పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Jaganmohana Swami Temple, Ryali

చిత్రం
                    జగన్మోహనం జగన్మోహన స్వామి రూపం   ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరం దగ్గర జన్మించినది ఈ నది. జన్మస్థలమైన మహారాష్ట్ర నుండి తన ప్రయాణాన్ని ఆరంభించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘర్, ఒడిషా రాష్ట్రాల గుండా ప్రవహించి చివరికి మన రాష్ట్రంలోని గోదావరి జిల్లాలలో సముద్రంతో సంగమిస్తుంది ఈ పవిత్ర నదీమ తల్లి.   స్వయం గంగాధరుని జటాజూటాల నుండి జాలువారి భారత దేశంలోని అనేక రాష్ట్రాలలోని లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ ప్రవహించే పరమ పావన గంగా నది తరువాత అంతటి ప్రాముఖ్యం గల నది గోదావరి. పై సమాచారం ఆ నది గురించే ! మన దేశంలో రెండవ పెద్ద నదిగా సుమారు పదిహేను వందల కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ అయిదు రాష్ట్రాల లోని ఎన్నో వేల ఎకరాలను సాగు భూములుగా మారుస్తూ, వందల నగరాల ప్రజల దాహార్తిని తీరుస్తుంది గోదావరి తల్లి.  ప్రతి నదీ తీరంలో మాదిరిగానే గోదావరి తీరం కూడా కొన్ని వందల పుణ్య తీర్థ ధామాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రం లోని ఉభయ గోదావరి జిల్లాలలో అనేక పురాణ, చారిత్రక విశేషాలు కలిగిన క్షేత్రాలు ఉన్నాయి. అలా...

Thiruvannikkaval ( Jambukeshwaram)

చిత్రం
  శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయం, జంబుకేశ్వరం (శ్రీ రంగం) మానవునికి జీవాధారమైనవి పంచ భూతాలైన  నీరు, నిప్పు, నేల, నింగి మరియు గాలి. లోకాలను పాలించే సర్వేశ్వరుడు వీటికి ప్రతి రూపం. అందుకే మన పూర్వీకులు చరాచర సృష్టికర్త పట్ల కృతజ్ఞతా భావంతో ఆలయాలలో స్థాపించి ఆరాధిస్తున్నారు యుగయుగాల నుండి. అవే పంచ భూత స్థలాలైన సి చిదంబరం (ఆకాశం), కాంచీపురం (పృథ్వి), తిరువణ్ణామలై (అగ్ని), శ్రీకాళహస్తి (వాయువు) మరియు జంబుకేశ్వరం (జలం).  ఈ క్షేత్రాలలో నాలుగు తమిళనాడులో ఉండగా వాయు లింగం మన రాష్ట్రం లోని శ్రీకాళహస్తి లో ఉన్నది.  తొలి యుగంలో ఏర్పడిన ఆ స్థలాల విశేషాలు లెక్కలేనన్ని. ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం విశేష చారిత్రక  విషయాలతో, పురాణ గాధలతో, భక్తుల అనుభవాలతో అలరారుతున్నాయి. కొలిచిన వారికి కొంగు బంగారంగా పిలవబడుతున్నాయి.  వీటిల్లో సర్వ జీవులకు ప్రధాన జీవాధారమైన జలంతో ముడిపడి ఉన్న క్షేత్రం తమిళనాడులోని తిరుచునాపల్లి నగరానికి సమీపంలో కావేరి మరియు కొల్లిడాం నదుల మధ్య ఏర్పడిన శ్రీరంగ ద్వీపంలో ఉన్నది.  నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ప్రధమ స్థానంలో ఉన్న శ్రీ రంగనాధ స్వామి ఆలయాన...

Sri Abirameshwara Temple, Thiruvamattur

        శ్రీ అభిరామేశ్వర స్వామి ఆలయం, తిరువామత్తూర్   నయనారులు పాటికాలు గానం చేసిన రెండువందల డెబ్భై అయిదు పడాల్ పెట్ర స్థలాలలో ఒకటి  శ్రీ అభిరామేశ్వర స్వామి అమ్మవారు శ్రీ ముతాంబికై తో కొలువైన దివ్య క్షేత్రం తిరువామత్తూర్.  ఎన్నో పౌరాణిక విశేషాలకు నిలయమీ ఆలయం.  పురాణ గాధ  దక్షిణ పెన్నా నదిగా ప్రసిద్ధికెక్కిన పాలరు నది ఉప నది అయిన పంపా నదీతీరంలో ఉన్న ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్న గాధ తొలి యుగం నాటిదిగా తెలుస్తోంది.  భృంగి మహర్షి పరమ శివ భక్తుడు. ఒకసారి స్వామివారి దర్శనార్ధం కైలాసానికి వెళ్లారట. ఆది దంపతులు ఏకాంతంలో ఉన్నారని నంది మహర్షిని కైలాసం లోనికి అనుమతించలేదు. పైగా హేళన చేసాడట.  ఆగ్రహించిన మహాముని ఎలాగైనా శివ దర్శనం చేసుకోవాలని తలంచి తపశ్శక్తితో ఈగగా మారి స్వామివారి ఏకాంత మందిరం చేరి కనులు మూసుకొని ఒక్క స్వామివారికి మాత్రమే ప్రదక్షిణ చేసి వెళ్లిపోయారట.  విషయం తెలుసుకొన్న పార్వతీదేవి ఆగ్రహించి భృంగిని వన్ని వృక్షంగా మారిపొమ్మని శపించినదట. వన్నివృక్షం అనగా జమ్మి చెట్టు.  సదాశివుడు అమ్మవారిని శాంత పరచి భృంగి యొక్క శివ భక్...