Jagannadha Gattu, Kurnool

జటాధరుని నెలవు - జగన్నాధ గట్టు మనందరం చూడక పోయినా విని లేదా చదివి ఉంటాము ఈ విషయం గురించి. అదేమిటి అంటే శ్రీ శైలం దగ్గరలో సంవత్సరంలో ఎనిమిది నుండి తొమ్మిది నెలలు కృషాణాదిలో మునిగి ఉంది మూడు నెలలు మాత్రమే దర్శన భాగ్యం కలిగించే శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం, మచ్చుమర్రి (కర్నూలు జిల్లా ఆత్మకూరు కి ముప్పై కిలోమీటర్ల దూరం). ఒకప్పుడు ఈ ప్రాంతం పవిత్ర నదుల సంగమ క్షేత్రంగా ప్రసిద్దికెక్కి అనేక ఆలయాలు ఇక్కడ ఉండేవట. కానీ కృష్ణానది మీద శ్రీ శైలం ఆనకట్ట 1981వ సంవత్సరంలోనిర్మించడం వలన వీటిలో చాలా ఆలయాలు నీట మునిగిపోయాయి. వాటిలో ఒకటి శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం. నదిలో నీటి ప్రవాహం తగ్గిన సమయంలో అనగా జనవరి లేదా ఫిబ్రవరి నుండి జూన్ వరకు శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం వెలుపలికి వస్తుంది. తిరిగి వర్షాలు పడగానే నీటి ప్రవాహం పెరిగి జలాధివాసం లోనికి స్వామి వెళ్ళిపోతారు. కొన్ని ఆలయాలను ఆ సమయంలో కర్నూలు, ఆలంపూర్ లాంటి ప్రదేశాలకు తరలించారు. అసలు మచ్చుమర్రి ప్రాంతం ఎందుకు పవిత్ర క్షేత్రంగా పేరొందినది ? ఆ విషయం తెలుసుకొందామ...