పోస్ట్‌లు

అక్టోబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

Dabaleshwar Mahadev Mandir, Titlagarh

చిత్రం
                  శ్రీ ధవళేశ్వర్ మహాదేవ్ మందిర్, టిట్లాగర్హ్   లయకారుడైన నిరాకారునికి పుడమిలో ఉన్న ఆలయాలకు లెక్కలేదు. అందులోనూ ప్రతి ఒక్క ఆలయం తనదైన ప్రత్యేకతను చాటుకొంటాయి. అవడానికి లింగాకారుడైనా ఆ లింగాలు కూడా భిన్న రూపాలలో ఉండి వివిధ నామాలతో పిలవబడటం విశేషం. ఈ లింగాలలో చాలా వరకు స్వయం భూలు కావడం మరో ప్రస్తావించవలసిన అంశం.  ఈ లింగాలు ఎక్కువగా దట్టమైన అడవులలో, పర్వత ప్రాంతాలలో, సాగర సంగమ ప్రదేశాలలో  మరియు పవిత్ర నదీ తీరాలలో ఉన్నాయి. కానీ శక్తి ఆరాధన అధికంగా ఉండే ఒడిశా రాష్ట్రంలో అనేక లింగాలు కొండ గుహలలో ఉంటాయి. అన్నీ కూడా ఎత్తుగా, పెద్ద కైవారంతో కొద్ది కొద్దిగా పెరుగుతుంటాయి. ఉదాహరణకు కోరాపుట్ జిల్లాలో ఉన్న గుప్తేశ్వర్ గుహాలయాన్ని పేర్కొనవచ్చును. ఇలాంటి ఆలయాలు ఎక్కువగా మల్కనగిరి, బాలేశ్వర్, సంబల్పూర్ మరియు బోలంగిర్ జిల్లాలలో కనిపిస్తాయి. వీటి వెనుక చెప్పుకోదగిన పౌరాణిక లేదా చారిత్రక విశేషం ఉన్నది.  అలాంటి ఒక విశేష ఆలయం గత నెలలో సందర్శించుకునే అవకాశం వచ్చింది.ఆ విశేషాలు అందరితో పంచుకొందామన్న ఉద్దేశ్యంతో...

Marundeeshwara Temple, Thirukachur

చిత్రం
                  సర్వరోగాలకు మందు ఈ మహేశ్వరుడు   సింగపెరుమాళ్ కోయిల్ కి సమీపం లోని తిరుకచూర్ క్షేత్రం లోని మరో విశేష దేవాలయం శ్రీ మరుండేశ్వర స్వామి వారు కొలువైనది. ఈ ఆలయం ఉన్న రుద్రగిరి గతంలో అనేక మంది తాపసులకు నిలయంగా పేరొందినది అని పురాతన తమిళ గ్రంధాలు పేర్కొన్నాయి అని తెలుస్తోంది. ఎన్నో ఋష్యాశ్రమాలు ఇక్కడ ఉండేవట. ఎంతో పవిత్ర ప్రదేశంగా ఋషులు భావించిన ఈ క్షేత్ర గాధ దక్ష యజ్ఞం తో ముడి పడినట్లుగా తెలుపుతోంది.  పిలవని పేరంటానికి పతిదేవుని మాట దాటి వెళ్లిన దాక్షయాణి అక్కడ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞ గుండలో దూకి ఆత్మాహుతి చేసుకొన్న విషయం మనందరకూ తెలిసినదే !  ఆగ్రహించిన పరమేశ్వరుడు వీరభద్రాది గుణాల ద్వారా దక్ష యజ్ఞాన్ని భగ్నం చేయించి సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని విరాగిగా సంచరించసాగారట.  ఆయనను తిరిగి మామూలు స్థితికి తీసుకొని రమ్మని ముల్లోకవాసులు శ్రీమహావిష్ణువును ప్రార్ధించారట. అప్పుడు ఆయన తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుగా విభజించారట. అలా చక్రాయుధ వేగానికి సతీదేవి శరీరభాగాలు పుడమి మీద పలు చోట్ల పడినాయి....

Kachabeshwara Temple, Thirukachur

చిత్రం
                    మహాకూర్మం కొలిచిన మహేశ్వరుడు   మన దేశంలో గ్రామగ్రామాన, పట్టణ నగరాలలో ఎన్నో ఆలయాలు నెలకొని ఉన్నాయి. అన్నింటిలోనూ చరాచర సృష్టికి మూలాధారమైన ఈశ్వరుడే వివిధ నామాలతో రూపాలలో కొలువై ఉన్నారన్నది పెద్దల మాట, వీటిల్లో కొన్ని చోట్ల స్వయంభూ గా, మరికొన్ని చోట్ల స్వయంవ్యక్త గా మిగిలిన క్షేత్రాలలో ప్రతిష్ఠిత మూర్తిగా సర్వేశ్వరుడు ప్రజల పూజలు అందుకొంటున్నారు. పరమాత్మకు చేసే వివిధ పూజలు, సేవల సమయంలో పఠించే వేదం మంత్రాల కారణంగా దేవాలయ ప్రాంగణంలో ఇది అని చెప్పలేని గొప్ప అనుకూల శక్తి నెలకొని ఉంటుంది. అనిర్వచనమైన ఆ శక్తి దైవ దర్శనానికి విచ్చేసే భక్తుల మదిలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించి స్థిరపరుస్తుంది. అంతులేని శాంతిని ప్రసాదిస్తుంది. అద్భుతమైన ఆనందాన్ని అందిస్తుంది. కానీ అదే శక్తి కారణ జన్ముల హృదయ అంతరాంతరాలలో పూర్వ జన్మ పుణ్య ఫలాన అంతర్యామి పట్ల  ఏర్పడిన అనుభూతులను,భావాలను,భక్తిని అసంకల్పితంగా వెల్లడించేలా చేస్తుంది.  అలా జన్మించిన మహానుభావులకు యుగయుగాలుగా భారత దేశం పేరొందినది. వారు లోకరక్షకుని పట్ల తమకు గల అచంచల...