పోస్ట్‌లు

2020లోని పోస్ట్‌లను చూపుతోంది

Pakshi Theerdham

చిత్రం
               శ్రీ వేదగిరీశ్వర స్వామి ఆలయం- పక్షి తీర్థం    తెలుసుకోవలసిన  విషయం ఏమిటంటే ఒక క్షేత్రం పవిత్రమైనదిగా ప్రఖ్యాతి చెందడానికి అక్కడి పురాణ గాధ, కొలువైన దేవదేవుడు, దైవానుగ్రహం పొందిన భక్తులు, ఆలయ నిర్మాణ విశేషాలు మొదలగున్నవి ప్రధాన కారణాలవుతాయి. కానీ చిత్రంగా కైలాసనాధుడు శ్రీ వేదగిరీశ్వరునిగా పూజలందుకొంటున్న ఈ క్షేత్రం పైన పేర్కొన్నవి అన్ని ఉన్నా కూడా "పక్షి తీర్ధం" గా పేరు పొందినది. మనలో చాలా మందికి ఈ క్షేత్రం గురించి తెలుసు. కొందరు స్వయంగా పక్షులు అర్చక స్వామి చేతుల మీదగా ప్రసాదం స్వీకరించడం చూసిన వారు కూడా ఉండే ఉంటారు. కానీ ఆ రెండు పక్షులకు, ఈ క్షేత్రానికి ఉన్న సంబంధం తెలిసి ఉండక పోవచ్చును. తమిళనాడులోని అనేక విశేష శైవ క్షేత్రాలలో అగ్రస్థానంలో ఉన్నవాటిలో పక్షి తీర్థం ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చును.  ఈ క్షేత్రంతో ఎన్నో గాథలు ముడిపడి ఉన్నాయి.  పక్షి తీర్థం  అందుబాటులో లభిస్తున్న కథనాల ఆధారంగా ఈ పక్షులు  గత జన్మలో మానవులుగా పుట్టి మహర్షులుగా మారి చేసిన దైవ ధిక్కారానికి ప్రతిగా పొందిన శ...

Dabaleshwar Mahadev Mandir, Titlagarh

చిత్రం
                  శ్రీ ధవళేశ్వర్ మహాదేవ్ మందిర్, టిట్లాగర్హ్   లయకారుడైన నిరాకారునికి పుడమిలో ఉన్న ఆలయాలకు లెక్కలేదు. అందులోనూ ప్రతి ఒక్క ఆలయం తనదైన ప్రత్యేకతను చాటుకొంటాయి. అవడానికి లింగాకారుడైనా ఆ లింగాలు కూడా భిన్న రూపాలలో ఉండి వివిధ నామాలతో పిలవబడటం విశేషం. ఈ లింగాలలో చాలా వరకు స్వయం భూలు కావడం మరో ప్రస్తావించవలసిన అంశం.  ఈ లింగాలు ఎక్కువగా దట్టమైన అడవులలో, పర్వత ప్రాంతాలలో, సాగర సంగమ ప్రదేశాలలో  మరియు పవిత్ర నదీ తీరాలలో ఉన్నాయి. కానీ శక్తి ఆరాధన అధికంగా ఉండే ఒడిశా రాష్ట్రంలో అనేక లింగాలు కొండ గుహలలో ఉంటాయి. అన్నీ కూడా ఎత్తుగా, పెద్ద కైవారంతో కొద్ది కొద్దిగా పెరుగుతుంటాయి. ఉదాహరణకు కోరాపుట్ జిల్లాలో ఉన్న గుప్తేశ్వర్ గుహాలయాన్ని పేర్కొనవచ్చును. ఇలాంటి ఆలయాలు ఎక్కువగా మల్కనగిరి, బాలేశ్వర్, సంబల్పూర్ మరియు బోలంగిర్ జిల్లాలలో కనిపిస్తాయి. వీటి వెనుక చెప్పుకోదగిన పౌరాణిక లేదా చారిత్రక విశేషం ఉన్నది.  అలాంటి ఒక విశేష ఆలయం గత నెలలో సందర్శించుకునే అవకాశం వచ్చింది.ఆ విశేషాలు అందరితో పంచుకొందామన్న ఉద్దేశ్యంతో...