పోస్ట్‌లు

2024లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Shobhanachala Vyaghra Narasimha Swami Temple, Agiripalli

చిత్రం
           శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి ఆలయం  లోకసంరక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించారు. విష్ణు పురాణం ప్రకారం శ్రీహరి మొత్తంగా ఇరవై నాలుగు అవతారాలు వివిధ సందర్భాలలో తీసుకొన్నారని తెలుస్తోంది.  కానీ మనందరికీ తెలిసినవి దశావతారాలు మాత్రమే. మిగిలిన వాటిలో కొన్ని పేర్లు తెలిసినా వారు శ్రీమన్నారాయణుని అంశ అని తెలియదు.  దశావతారాలలో అత్యంత భీకరమైనది ఉగ్రమైనది శ్రీ నృసింహ అవతారం.  అహోబిలం లో ఉగ్రస్థంభం నుండి అవతరించిన స్వామి అసురుడైన హిరణ్యకశ్యపుని సంహరించారని పురాణాలు తెలుపుతున్నాయి.  రాక్షససంహారం అనంతరం ఆవేశం తగ్గని నృసింహుడు మన తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో తిరుగుతూ వివిధ కారణాల వలన ముప్పై రెండు క్షేత్రాలలో కొలువైనారని చెబుతారు.  భక్త ప్రహ్లాద స్తోత్ర పాఠాలతో చివరికి శాంతించిన నరసింహుడు విశాఖపట్నం కు సమీపంలోని భీమునిపట్నం (భీమిలి) లో ఉన్న సౌమ్య గిరి పైన\శ్రీ సౌమ్య నారాయణ నరసింహుడుగా వెలిశారని చెబుతారు. స్వామివారు ఇక్కడ చతుర్భుజాలతో మానవ రూపంలో దర్శనమిస్తారు. సౌమ్య గిరిని స్థానికంగా పావురాల కొండ అని పిలుస్తా...

Sri Pattabhi Rama Temple, Lakkaraju Garlapadu

చిత్రం
                        పావనం పట్టాభిరాముని దర్శనం  మన దేశం దైవ భూమ. పురాణాల ఆధారంగా స్వయం సర్వాంతర్యామి నడయాడిన దివ్య భూమి.   మహర్షులు,గురువులు మరియు కవులు దేవదేవుని లీలలను కీర్తిస్తూ ఎన్నో  కావ్యాలు ,కీర్తనలు రచించారు.  అక్షరాస్యత తక్కువగా ఉన్నప్పటికీ  విని వల్లే వేయడం వలన  ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా కొనసాగుతూ ప్రజలలో ఆదిదేవుని పట్ల భక్తి విశ్వాసాలు స్థిరంగా ఉండిపోయినాయి.  పాలకులు కూడా ప్రజలలో నిరాకారుని పట్ల నెలకొని ఉన్న ఆరాధనను గమనించి ఉరూరా ఆలయాలను నిర్మించారు. వారి ఆదరణలో ఉన్న కవి పండితులు కూడా పరమేశ్వరుని కీర్తిస్తూ కావ్యాలను రచించారు.  పాలకుల వద్ద మంత్రులుగా, సేనాధిపతులుగా, దండనాయకులుగా, ఒక ప్రాంతానికి అధిపతులుగా ఉన్నవారు కూడా అనేక ఆలయాలను నిర్మించడం లేదా శిధిలావస్థలో ఉన్న ఆలయాలను పునః నిర్మించడం జరిగినట్లుగా శాసనాలు, స్థానిక కధనాలు తెలుపుతున్నాయి.  ఇలా నిర్మించబడిన ఆలయాలు దేశం నలుమూలలా కనిపిస్తాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అనేకం కనిపిస్తాయి. అవన్నీ కూడా స...

Anicent Temples In Tumuluru & Chilumuru

చిత్రం
                       శ్రీ సీతారామలక్ష్మణ ప్రతిష్ఠిత లింగాలు  మన దేశంలో అనేక పుణ్య తీర్థ క్షేత్రాలు నెలకొని ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసినదే ! కానీ తెలియనిది ఏమిటంటే మన పుణ్య భూమిలో చిన్న చిన్న గ్రామాలలో కూడా విశేష ప్రాధాన్యత కలిగిన ఆలయాలు ఉండటం ! ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో అనేక పురాతన ధామాలు కనిపించడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలి. మన రాష్ట్రం గుండా ప్రవహించే పావన జీవ నదులైన గోదావరి, కృష్ణ  మరియి పెన్నా నదీతీరాలలో ఏనాడో  రాజమహరాజులు నిర్మించిన ఆలయాలు కొన్ని శిధిలావస్థలో, మరికొన్ని స్థానిక భక్తుల సహకారంతో నూతనరూపు సంతరించుకోవడమో మనం చూడవచ్చును.  దీనికి కారణం ఈ ప్రాంతాలు కొన్ని యుగాల నుండి మునుల నివాసంగా, వారు తపస్సు చేసుకొన్న ప్రదేశాలుగా ఉండటం. మహర్షులు ఎందుకని నదీతీరాలలో నివసించేవారంటే జలం జీవం. వారి నిత్య అనుష్టానానికి నీటి అవసరం ఎంతైనా ఉన్నది.  కాలక్రమంలో ఈ ప్రాంతాలను పవిత్ర ప్రదేశాలుగా గుర్తించి పాలకులు ఆలయాలు నిర్మించడం జరిగింది.  తరిచి చూస్తే ప్రతి గ్రామంలోనూ ఒక శివాలయం, ఒక విష్ణు ఆలయం అలాగ...