శనం ద్వారా అర్ధం చేసుకోవచ్చును. కఠిన శిలలను నేర్పరులైన శిల్పులు రమణీయ శిల్పాలుగా అవి కూడా సామాన్యులకు పురాణాల గురించి, భగవంతుని లీలల గురించి, ప్రాపంచిక విషయాల గురించి దృశ్య మాధ్యమంలో తెలిపే విధంగా మలచిన తీరు ప్రశంసనీయం. నాటి ప్రజలకే కాదు నేటికీ మనకు అలనాటి ప్ర...