పోస్ట్‌లు

ఏప్రిల్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

Tiruvetakalam

                పార్దుడు పాశుపతం పొందినది ఇక్కడే  వనవాస కాలంలో సమయం వృథా చేయకుండా రాబోయే యుద్ధంలో ఉపయోగపడే పాశుపతాస్ర్తము పొందమని పాండవ మధ్యమునికి సలహ ఇచ్చారు శ్రీ కృష్ణ భగవాన్.  ఆ ప్రకారం అరణ్యంలో పరమేశ్వర అనుగ్రహం కొరకు తపస్సు చేయసాగాడు అర్జునుడు.   ఒకనాడు అడవి పంది ఒకటి దాడి చేయడానికి రాగా ఫల్గుణుడు దాని మీదకు శరం వేశాడు.  ఇంతలో మరోవైపు నుంచి మరో బాణం పందిని తాకింది.  సూకరం మృతి చెందింది.   " నేను వేసిన బాణం వలన నే చచ్చింది కనుక వేట నాది" అంటూ ప్రవేశించాడొక వేటగాడు. అతని పాటు భార్య ఇతర అనుచరులు ఉన్నారు.  " పందిని కావాలంటే తీసుకో!  కాని దాని చావుకు కారణం నేను సంధించిన శరం " అన్నాడు విజయుడు.  వాదం పెరిగి చివరకు ఇరువురి మధ్య యుద్దానికి దారి తీసింది. భీకరమైన పోరు జరిగింది. అర్జనుని శరాఘాతానికి అంతర్యామి గాయపడ్డారు. అప్పుడు ఆయన తన నిజస్వరూపం ధరించారు. తెలియకుండా చేసిన తప్పు క్షమించమని ప్రార్దించాడట పార్దుడు.   ఆశీర్వదించి పాశుపతం అనుగ్రహించారట. గాయపరచిన వానిని దగ్గర...

Chidambaram Padal Petra sthalams

చిత్రం
                            చిదంబర పడాల్ పేట్రస్ధలాలు   తమ తమ ఆరాధ్యదైవాలను కీర్తిస్తూ ఆళ్వారులు మరియు నయనారులు గానం చేసిన పాశురాలు , పాటికాల కారణంగా అనేక మహిమాన్విత క్షేత్రాలు వెలుగు చూసాయి . అవి అంతకు ముందు నుంచే ఉన్నా వీరి గానం వలన దివ్య దేశాలు మరియు   పడాల్ పేట్రస్ధలాలు గా అపురూప గౌరవాన్ని సొంతం చేసుకొన్నాయి . మనకు దర్శించుకొనే అవకాశం లభించింది . పన్నిద్దరు వైష్ణవ ఆళ్వారులు పాడిన పాశురగానం వలన నూట ఎనిమిది శ్రీ వైష్ణవ ఆలయాలు దివ్య దేశ హోదా పొంది ప్రసిద్ధి చెందాయి .  వీటిలో అధిక భాగం తమిళనాడు లోనే ఉన్నాయి . ఒకటి పొరుగు దేశం అయిన నేపాల్ లో ఉన్నది . మిగిలినవి కేరళ , ఉత్తర ప్రదేశ్ మరియు మన రాష్ట్రంలో కలవు . చివరి రెండు అయిన తిరుప్పాలకడల్ మరియు పరమ పదం శ్రీ మహవిష్ణువు నివసించే పాలకడలి , శ్రీ వైకుంఠం . నిజ భక్తుల కోరిక ఇష్ట దైవ సన్నిధే కదా !   మన రాష్ట్రంలో ఉన్న దివ్య దేశాలు కలియుగ వైకుంఠం తిర...