పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

Thirunangnoor Divyadesam 3

                             తిరునాంగూర్ దివ్యదేశాలు - 3 తిరునాంగూర్ దివ్య దేశాలు ఆకారంలో చిన్నవి కావచ్చును కానీ ప్రాధాన్యతలో ఆధ్యాత్మికతలో పెద్దవిగానే పేర్కొనాలి.  ప్రతి ఆలయం ఒక తనదైన ప్రత్యేకతలతో, పరమాత్మను ఆకర్షించడమే కాక ఆళ్వార్లను కూడా ప్రభావితం చేయగలిగాయి.  తిరునాంగూర్ దివ్య దేశాల విశేషాల మూడవ భాగంలో మిగిలిన ఆలయాల గురించి తెలుసుకొందాము.  7. తిరు వైకుంఠ విన్నగరం  తిరునాంగూర్ దివ్య దేశాల వరుసలో ఏడవది అయిన ఈ దివ్య దేశం గురించి పద్మ పురాణంలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అగస్థ్య మహర్షి ఈ క్షేత్ర మహత్యం గురించి ఉపరిచర వాసు మహారాజుకు చెప్పినట్లుగా అవగతం అవుతోంది.  గతంలో శ్వేతకేతు అనే ఇక్ష్వాకు వంశ రాజుకు వైకుంఠవాసం చేయాలన్న తలంపు కలిగిందిట. సతీ సమేతంగా తీవ్ర తపస్సు చేసి వైకుంఠం చేరుకోగలిగారట. కానీ వారికి అక్కడ శ్రీ మన్నారాయణుని దర్శనం లభించలేదట. పైగా అక్కడ వారిని ఆకలిదప్పులు బాధించ సాగాయట.  ఈ పరిణామాలతో వ్యాకుల పడిన రాజ దంపతులు తిరిగి భూలోక మార్గం పట్టారట. మార్గమధ్యలో వారికి త్రిలోక స...

Nadakuduru Temple

చిత్రం
                                      నరకోద్ధారక క్షేత్రం   మన భారత దేశం పుణ్య భూమి. జగన్నాటక సూత్రధారి, అంతర్యామి అయిన నిరాకారుడు వివిధ రూపాలలో స్వయంగా నడయాడి స్థిరపడిన ప్రాంతాలు అనేకం కనిపిస్తాయి.  ముఖ్యంగా లయకారుడైన పరమేశ్వరుని ఆలయాలు లెక్కలేనన్ని అనేక ప్రాంతాలలో నెలకొని ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కటి ఒక పురాణ ప్రాశస్త్యం కలిగినది కావడం విశేషంగా చెప్పకోవలసిన సంగతి. అలాంటి విశేష క్షేత్రాలలో ఒకటి సర్వేశ్వరుడు శ్రీ పృథ్విశ్వర స్వామి గా కొలువు తీరిన నడకుదురు ఒకటి. చాలా విశేష క్షేత్రం గా వెలుగులోకి వచ్చిన ఈ క్షేత్ర విశేషాలను తెలుసుకొందాము.  ద్వాపర యుగం నాటి గాధలతో ముడిపడి ఉన్న క్షేత్రం. నరకాసుర సంహారం ఇక్కడే జరిగిందని, దీపావళి పర్వదినానికి నాంది పలికింది కూడా ఇక్కడే అన్నది వ్యాప్తిలో ఉన్న క్షేత్రపురాణం మాట.  స్కంద పురాణంలో ఈ క్షేత్ర ప్రస్తాపన ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.    నరకాసుర ప్రతిష్ఠిత లింగం  పావన కృష్ణా నదీ తీరంలో నెలకొన్న ఈ క్షేత్రంలో నరకాసురుడు ఈశ్వర కట...

Sri Vilvanatheswara Temple, Thiruvalam

చిత్రం
            శ్రీ విల్వనాథేశ్వర స్వామి ఆలయం, తిరువాళం   కైలాసనాధుడు పుడమిలో కొలువైన అనేక క్షేత్రాల గాధలు, ప్రత్యేకతలు ఒక్కదానితో మరొకటి పోల్చలేనివి. అంతటి విశేషతలు కలిగినవి. అలాంటి వాటిలో శ్రీ విల్వనాథేశ్వర స్వామి కొలువైన తిరువాళం ఒకటిగా పేర్కొనాలి.  తిరువాళం ముక్తి స్థలంగా కీర్తించబడినది.   క్షేత్రంలోని వినాయకుడు, అమ్మవారు,నందీశ్వరుడు ఆలయ వృక్షం అన్నీ కూడా తమవైన ప్రత్యేకతలు కలిగి ఉండటం చెప్పుకోవలసిన విషయం.  ఆలయ పురాణ గాథ  ఆలయ గాథ మనం అనేక శైవ క్షేత్రాలలో విన్నదే ! యుగాల క్రిందట ఈ ప్రాంతమంతా బిల్వ వృక్షాలతో నిండి ఉండేదట. సమీపంలోకి పశువుల కాపరులు తమ గోవులను మేత కోసం ఇక్కడికి తోలుకొని వచ్చేవారట.  గోవుల మందలో ఒక ఆవు బిల్వ వృక్షం క్రింద ఉన్న చీమల పుట్టలో పాలను ధారగా వదిలేదట. చూసిన కాపరులు గ్రామపెద్దకు మనవి చేశారట. వారు పుట్టాను తొలగించి చూడగా లోపల లింగరాజు దర్శనమిచ్చారట.  విషయం తెలిసిన ప్రాంత పాలకుడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారని ఆలయ గాథ\ తెలుపుతోంది.  అనంతర కాలంలో అరణ్యాన్ని, పక్కన ఉన్న పర్వతాలను"కంజన్"అనే రాక్షసుడు...