Sri Dharma Sastha Temple, Pakkil

పక్కిల్ శ్రీ ధర్మ శాస్త ఆలయం శ్రీ ధర్మశాస్త సంప్రదాయము, ఆరాధనకు కేంద్రమైన కేరళలోని వివిధ ప్రాంతాలలో మొత్తం నూట ఎనిమిది శాస్త ఆలయాలు నెలకొల్పబడినాయి. అన్నింటినీ శ్రీ పరశురాముడు ప్రతిష్టించినట్లుగా పురాణ గాధలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా ఈ క్షేత్రాలన్నీ ఎంతో పౌరాణిక చారిత్రక ప్రాధాన్యత కలిగినవి. వీటిల్లో కొన్ని చోట్ల స్వామి తన యోగముద్ర భంగిమలో కాకుండా ఇతర భంగిమలలో కొలువై ఉంటారు. అసలు దేవతల స్వస్థలంగా పిలవబడే కేరళను సృష్టించిన పరశురాముడు స్వయంగా ప్రతిష్టించి స్థాపించిన శ్రీ ధర్మశాస్త ఆలయాలు ఎనిమిది మాత్రమే అని కొందరు అంటారు. ఆ ఎనిమిది క్షేత్రాలలో కొట్టాయం కు చేరువలో ఉన్న పక్కిల్ గ్రామంలో ఉన్న ఆలయం ఒకటిగా పేర్కొనబడినది. శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన శ్రీ పరశురాముడు శ్రీ ధర్మశాస్తాను క్షేత్ర రక్షకునిగా నియమించారట. అందుకనే కేరళ లోని అన్ని ఆలయాలలో శ్రీ ధర్మశాస్త ఉపాలయంలో దర్శనమిస్తారు. మహిళలు ఈ ఉపాలయాలలోని స్వామిని దర్శించుకొనవచ్చును. కానీ ముఖ్యమైన క్షేత్రాలైన శబరిమల, అరియంగావు, అచ్ఛంకోవిల్, కులత్తపుల, శాస...