పోస్ట్‌లు

జులై, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

Machilipatnam Temples

చిత్రం
                              శ్రీ పాండురంగ స్వామి ఆలయం   భగవంతుడు నిజ భక్తుని కొంతకాలం పరీక్షించినా అనంతరం అనంతమైన ఆనందాన్ని తన దర్శనం తో ప్రసాదిస్తాడు అన్నదానికి ఈ కలియుగం లో అందులో గత శతాబ్దంలో ప్రత్యక్ష ఉదాహరణ కృష్ణా జిల్లా లోని మచిలీపట్టణం లో స్వయంభూగా శ్రీ పాండురంగ స్వామి వెలసిన "కీర పండరిపురం" క్షేత్రం.  ఎన్నో ఉపాలయాలతొనిత్యం వందలాది భక్తులతో శోభాయమానంగా ఉండే ఈ క్షేత్రం నిశ్చల భక్తితో స్వామిని నమ్మిన భక్త తిలకం యొక్క నిజ భక్తికి తార్కాణం.  నమో నారాయణాయ నమః !!!

Indukurupet Temples

చిత్రం
          శ్రీ యోగాంజనేయ మరియు శ్రీ సాయిబాబా మందిరాలు. కొత్తూరు  నెల్లూరు పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందుకూరుపేట మండలం లోని కొత్తూరు గ్రామంలో స్థానిక వ్యాపారి ఒకరు నూతనంగా నిర్మించిన రెండు అద్భుత మందిరాలు శ్రీ షిరిడి సాయిబాబా మరియు శ్రీ యోగాంజనేయ స్వామి.   తూర్పు పడమర దిశలలో ఒకదానికి ఒకటి ఎదురుగా చక్కని ప్రశాంత సుందర  పల్లె ప్రకృతి వాతావరణం లో ఉండే ఈ మందిరాలు రమణీయ శిల్పాలతో ఉప ఆలయాలతో నిర్మించబడినాయి. శ్రీ షిరిడి సాయి బాబా ఆలయం పడమర ముఖంగా శ్రీ గణేష, శ్రీ ధర్మశాస్త, శ్రీ దత్తాత్రేయ మరియు నవగ్రహ మండపం తో పాటు శ్రీ బాబా కు ప్రియమైన ధుని కలిగి ఉంటుంది. మందిరం లోపల షిరిడి లోని విగ్రహాన్ని తలపించే బాబా విగ్రహం నయన మనోహరంగా దర్శనమిస్తుంది. ప్రతి నిత్యం నియమంగా నాలుగు హారతులు ఇతర సేవలు బాబా కు జరుగుతాయి.  తూర్పు ముఖంగా నిర్మించబడిన శ్రీ యోగాంజనేయ స్వామి వారి మందిరంలో వెలుపలి ప్రదక్షిణ ఫదంలో అనేక దివ్య క్షేత్రాల దేవి దేవతల రూపాలను, కుబేరుని లాంటి దిక్పాలక మరియు మహర్షుల విగ్...