పోస్ట్‌లు

ఆగస్టు, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Durga bhavani Temple, Dhanakonda, Vijayawada

చిత్రం
                        శ్రీ దుర్గ భవాని ఆలయం, విజయవాడ  ఇంతకు ముందు  చెప్పినట్లు మన రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ సరైన విషయసమాచారం అందుబాటులో లేకపోవడాన అవి పూర్తిగా వెలుగు లోనికి రావడం లేదు.  అలాంటి ఒక ఆలయం మన విజయవాడ నగర నడిబొడ్డున ఉన్నది అంటే ఆశ్చర్యం వేస్తుంది.  ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ మొదట ఇక్కడే కొలువై ఉండేదన్నది క్షేత్రపురాణం.  గుంటూరు నుండి వస్తున్నప్పుడు వారధి మీద నుండి  ఎదురుగా చూడండి ఈ సారి ఎత్తైన కొం మీదకు వెళ్లే దారి పైన ఆలయం కనపడతాయి. అదే శ్రీ దుర్గా భవానీ దేవి కొలువైన ధనకొండ.  ఒకప్పుడు మొఘల్ రాజు విడిది చేసిన ప్రదేశం కావడం వలన మొఘల్రాజ పురం అనిపిలుస్తారు.   ఒకప్పుడు ఊరికి దూరమేమో కానీ నేడు ప్రధాన వ్యాపార, విద్యాసంస్థల, గృహాల సముదాయంతో నిండి ఉంటుంది మొఘల్రాజపురం.  సరిగ్గా అక్కడే ఎత్తైన ధనకొండ మీద శ్రీ దుర్గాభవాని కొలువైన వృత్తాంతం ఏమిటో తెలుసుకొందాము.           క్షేత్రగాధ  సుమారు రెండువం...

Vadakkunathar Temple, Thrissur

చిత్రం
                                  కేరళ లోని తొలి శివ క్షేత్రం  కేరళ రాష్ట్రానికి ఉన్న మరో పేరు "దేవతల స్వస్థలం".  ఈ పేరు రావడానికి గల కథ శ్రీ మహా విష్ణువు లోకసంరక్షణార్ధం ధరించిన అనేకానేక అవతారాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ పరశురామావతారం తో ముడిపడి ఉన్నది.   ఏమా కథ అంటే ముందుగా శ్రీ పరశురాముని గురించి తెలుసుకోవాలి.  శ్రీ పరశురాముడు  మహర్షి జమదగ్ని , రేణుక దంపతులకు శ్రీ మహా విష్ణువు భార్గవ రామునిగా జన్మించారని పురాణాలు తెలుపుతున్నాయి.  జమదగ్ని మహర్షి వద్ద "సురభి"అనే ఆవు ఉండేదట. కామధేనువు గర్భాన జన్మించిన సురభి తల్లి మాదిరి కోరినవన్నీ ప్రసాదించే శక్తి కలిగి ఉండేది. వేటకు వచ్చి అలసిపోయి మహర్షి ఆశ్రమంలో ఆతిధ్యం స్వీకరించాడు ఆ ప్రాంత పాలకుడైన కార్తవీర్యార్జనుడు.  సురభి సంగతి తెలిసి తనకు ఇవ్వమని కోరారట. జమదగ్ని మహర్షి నిరాకరించడంతో ఆయనను సంహరించి గోవును బలవంతంగా తీసుకొని పోయారట. ఆ సమయంలో ఆశ్రమంలో లేని పరశురాముడు ఆగ్రహించి ద్వంద యుద్ధంలో కార్తవీర్యార్జుని అంతం చేశారట....

Sri Bramaramba Sameta Sri Bugga Malleswara Swami Temple, Morjampadu

చిత్రం
                               దక్షిణ శ్రీశైలం  మోర్జంపాడు జిల్లాలోని చాలా మందికి కనీసం పేరైనా తెలియని కృష్ణానదీతీరం లోని చిన్న గ్రామం మోర్జంపాడు.  కానీ చారిత్రకంగా పౌరాణికంగా గొప్ప పేరున్న తీర్థ పుణ్య క్షేత్రం.  ఆలయ పూర్వ గాథ  ఎవరు ప్రతిష్టించారో తెలియదు ? ఎప్పుడు ప్రతిష్టించారో అస్సలు తెలియదు ? ఎవరు తొలి ఆలయాన్ని నిర్మించారో కూడా తెలియదు ? ఎన్నో విషయాలు గుప్తంగా ఉన్న మోర్జంపాడు ఒకప్పుడు మునివాటిక అని అంటారు. సహజంగా మహర్షులు నిత్య అనుష్టానానికి నీరు అవసరమని ఆశ్రమాలను ఎక్కువగా నదీతీరాలలో ఏర్పాటు చేసుకొంటుంటారు. అదేవిధంగా నిత్య పూజల నిమిత్తం ఒక శివ లింగాన్ని కూడా ప్రతిష్టించుకొనే వారు అని తెలుస్తోంది.  అలా వందల సంవత్సరాల క్రిందట మహర్షులు ప్రతిష్టించిన శివలింగమే నేటికీ శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామిగా పూజలు అందుకొంటోంది.  పద్దెనిమిదో శతాబ్దంలో అమరావతి జమీందారు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ప్రాంతాలలో పర్యటించారట. ఆ సమయంలో ఆలయం గురించి తెలిసి సపరివారంగా విచ్చేసి పూజలు చేయిం...