పోస్ట్‌లు

మే, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

Thadalan Koil, Sirkazhi

                                    తాదళన్  కోవెల  గతంలో మనం శిర్కాలి చుట్టుపక్కల ఉన్న పదకొండు తిరునాన్గూర్ శ్రీ వైష్ణవ దివ్యదేశాల గురించి తెలుసుకున్నాము.  శిర్కాలి లోనే మరికొన్ని దివ్యదేశాలు ఉన్నాయి. కానీ అవి తిరునాన్గూర్ శ్రీ వైష్ణవ దివ్యదేశాల క్రిందికి రావు. కానీ వాటిల్లో కూడా పాశుర గానం చేసింది తిరుమంగై ఆళ్వార్ మాత్రమే !  దివ్యదేశాలలో అధికశాతం శ్రీ మహా విష్ణువు ఉపస్థిత, స్థానక మరియు శయన భంగిమలలో కొలువై దర్శనమిస్తారు. శ్రీ రామునిగా, శ్రీ కృష్ణునిగా, శ్రీ నారసింహునిగా దర్శనమిచ్చే క్షేత్రాలు కొద్ది. ఇక మిగిలిన దశావతారాల రూపాలలో కనపడేది ఇంకా స్వల్పం. చిత్రంగా మూడు దివ్యదేశాలలో స్వామి త్రివిక్రమునిగా కొలువై ఉంటారు. అవి శ్రీ ఉలగండ పెరుమాళ్ కోవెల, కాంచీపురం, శ్రీ ఉలగనాథ పెరుమాళ్ కోవెల, తిరుక్కోవిలూర్. మూడవది శిర్కాలి లోని శ్రీ కలి శీరం విన్నగరం.  ఈ క్షేత్ర గాధ కూడా మిగిలిన రెండు దివ్య దేశాల పౌరాణిక గాధ కూడా ! పౌరాణిక గాధ  ప్రహ్లాదుని మనుమడైన బలి  చక్రవర్తి మహావీరుడు....

Singaraya Konda

చిత్రం
                       సింగరాయ కొండ సింహాద్రి అప్పన్న    అత్యంత అరుదైన రూపంలో శ్రీహరి శ్రీ వరాహ, శ్రీ నరసింహ రూపాలను ఒకే రూపంలో ప్రదర్శిస్తూ కొలువైన క్షేత్రం సింహాచలం.  సంవత్సరానికి ఒక్కరోజున (అక్షయ తృతీయ) స్వామివారిని నిరంతరం కప్పివుంచే చందనాన్ని తొలగించి నిజరూప దర్శనాన్ని భక్తులకు ప్రసాదిస్తారు. తిరిగి అంచెలంచెలుగా చందనంతో స్వామిని కప్పుతారు. ఇలాంటి రూపాన్ని, ఇంతటి అరుదైన అలంకరణను శ్రీమన్నారాయణుడు మరెక్కడా కలిగి ఉండరు.  అలా చందనంతో కప్పి ఉండక పోయినా, ఒకే మూర్తిలో రెండు రూపాలు లేకపోయినా  శ్రీ నారసింహ స్వామి కొలువైన మరో క్షేత్రాన్ని దక్షిణ సింహాచలంగా పిలుస్తారు. అదే ప్రకాశం జిల్లాలోని " సింగరాయ కొండ".  ఎంతో విశేష పౌరాణిక గాధకు, చరిత్రకు నిలయం సింగరాయ కొండ.  సింహాలకు, సకల ప్రాణకోటికి రాజైన శ్రీ నరసింహుడు కొలువైన కొండ తొలుత "సింగర కొండ" గా పిలువబడి అనంతర కాలంలో "సింగరాయ కొండ"గా పిలవబడుతోంది.  ఈ క్షేత్రంలోని శ్రీ నారసింహస్వామి త్రేతాయుగంలో శ్రీ రామచంద్ర మూర్తి ప్రతిష్టించారు అని అంటారు....